NTV Telugu Site icon

Akhilesh Yadav: ఔరంగజేబు సమాధిపై వివాదం.. అఖిలేష్ యాదవ్ రియాక్షన్ ఇదే..

Akhilesh Yadav

Akhilesh Yadav

సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు, ఎంపీ అఖిలేష్ యాదవ్ మంగళవారం సంభాల్, ఔరంగజేబు సమస్యలపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకున్నారు. అధికార బీజేపీ పార్టీ మతపరమైన ప్రదేశాలను ప్రమాదంలో పడేస్తోందని, మతపరమైన ఉద్రిక్తతను ప్రోత్సహిస్తోందని ఆయన ఆరోపించారు. ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి సంభాల్, ఔరంగజేబు వంటి అంశాలను లేవనెత్తుతుందని అఖిలేష్ యాదవ్ అన్నారు.

READ MORE: Ponnam Prabhakar: మా జిల్లాలోని దేవాలయాలపై ప్రకటనలు చేశారు.. డబ్బులు ఇవ్వలేదు!

రోజా ఇఫ్తార్ అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. “రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితితో పాటు, ఆరోగ్యం, విద్య సేవలు కూడా దెబ్బతిన్నాయి. కానీ బీజేపీ ప్రభుత్వం మాత్రం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఇలాంటి అంశాలను లేవనెత్తుతుంది. బీజేపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో శాంతిభద్రతలు కుప్పకూలిపోయాయి. హత్యలు, దోపిడీలు, నేరాలు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. ప్రభుత్వ రక్షణలో రౌడీలు, సంఘ వ్యతిరేకు,లు నేరస్థుల నైతికత పెరిగింది. ప్రభుత్వం పోలీసులతో తప్పుడు పనులు చేయిస్తూ.. అన్యాయాన్ని ప్రోత్సహిస్తోంది. షాజహాన్‌పూర్‌లో పోలీసులను వెంబడించి కొట్టారు. బరేలీలో డిఎస్పీ ఇల్లు, కారు తగలబెట్టారు. జైలు అధికారులు తమ సొంత అధికారిపైనే ఆరోపణలు చేస్తూ ఫిర్యాదు చేస్తున్నారు. కానీ ఎటువంటి విచారణ జరగడం లేదు. బదులుగా ఫిర్యాదుదారుడిపై చర్యలు తీసుకున్నారు. రాజకీయ లబ్ధి కోసం బీజేపీ పోలీసులను దుర్వినియోగం చేస్తోంది.” అని ఎస్పీ నాయకుడు అఖిలేష్ యాదవ్ ఆరోపించారు.

READ MORE: Virat Kohli: కోహ్లీ వ్యాఖ్యలు.. వెనక్కి తగ్గిన బీసీసీఐ..!