Ajit Doval: స్వేచ్ఛ అంటే ఇష్టానుసారంగా ప్రవర్తించడం కాదు.. జెన్-జీపై అజిత్ దోవల్ కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జెన్-జీ ఉద్యమంపై జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కీలక వ్యాఖ్యలు చేశారు. స్వేచ్ఛ అంటే ఇష్టానుసారంగా ప్రవర్తించడం కాదని.. యువత జాతీయ ప్రయోజనాల గురించి కూడా ఆలోచించాలని హితవు పలికారు. లోకమాన్య బాల గంగాధర్ తిలక్ వర్ధంతిని పురస్కరించుకుని మహారాష్ట్రలోని పూణెలో శనివారం ఒక ప్రత్యేక కార్యక్రమం జరిగింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, అజిత్ దోవల్కు 2026 లోకమాన్య తిలక్ జాతీయ అవార్డును ప్రదానం చేశారు. దోవల్కు సాంప్రదాయ పూణేరి తలపాగా, జ్ఞాపిక, చెక్కు, గీతా రహస్య ప్రతిని అందజేశారు.
అవార్డు స్వీకరించిన అనంతరం దోవల్ ప్రసంగించారు. యువత స్వేచ్ఛ యొక్క నిజమైన అర్థాన్ని గ్రహించాలని పిలుపునిచ్చారు. అలాగే ప్రధాని మోడీ, అమిత్ షాల నాయకత్వాన్ని బహిరంగంగా ప్రశంసించారు. మోడీ, అమిత్ షా వంటి బలమైన నాయకత్వం మనకు ఉండటం మన అదృష్టమని తెలిపారు. భారతదేశం ప్రస్తుతం అంతర్గత, బాహ్య సవాళ్లను ఎదుర్కొంటోందని… దేశం వేగంగా అభివృద్ధి చెందుతుండగా.. అనేక వ్యతిరేక శక్తులు దాని పురోగతి గురించి ఆందోళన చెందుతున్నాయన్నారు. ఇటువంటి సమయంలో ప్రతి పౌరుడు అన్నింటికన్నా ముందుగా జాతీయ ప్రయోజనాల గురించి ఆలోచించాలని కోరారు.
Also Read
- Kulgam: కుల్గామ్లో పహల్గామ్ సీన్ రిపీట్.. హిందువులు లక్ష్యంగా ఉగ్ర దాడి!
- Rahul Gandhi: ఆంగ్ల భాష ఖూనీ.. రాహుల్ గాంధీని విమర్శిస్తూ ప్రొఫెసర్ అక్షర దోషాలు.. వైరల్
- Trump-Iran: ఈ వారాంతంలో ఇరాన్పై భారీ దాడి జరగనుందా? వాల్ స్ట్రీట్ జర్నల్ సంచలన కథనం
- Cauvery Dispute: కావేరీ వివాదం మళ్లీ వేడెక్కింది.. సీఎం విజయ్తో డీకే శివకుమార్ భేటీ వాయిదా
యువతకు సందేశం ఇస్తే.. ‘‘నేటి తరం స్వేచ్ఛ యొక్క నిజమైన అర్థాన్ని అర్థం చేసుకోవడం చాలా కీలకం. స్వేచ్ఛ అంటే తమకు నచ్చింది చేసుకునే హక్కు అని కొందరు భావిస్తారు. కానీ అలాంటి ఆలోచన పూర్తిగా తప్పు.’’ జాతీయ ప్రయోజనాలకు వ్యతిరేకమైన మార్గంలో మనం అడుగు కూడా పెట్టకూడదని హితవు పలికారు. భారతదేశాన్ని శక్తివంతం చేయడమే మన మొదటి కర్తవ్యంగా ఉండాలన్నారు.
ఈ సందర్భంగా చిన్ననాటి జ్ఞాపకాలను పంచుకున్నారు. పూణెలో తన ప్రాథమిక విద్య సమయంలోనే లోకమాన్య తిలక్ ఆలోచనల గురించి మొదటిసారిగా వివరంగా తెలుసుకున్నానని వివరించారు. బ్రిటిష్ పాలనలో ప్రజలు భయంతో మౌనంగా ఉన్నప్పుడు.. తిలక్ నిర్భయంగా మాట్లాడారని.. జైలులో ఉన్న తర్వాత కూడా ఆయన తన సాంఘిక సేవను ఎన్నడూ విడిచిపెట్టలేదన్నారు. తిలక్ జీవితం, పోరాటాల నుంచి స్ఫూర్తి పొంది దేశ నిర్మాణానికి తోడ్పడాలని యువతకు దోవల్ విజ్ఞప్తి చేశారు.
ఇటీవల నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర పెద్ద ఎత్తున విద్యార్థులు ఆందోళన చేపట్టారు. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థులపై లాఠీఛార్జ్ జరిగింది. అనంతరం ఆందోళనలు తీవ్రం కావడంతో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సి వచ్చింది.
- Tags
- ajit doval
- Freedom
- Gen Z
తాజావార్తలు
-
Ajit Doval: స్వేచ్ఛ అంటే ఇష్టానుసారంగా ప్రవర్తించడం కాదు.. జెన్-జీపై అజిత్ దోవల్ కీలక వ్యాఖ్యలు
-
CWG 2026: కామన్వెల్త్లో ఇండియాకు మరో స్వర్ణ పతకం.. బాక్సింగ్ విభాగంలో పవర్ చూపించిన ‘ప్రీతి పవార్’..
-
Tollywood : తెలుగు సినిమా ఇండస్ట్రీ ఊపిరి పోసుకుంటుందా?
-
SRSP Project Update: ఎస్సారెస్పీపై ఉత్తమ్ కీలక ప్రకటన.. రైతులకు గుడ్న్యూస్.?
-
Local Elections In AP: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలపై బిగ్ అప్డేట్.. ఆగస్టు 6న సమావేశం..
ట్రెండింగ్
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్కార్ట్లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్లెస్ స్పోక్ వీల్స్తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!