Air India Sale: డెడ్ ఛీప్గా ఎయిర్ ఇండియా ఫ్లైట్ టిక్కెట్లు.. కేవలం రూ. 1470కే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Air India Sale: ఇప్పటి వరకు విమానయానం అంటే సంపన్నలకు మాత్రమే సాధ్యం అవుతుందని అనుకుంటున్నారు. కానీ విమానయాన సంస్థలు సామాన్యులను కూడా విమానంలో ప్రయాణించేలా చేయాలని సాధ్యమైనంత వరకు కృష్టి చేస్తున్నాయి. మీరు కూడా విమానంలో (ఎయిర్ ఇండియా) ప్రయాణించాలని ప్లాన్ చేస్తున్నట్లైతే మీకో శుభవార్త. స్పైస్జెట్ తర్వాత ఇప్పుడు టాటా గ్రూప్ కు చెందిన ఎయిర్లైన్ ఎయిర్ ఇండియా మీ కోసం ఒక ప్రత్యేక ఆఫర్ను తీసుకొచ్చింది. ఇందులో మీరు చౌకగా టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. ఇందుకు గాను ఎయిర్ ఇండియా ద్వారా ఒక ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. ఇందులో మీరు టిక్కెట్ బుకింగ్పై 30శాతం డిస్కౌంట్ పొందవచ్చు. ఈ విషయాన్ని కంపెనీ ట్వీట్ ద్వారా తెలియజేసింది.
Read Also:Liquor Shops Tenders: రేపటితో ముగియనున్న గడువు.. ఈ సారి టార్గెట్ రూ.2 వేల కోట్లు..!
Also Read
- CM Vijay - Sangeetha: విడాకుల కేసు మధ్యలోనే ట్విస్ట్! భార్యతో కలిసిపోయిన సీఎం విజయ్?
- YS Jagan: డీఎస్సీ నియామకాలపై జగన్ సంచలన ఆరోపణలు.. సీబీఐ విచారణకు డిమాండ్
- Nilufer: టర్కీ యువరాణి నుంచి హైదరాబాద్ ప్రజల ఆరాధ్యురాలిగా.. 'నీలోఫర్' అసాధారణ ప్రయాణం.!
- Minister Satyakumar Yadav: ఆరోగ్యశ్రీ క్రెడిట్ వైఎస్ రాజశేఖర్రెడ్డిదే.. మంత్రి సత్యకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు
మీకు ఇష్టమైన గమ్యస్థానానికి విమానంలో ప్రయాణించవచ్చని ఎయిర్ ఇండియా తన అధికారిక ట్వీట్లో రాసింది. దీనితో పాటు మీరు విమాన టిక్కెట్లపై 30శాతం తగ్గింపు పొందుతారు. మీరు ఈ ఆఫర్లో ఆగస్టు 20 వరకు టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. కంపెనీ వెబ్సైట్, యాప్ ద్వారా ప్రయాణికులు టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చని ఎయిర్ ఇండియా తెలిపింది. దీని కోసం మీరు అన్ని నిబంధనలు, షరతులను తెలుసుకోవాలి.
Read Also:Off The Record: అమలాపురంలో ఆ సెగ గట్టిగానే తాకుతోందా..? అంతా కలిస్తేనే విజయం సాధ్యమా..?
దేశీయ, అంతర్జాతీయ రూట్లలో కంపెనీ 96 గంటల విక్రయాన్ని ప్రారంభించింది. ఇందులో ఎకానమీ క్లాస్ కోసం ప్రయాణికులు రూ.1470కి బుక్ చేసుకోవచ్చు. దీనితో పాటు బిజినెస్ క్లాస్ టికెట్ బుకింగ్ రూ.10,130 నుంచి ప్రారంభమవుతుంది. మీరు ఈ ఆఫర్ కింద ఆగస్టు 17 నుండి ఆగస్టు 20 వరకు టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. మీరు ఈ ఆఫర్ కింద టిక్కెట్ల బుకింగ్పై 1 సెప్టెంబర్ 2023 నుండి 31 అక్టోబర్ 2023 వరకు ప్రయాణించవచ్చు. ఎయిర్ ఇండియాతో పాటు స్పైస్జెట్ కూడా ఈ సమయంలో టిక్కెట్లను చౌకగా బుక్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. స్పైస్జెట్ ప్రయాణీకుల కోసం ఇండిపెండెన్స్ డే సేల్ను తీసుకొచ్చింది. ఇందులో మీరు కేవలం రూ.1515తో మీ విమాన ప్రయాణ టిక్కెట్ను బుక్ చేసుకోవచ్చు. ఈ ఆఫర్ కింద కూడా మీరు ఆగస్టు 20 వరకు టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. ఈ టిక్కెట్ మొత్తంలో అన్ని పన్నులు చేర్చబడ్డాయి. దీంతో కేవలం రూ.15కే ఇష్టమైన సీటును ఎంచుకోవచ్చు. దీనితో పాటు రూ.2000 టికెట్ వోచర్ కూడా లభిస్తుంది.
తాజావార్తలు
-
CM Vijay – Sangeetha: విడాకుల కేసు మధ్యలోనే ట్విస్ట్! భార్యతో కలిసిపోయిన సీఎం విజయ్?
-
YS Jagan: డీఎస్సీ నియామకాలపై జగన్ సంచలన ఆరోపణలు.. సీబీఐ విచారణకు డిమాండ్
-
Fertility Rate: పిల్లలను కనలేం బాబోయ్.. ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తున్న సేమ్ సీన్.. కారణాలేంటి?
-
Lenin: ‘అయ్యగారు’ మాట మేరకే లెనిన్ వాయిదా?
-
Oh..! Sukumari Teaser: ఐశ్వర్య రాజేష్ను ముట్టుకుంటే షాక్ కొడుతుందా?.. ఆసక్తి రేకెత్తిస్తున్న ‘ఓ..! సుకుమారి’ టీజర్!
ట్రెండింగ్
-
Nilufer: టర్కీ యువరాణి నుంచి హైదరాబాద్ ప్రజల ఆరాధ్యురాలిగా.. ‘నీలోఫర్’ అసాధారణ ప్రయాణం.!
-
Tirumala ఆలయ అద్భుతాలు.. శాస్త్రానికి అంతుచిక్కని వెంకటేశ్వరుని మహిమలు.!
-
Tirumala: అత్యంత అరుదైన దర్శనం.. ‘వ్యూహ లక్ష్మి అచ్చు’ గురించి తెలుసా.?
-
200MP కెమెరా, 5000 నిట్స్ AMOLED డిస్ప్లే, మిలిటరీ గ్రేడ్ రక్షణతో Motorola Moto G Max 5G లాంచ్.!
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!