Air India Pilot: నా డ్యూటీ అయిపోయింది.. విమానం నడపనని వెళ్లిపోయిన పైలెట్! ముగ్గురు బీజేపీ ఎంపీల పడిగాపులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Air India pilot refused to fly at Rajkot Airport: ఢిల్లీకి వెళ్లే ఎయిరిండియా విమానానికి ఊహించని అంతరాయం ఏర్పడటంతో ముగ్గురు బీజేపీ ఎంపీలతో సహా 100 మంది ప్రయాణికులు గుజరాత్లోని రాజ్కోట్ విమానాశ్రయంలో పడిగాపులు కాస్తూ ఉండిపోయారు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) నిబంధనల ప్రకారం విమాన పైలట్ తన డ్యూటీ అయిపోయిందని వెళ్లిపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. జూలై 23న రాత్రి 8.30 గంటలకు టేకాఫ్ కావాల్సిన ఎయిరిండియా విమానంలో ప్రయాణికులు ఎక్కిన తర్వాత ఈ ఘటన జరిగింది.
ఆదివారం రాత్రి రాజ్కోట్ నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన విమానం (ఏఐ404)లో ప్రయాణించేందుకు రాజ్కోట్ ఎంపీ మోహన్ కుందారియా, జామ్నగర్ ఎంపీ పూనమ్ మాదం, కొత్తగా ఎన్నికైన రాజ్యసభ ఎంపీ కేసరిదేవ్సింగ్ ఝాలా ముగ్గురు రాజకీయ నాయకులు సహా 100 మంది ఉన్నారు. ఈ విమానం రాజ్కోట్ నుంచి ఢిల్లీకి 7.30 గంటలకు బయలుదేరాల్సి ఉంది. అయితే అది రాజ్కోట్లో దిగేసరికే రాత్రి 8.30 అయింది. ఆ పైలట్ విమానం నడపనని వెళ్లిపోవడం, వేరే పైలట్ లేకపోవడంతో.. ప్రయాణికులందరూ 2 గంటల పాటు నిరీక్షించారు. చివరకు అధికారులు సర్వీసును రద్దు చేశారు.
Also Read
- Rohit Sharma and Virat Kohli: రోహిత్-కోహ్లీ ఫ్లాప్ షో.. తొలి వన్డేలో వరుస ఓవర్లలో పెవిలియన్ బాట
- Off The Record: నోరు అదుపులో లేక.. మాట పొదుపు లేక ఆ తండ్రి కొడుకులు ఇరుకున పడ్డారా?
- Trump-Iran: ట్రంప్ సంచలన ప్రకటన.. హార్ముజ్ కార్గో ఫీజు రద్దు.. ఇరాన్ నౌకలపై దిగ్బంధం అమలు
- StepX Neo: ప్రపంచంలోనే తొలి ఐఏ స్టార్మ్ఫోన్ వచ్చేసింది.. చిటికెలో అన్ని పనులు ఫినిష్!
ఈ ఘటనపై ఎయిర్ ఇండియా సంస్థ ఓ ప్రకటన విడుదల చేసింది. జూలై 23 రాజ్కోట్ మరియు ఢిల్లీ మధ్య నడిచే AI404 విమానం కార్యాచరణ కారణాల వల్ల ఆలస్యం అయిందని పేర్కొంది. కాక్పిట్ సిబ్బంది ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిట్ (ఎఫ్డీటీఎల్) నిబంధనల క్రిందకు వచ్చారని, రెగ్యులేటరీ నిబంధనల ప్రకారం వారు విమానాన్ని నడపలేరని ఎయిర్ ఇండియా ప్రతినిధి చెప్పారు. ఇక కొంతమంది ప్రయాణికులను కార్లలో అహ్మదాబాద్కు, అక్కడ నుంచి వేరే విమానంలో ఢిల్లీకి పంపింది. మరికొందరికి హోటల్ రూమ్స్ బుక్ చేసింది.
Also Read: MS Dhoni: వైరల్ అవుతున్న ధోని అపాయింట్మెంట్ లెటర్.. జీతం ఎంతో తెలుసా?
Also Read: India vs Pakistan: వన్డే ప్రపంచకప్ 2023.. భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్ రీ-షెడ్యూల్! కారణం ఏంటంటే?
తాజావార్తలు
-
Rohit Sharma and Virat Kohli: రోహిత్-కోహ్లీ ఫ్లాప్ షో.. తొలి వన్డేలో వరుస ఓవర్లలో పెవిలియన్ బాట
-
Off The Record: నోరు అదుపులో లేక.. మాట పొదుపు లేక ఆ తండ్రి కొడుకులు ఇరుకున పడ్డారా?
-
OTR: సింగనమల వైసీపీలో సెగలు..
-
OTR: తాడేపల్లిగూడెం వైసీపీలో ముదిరిన వర్గపోరు..
-
Trump-Iran: ట్రంప్ సంచలన ప్రకటన.. హార్ముజ్ కార్గో ఫీజు రద్దు.. ఇరాన్ నౌకలపై దిగ్బంధం అమలు
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్తో ఎఫైర్!