Air India: ప్రయాణికుడి భోజనంలో ‘మెటల్ బ్లేడ్’.. ఎయిరిండియా విమానంలో ఘటన
- భోజనంలో 'మెటల్ బ్లేడ్' వచ్చినట్లు తెలిపిన ప్రయాణికుడు
- సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన జర్నలిస్ట్ మాథుర్స్ పాల్
- జూన్ 9న ఎయిరిండియా విమానం
- బెంగళూరు నుంచి శాన్ ఫ్రాన్సిస్కోకు వెళ్తుండగా ఘటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రయాణికుడి భోజనంలో ‘మెటల్ బ్లేడ్’ వచ్చినట్లు ఓ ప్రయాణికుడు తెలిపారు. ఈ ఘటనపై జర్నలిస్ట్ మాథుర్స్ పాల్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. జూన్ 9న AI 175 విమానం బెంగళూరు నుంచి శాన్ ఫ్రాన్సిస్కోకు వెళ్తుండగా ఘటన జరిగినట్లు ప్రయాణికుడు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఎయిరిండియా దర్యాప్తు చేస్తోంది. ప్రయాణికుడు ఎక్స్ లో పోస్ట్ చేస్తూ.. “ఎయిర్ ఇండియా విమానంలో క్యాటరింగ్ అందించే ఫిగ్ చాట్ డిష్లో బ్లేడ్ కనిపించిదని పాల్ పేర్కొన్నాడు. అయితే.. తన కోసం ఫుడ్ రాగానే దానిని చూడకుండా.. రెండు మూడు సెకన్ల పాటు నమిలిన తర్వాత తన ఆహారంలో ఏదో ఉందని గ్రహించానని.. ఆ తర్వాత ఉమ్మివేయగానే, అది బయటపడిందని ప్రయాణికుడు తెలిపాడు.
ఏదైనా విమానంలో బ్లేడ్ కలిగి ఉండటం ప్రమాదకరమని.. ఆ బ్లేడు నాలుకకు కోసి ఉంటే పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. అంతేకాకుండా.. ఈ బ్లేడ్ తనకు కాకుండా.. ఎవరైనా పిల్లవాడికి వస్తే పెద్ద ప్రమాదమే జరిగేదని ప్రయాణికుడు పాల్ తెలిపాడు. ఈ క్రమంలో.. బాధితుడు కొన్ని రోజుల తర్వాత ఎయిర్ ఇండియా లేఖ రాశాడు. మరోవైపు.. “ప్రపంచంలో ఎక్కడికైనా ఉచిత బిజినెస్ క్లాస్ ట్రిప్”ని పరిహారంగా అందించిందని, అయితే దానిని తిరస్కరించినట్లు అసంతృప్తి చెందిన ప్రయాణికుడు తెలిపాడు.
Also Read
- CJP Protest: దుకాణాలు బంద్, జాతీయ భద్రతా చట్టం, అంబులెన్సుల మోహరింపు.. ఏదో జరగబోతోంది..
- Monsoon: దేశంలో వర్ష మేఘాల బెల్ట్.. వెలుగులోకి ఉపగ్రహ చిత్రాలు.. ఇక భారీ వర్షాలే!
- CJP Protest: సీజేపీ ఉద్యమానికి ఖలిస్తాన్ ఉగ్రవాది మద్దతు..? వైరల్ అవుతున్న వీడియో..
- Delhi: 2024 నీట్ పేపర్ లీక్ కేసులో సంజీవ్ ముఖియాకు సీబీఐ క్లీన్చిట్.. కేంద్రంపై కేజ్రీవాల్ ధ్వజం
ప్రయాణికుడి ఫిర్యాదుపై ఎయిర్ ఇండియా ఈ సంఘటనను అంగీకరించింది. చీఫ్ కస్టమర్ ఎక్స్పీరియన్స్ ఆఫీసర్ రాజేష్ డోగ్రా భోజనంలో “మెటల్ బ్లేడ్” ఉన్నట్లు ధృవీకరించారు. తమ క్యాటరింగ్ వ్యక్తులు ఉపయోగించే కూరగాయల ప్రాసెసింగ్ యంత్రంగా గుర్తించామ అని డోగ్రా చెప్పారు. అంతేకాకుండా.. ఎయిర్ ఇండియా కాంప్లిమెంటరీ బిజినెస్ క్లాస్ విమానాన్ని పరిహారంగా అందించిందని పాల్ చేసిన వాదనపై డోగ్రా వ్యాఖ్యానించలేదు.
తాజావార్తలు
-
The India Story : కాజల్ అగర్వాల్ ‘ది ఇండియా స్టోరీ’కి షాక్.. తెలుగు, తమిళ్ రిలీజ్ వాయిదా!
-
KTR : గ్లోబరీనా వివాదం.. రేవంత్కు కేటీఆర్ డిఫమేషన్ నోటీసు
-
CJP Protest: దుకాణాలు బంద్, జాతీయ భద్రతా చట్టం, అంబులెన్సుల మోహరింపు.. ఏదో జరగబోతోంది..
-
Monsoon: దేశంలో వర్ష మేఘాల బెల్ట్.. వెలుగులోకి ఉపగ్రహ చిత్రాలు.. ఇక భారీ వర్షాలే!
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
ట్రెండింగ్
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?
-
Dinesh Karthik vs Alastair Cook: ఐపీఎల్ గురించి వాడివేడి చర్చ.. ఇంటర్వ్యూలోనే కొట్టుకోబోయిన దినేష్ కార్తీక్, అలిస్టర్ కుక్!