నందమూరి బాలకృష్ణ బ్లాక్బస్టర్ సినిమా ‘అఖండ’ కు సీక్వెల్గా వస్తున్న ‘అఖండ 2: తాండవం’ కోసం అందరూ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బాలయ్యను మాస్ అవతార్లో చూపించే డైరెక్టర్ బోయపాటి శ్రీను ఈ సినిమాను తీస్తున్ను మరింత పవర్ఫుల్ గా తెరకెక్కిస్తున్నాడు. పోస్టర్లు, ట్రైలర్లు చూస్తుంటేనే ఈ సినిమాకి ఏ రేంజ్ క్రేజ్ ఉందో అర్థమవుతోంది. అసలైతే ఈ సినిమా పోయిన వారం రావాల్సింది, కానీ కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. ఇక తాజాగా కొత్త డేట్ ఫిక్స్ అవ్వగా డిసెంబర్ 11న అంటే నేడు పెయిడ్ ప్రీమియర్స్ పడుతుండగా, డిసెంబర్ 12న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.
ఈ నేపథ్యంలో టికెట్ బుకింగ్స్ ఓపెన్ అయ్యిన వెంటనే అభిమానులు తక్షణమే స్పందించారు.ఒక్క గంటలోనే 18.5K టికెట్లు సేల్ కావడం సినిమాపై ఉన్న మాసివ్ బజ్కు నిదర్శనం. బాలయ్య ఫ్యాన్స్ మాత్రమే కాదు… యాక్షన్ లవర్స్, సాధారణ మూవీ బఫ్స్ కూడా ఈ సినిమాను ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలని ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. పైగా పెయిడ్ ప్రీమియర్స్ టికెట్లు ఓపెన్ అయితే ఇంకెంత డిమాండ్ ఉండబోతుందో ఊహించుకోవచ్చు. దీంతో ‘అఖండ 2: తాండవం’ ఏడాది చివర్లో బాక్సాఫీస్ను షేక్ చేయడం పక్కా అని ఇండస్ట్రీ టాక్. బాలయ్య మాస్ రేజ్, బోయపాటి యాక్షన్ ఎలిమెంట్స్ కలిసి మరోసారి థియేటర్లలో తాండవం చేయబోతున్నాయనే విశ్వాసంతో ఫ్యాన్స్ రెడీగా ఉన్నారు.
