All Party Meeting: పార్లమెంట్ అనెక్స్ భవనంలో అఖిలపక్ష భేటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
All Party Meeting: బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో పార్లమెంట్ అనెక్స్ భవనంలో కేంద్రం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి నేతృత్వంలో సమావేశం జరుగుతోంది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు సహకరించాలని అఖిలపక్ష నేతలను కేంద్రం కోరింది. అఖిలపక్ష సమావేశానికి కేంద్రమంత్రులు రాజ్ నాథ్ సింగ్,పీయూష్ గోయల్,అర్జున్ రామ్ మేగ్వాల్,వి.మురళీధరన్ హాజరయ్యారు.
ఈ సమావేశానికి తెలుగురాష్ట్రాల నుంచి బీఆర్ఎస్, వైసీపీ, టీడీపీ పార్లమెంటరీ పక్ష నేతలు హాజరయ్యారు. బీఆర్ఎస్ నుంచి కె.కేశవరావు, నామా నాగేశ్వరరావు, వైసీపీ నుంచి విజయసాయిరెడ్డి, టీడీపీ నుంచి గల్లా జయదేవ్ అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్నారు. నేషనల్ కాన్ఫరెన్స్ నుంచి ఫరూక్ అబ్దుల్లా, ఆర్జేడీ నుంచి ప్రొఫెసర్ మనోజ్ ఝా, జేడీయూ నుంచి రామ్ నాథ్ ఠాకూర్ తదితరులు హాజరయ్యారు. శివసేన (ఉద్ధవ్ థాకరే) తరపున ప్రియాంక చతుర్వేది ప్రాతినిధ్యం వహించారు. కాంగ్రెస్ నాయకులు సమావేశానికి గైర్హాజరయ్యారు, అయితే, ప్రభుత్వ వర్గాల ప్రకారం మల్లికార్జున్ ఖర్గే, అధిర్ రంజన్ చౌదరి ఇద్దరూ కొనసాగుతున్న భారత్ జోడో యాత్ర ముగింపు సభ కారణంగా హాజరు కాలేదని తెలుస్తోంది.
Also Read
- Clash Between Punganur TDP Activits: కొట్టుకున్న పుంగనూరు తెలుగు తమ్ముళ్లు.. సమావేశం రద్దు
- India-US: అమెరికాతో ఒప్పందం వద్దనుకుంటున్నట్లు కథనాలు.. పీయూష్ గోయల్ క్లారిటీ
- Shabad Murders Case: షాబాద్ హత్యల కేసులో ట్విస్ట్.. సైకో రాజ్కుమార్ మృతదేహం లభ్యం..
- Bengaluru: ప్రేమికుడిని పెళ్లాడిన 4 నెలలకే ఉపాధ్యాయురాలు ఆత్మహత్య.. సూసైడ్ నోట్లో ఏం రాసిందంటే..!
Bharat Jodo Yatra: నేడు భారత్ జోడో యాత్ర ముగింపు సభ.. ప్రతిపక్షాలు ఏకతాటిపైకి వస్తాయా?
బడ్జెట్ సమావేశాలు రెండు భాగాలుగా జరగనున్నాయి.పార్లమెంటు ఉభయ సభల ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేసిన ప్రసంగంతో సెషన్ ప్రారంభమవుతుంది. రాష్ట్రపతి ప్రసంగం అనంతరం ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టనున్నారు.ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ను సమర్పించనున్నారు. కేంద్ర బడ్జెట్ 2023-24 లోక్సభ ఎన్నికలకు ముందు చివరి పూర్తి బడ్జెట్ కావచ్చు. మొదటి భాగం జనవరి 31 నుంచి ఫిబ్రవరి 13 వరకు జరగనుంది.
తాజావార్తలు
-
Clash Between Punganur TDP Activits: కొట్టుకున్న పుంగనూరు తెలుగు తమ్ముళ్లు.. సమావేశం రద్దు
-
India-US: అమెరికాతో ఒప్పందం వద్దనుకుంటున్నట్లు కథనాలు.. పీయూష్ గోయల్ క్లారిటీ
-
Shruti Haasan: రమ్యకృష్ణ బ్యూటీ సీక్రెట్ రివీల్ చేసిన శృతిహాసన్.. అసలు కారణం ఇదేనట!
-
Jani Master: శేఖర్ మాస్టర్తో గొడవ? మెగాస్టార్ చిరంజీవి ఎంట్రీ.. అసలు నిజం బయటపెట్టిన జానీ మాస్టర్!
-
Raaka : డ్యూయల్ కాదు ట్రిపుల్ కాదు.. అంతకుమించి రాకా!
ట్రెండింగ్
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!