Air India Pilot: నా డ్యూటీ అయిపోయింది.. విమానం నడపనని వెళ్లిపోయిన పైలెట్! ముగ్గురు బీజేపీ ఎంపీల పడిగాపులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Air India pilot refused to fly at Rajkot Airport: ఢిల్లీకి వెళ్లే ఎయిరిండియా విమానానికి ఊహించని అంతరాయం ఏర్పడటంతో ముగ్గురు బీజేపీ ఎంపీలతో సహా 100 మంది ప్రయాణికులు గుజరాత్లోని రాజ్కోట్ విమానాశ్రయంలో పడిగాపులు కాస్తూ ఉండిపోయారు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) నిబంధనల ప్రకారం విమాన పైలట్ తన డ్యూటీ అయిపోయిందని వెళ్లిపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. జూలై 23న రాత్రి 8.30 గంటలకు టేకాఫ్ కావాల్సిన ఎయిరిండియా విమానంలో ప్రయాణికులు ఎక్కిన తర్వాత ఈ ఘటన జరిగింది.
ఆదివారం రాత్రి రాజ్కోట్ నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన విమానం (ఏఐ404)లో ప్రయాణించేందుకు రాజ్కోట్ ఎంపీ మోహన్ కుందారియా, జామ్నగర్ ఎంపీ పూనమ్ మాదం, కొత్తగా ఎన్నికైన రాజ్యసభ ఎంపీ కేసరిదేవ్సింగ్ ఝాలా ముగ్గురు రాజకీయ నాయకులు సహా 100 మంది ఉన్నారు. ఈ విమానం రాజ్కోట్ నుంచి ఢిల్లీకి 7.30 గంటలకు బయలుదేరాల్సి ఉంది. అయితే అది రాజ్కోట్లో దిగేసరికే రాత్రి 8.30 అయింది. ఆ పైలట్ విమానం నడపనని వెళ్లిపోవడం, వేరే పైలట్ లేకపోవడంతో.. ప్రయాణికులందరూ 2 గంటల పాటు నిరీక్షించారు. చివరకు అధికారులు సర్వీసును రద్దు చేశారు.
Also Read
- YS Jagan Security: డీజీపీపై వైసీపీ ఫైర్.. జగన్ పర్యటనలో భద్రత తొలగించడంపై గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
- Modi-Zuckerberg: దిగొచ్చిన మెటా.. మోడీకి జుకర్బర్గ్ క్షమాపణ
- Suvendu Adhikari: సువేందు అధికారి టార్గెట్గా పాక్ ప్లాన్.. జైషే ఉగ్రవాది కుట్ర..
- Honour Killing: పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన కూతురు.. నదిలో ముంచి హత్య చేసిన తండ్రి..
ఈ ఘటనపై ఎయిర్ ఇండియా సంస్థ ఓ ప్రకటన విడుదల చేసింది. జూలై 23 రాజ్కోట్ మరియు ఢిల్లీ మధ్య నడిచే AI404 విమానం కార్యాచరణ కారణాల వల్ల ఆలస్యం అయిందని పేర్కొంది. కాక్పిట్ సిబ్బంది ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిట్ (ఎఫ్డీటీఎల్) నిబంధనల క్రిందకు వచ్చారని, రెగ్యులేటరీ నిబంధనల ప్రకారం వారు విమానాన్ని నడపలేరని ఎయిర్ ఇండియా ప్రతినిధి చెప్పారు. ఇక కొంతమంది ప్రయాణికులను కార్లలో అహ్మదాబాద్కు, అక్కడ నుంచి వేరే విమానంలో ఢిల్లీకి పంపింది. మరికొందరికి హోటల్ రూమ్స్ బుక్ చేసింది.
Also Read: MS Dhoni: వైరల్ అవుతున్న ధోని అపాయింట్మెంట్ లెటర్.. జీతం ఎంతో తెలుసా?
Also Read: India vs Pakistan: వన్డే ప్రపంచకప్ 2023.. భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్ రీ-షెడ్యూల్! కారణం ఏంటంటే?
తాజావార్తలు
-
JD Chakravarthy: ఆర్జీవీకి తెలియకుండా జేడీ చేసిన పని.. కోన వెంకట్కు అలా కలిసి వచ్చిందా?
-
Chandini Chowdary: “ఆ రోజు నన్ను పడుకోమని అడిగింది మీరే కదా!” అంటే ఆయన ముఖం మాడిపోయింది!
-
YS Jagan Security: డీజీపీపై వైసీపీ ఫైర్.. జగన్ పర్యటనలో భద్రత తొలగించడంపై గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
-
Modi-Zuckerberg: దిగొచ్చిన మెటా.. మోడీకి జుకర్బర్గ్ క్షమాపణ
-
Suvendu Adhikari: సువేందు అధికారి టార్గెట్గా పాక్ ప్లాన్.. జైషే ఉగ్రవాది కుట్ర..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!