Air India Sale: డెడ్ ఛీప్గా ఎయిర్ ఇండియా ఫ్లైట్ టిక్కెట్లు.. కేవలం రూ. 1470కే
Air India Sale: ఇప్పటి వరకు విమానయానం అంటే సంపన్నలకు మాత్రమే సాధ్యం అవుతుందని అనుకుంటున్నారు. కానీ విమానయాన సంస్థలు సామాన్యులను కూడా విమానంలో ప్రయాణించేలా చేయాలని సాధ్యమైనంత వరకు కృష్టి చేస్తున్నాయి. మీరు కూడా విమానంలో (ఎయిర్ ఇండియా) ప్రయాణించాలని ప్లాన్ చేస్తున్నట్లైతే మీకో శుభవార్త. స్పైస్జెట్ తర్వాత ఇప్పుడు టాటా గ్రూప్ కు చెందిన ఎయిర్లైన్ ఎయిర్ ఇండియా మీ కోసం ఒక ప్రత్యేక ఆఫర్ను తీసుకొచ్చింది. ఇందులో మీరు చౌకగా టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. ఇందుకు గాను ఎయిర్ ఇండియా ద్వారా ఒక ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. ఇందులో మీరు టిక్కెట్ బుకింగ్పై 30శాతం డిస్కౌంట్ పొందవచ్చు. ఈ విషయాన్ని కంపెనీ ట్వీట్ ద్వారా తెలియజేసింది.
Read Also:Liquor Shops Tenders: రేపటితో ముగియనున్న గడువు.. ఈ సారి టార్గెట్ రూ.2 వేల కోట్లు..!
Also Read
- Playoff Venues: ఐపీఎల్ ప్లే ఆఫ్ వేదికలపై కీలక అప్డేట్.. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్కు చరమగీతం..?
- MI Vs CSK: నిప్పులు చెరిగిన చెన్నై బౌలర్లు.. పెవిలియన్కు క్యూ కట్టిన ముంబై బ్యాటర్స్.. టార్గెట్ ఎంతంటే..
- Vaibhav Sooryavanshi: బిగ్ షాక్.. వైభవ్ సూర్యవంశీని ఐపీఎల్ నుంచి తొలగించాలంటూ డిమాండ్స్..
- KKR Vs SRH: సన్ రైజర్స్ హైదరాబాద్ ఆరో విజయానికి బ్రేక్..? కేకేఆర్లోకి స్టార్ ప్లేయర్ ఎంట్రీ..
మీకు ఇష్టమైన గమ్యస్థానానికి విమానంలో ప్రయాణించవచ్చని ఎయిర్ ఇండియా తన అధికారిక ట్వీట్లో రాసింది. దీనితో పాటు మీరు విమాన టిక్కెట్లపై 30శాతం తగ్గింపు పొందుతారు. మీరు ఈ ఆఫర్లో ఆగస్టు 20 వరకు టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. కంపెనీ వెబ్సైట్, యాప్ ద్వారా ప్రయాణికులు టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చని ఎయిర్ ఇండియా తెలిపింది. దీని కోసం మీరు అన్ని నిబంధనలు, షరతులను తెలుసుకోవాలి.
Read Also:Off The Record: అమలాపురంలో ఆ సెగ గట్టిగానే తాకుతోందా..? అంతా కలిస్తేనే విజయం సాధ్యమా..?
దేశీయ, అంతర్జాతీయ రూట్లలో కంపెనీ 96 గంటల విక్రయాన్ని ప్రారంభించింది. ఇందులో ఎకానమీ క్లాస్ కోసం ప్రయాణికులు రూ.1470కి బుక్ చేసుకోవచ్చు. దీనితో పాటు బిజినెస్ క్లాస్ టికెట్ బుకింగ్ రూ.10,130 నుంచి ప్రారంభమవుతుంది. మీరు ఈ ఆఫర్ కింద ఆగస్టు 17 నుండి ఆగస్టు 20 వరకు టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. మీరు ఈ ఆఫర్ కింద టిక్కెట్ల బుకింగ్పై 1 సెప్టెంబర్ 2023 నుండి 31 అక్టోబర్ 2023 వరకు ప్రయాణించవచ్చు. ఎయిర్ ఇండియాతో పాటు స్పైస్జెట్ కూడా ఈ సమయంలో టిక్కెట్లను చౌకగా బుక్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. స్పైస్జెట్ ప్రయాణీకుల కోసం ఇండిపెండెన్స్ డే సేల్ను తీసుకొచ్చింది. ఇందులో మీరు కేవలం రూ.1515తో మీ విమాన ప్రయాణ టిక్కెట్ను బుక్ చేసుకోవచ్చు. ఈ ఆఫర్ కింద కూడా మీరు ఆగస్టు 20 వరకు టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. ఈ టిక్కెట్ మొత్తంలో అన్ని పన్నులు చేర్చబడ్డాయి. దీంతో కేవలం రూ.15కే ఇష్టమైన సీటును ఎంచుకోవచ్చు. దీనితో పాటు రూ.2000 టికెట్ వోచర్ కూడా లభిస్తుంది.
తాజావార్తలు
-
Playoff Venues: ఐపీఎల్ ప్లే ఆఫ్ వేదికలపై కీలక అప్డేట్.. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్కు చరమగీతం..?
-
Texas Shooting: అమెరికాలో కాల్పుల కలకలం.. ఇద్దరు మృతి!
-
NTV Exclusive: సమంత ‘మా ఇంటి బంగారం’ సైలెన్స్ ఎందుకు?
-
MI Vs CSK: నిప్పులు చెరిగిన చెన్నై బౌలర్లు.. పెవిలియన్కు క్యూ కట్టిన ముంబై బ్యాటర్స్.. టార్గెట్ ఎంతంటే..
-
Vaibhav Sooryavanshi: బిగ్ షాక్.. వైభవ్ సూర్యవంశీని ఐపీఎల్ నుంచి తొలగించాలంటూ డిమాండ్స్..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!