Ajay Devgn: తెలంగాణ రైజింగ్ విజన్లో భాగంగా 2047 నాటికి రాష్ట్రాన్ని 3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చే లక్ష్యంతో ప్రభుత్వం వినోదం, పర్యాటక రంగాల్లో పెట్టుబడులను ఆకర్షిస్తోంది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 8 – 9 తేదీల్లో భారత్ ఫ్యూచర్ సిటీలో జరగబోయే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు దేశ–విదేశాల నుంచి భారీ స్పందన లభిస్తోంది. ఈ క్రమంలో బాలీవుడ్ స్టార్ అజయ్ దేవ్గన్ హైదరాబాద్లో ప్రపంచ స్థాయి ఫిల్మ్ సిటీ ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకోనున్నారు.
READ ALSO: Hyderabad Metro : మెట్రోలో మహిళల భద్రతకు నూతన అడుగు
ఇదే సమయంలో తెలంగాణలో పెట్టుబడులకు రిలయన్స్ గ్రూప్ ఆసక్తి చూపుతోంది. రిలయన్స్కు చెందిన వెంటారా యానిమల్ రెస్క్యూ అండ్ రిహాబిలిటేషన్ సెంటర్, వైల్డ్ లైఫ్ కన్జర్వేటరీ .. నైట్ సఫారి ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చింది. ఈ ప్రాజెక్టుతో రాష్ట్ర పర్యాటక రంగం రూపురేఖలు మారనున్నాయి. ఫుడ్లింక్ ఎఫ్ అండ్ బీ హోల్డింగ్స్ కంపెనీ రూ.3వేల కోట్లతో ఫ్యూచర్ సిటీలో మూడు హోటళ్లు నిర్మించేందుకు ఒప్పందం చేసుకోనున్నారు. గ్లోబల్ సమ్మిట్లో ఈ కీలక ఒప్పందాలపై సంతకాలు కానున్నాయి.
READ ALSO: Pawan Kalyan: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ క్రేజీ అప్డేట్ లోడింగ్
