Air India Express: మరీ ఇంత కరువులో ఉన్నారేంట్రా బాబు.. నాలుగు గంటల్లో 15 లీటర్ల మందు తాగేసిన ప్రయాణికులు
- సూరత్ నుంచి థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్కు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ప్రారంభం
- నాలుగు గంటల్లో 15 లీటర్ల మందు తాగేసిన ప్రయాణికులు
- వివరాలు ఇలా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Air India Express: గుజరాత్లోని సూరత్ నుంచి థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్కు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ మొదటి విమానాన్ని శుక్రవారం ప్రారంభించింది. ఈ పూర్తిగా బుక్ అయిన ఫ్లైట్ సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చకు దారితీసింది. ప్రయాణికులు తమ అనుభవాలను వీడియోల రూపంలో పంచుకోవడంతో ఈ ప్రయాణం మరింత వైరల్ గా మారింది. దీనికి కారణం ఈ ప్రయాణంలో ప్రయాణికులు అధిక మద్యం వినియోగించడమే ఇందుకు కారణం. విమానంలో ప్రయాణికులు దాదాపు 15 లీటర్ల ప్రీమియమ్ మద్యం, అందులో చివాస్ రిగల్, బకార్డీ, బీర్ వంటి పానీయాలను కలిపి దాదాపు రూ. 1.8 లక్షల విలువైన మద్యం వినియోగించినట్లు నివేదికలు వెల్లడించాయి. ప్రయాణికుల మద్యం వినియోగం ఎక్కువగా ఉండటంతో బ్యాంకాక్కు చేరుకునే ముందునే మద్యం అయిపోయిందని విమాన సిబ్బంది ప్రకటించాల్సి వచ్చింది.
Also Read: MP Chamala Kiran: రియల్ హీరో అనుకున్నాం కానీ.. రీల్ హీరో లాగానే వ్యవహరించారు..
Also Read
ఈ ప్రయాణంలో ప్రయాణికుల కోసం తీసుకుని వచ్చిన గుజరాతీ వంటకాలు ముఖ్యంగా థెప్లా, ఖమన్ వంటి ఐటెంలు, అలాగే పిజ్జా వంటి ఇతర భోజనాలు అందరినీ ఆకర్షించాయి. ఇవి విమానంలో అందించిన ఫుడ్, డ్రింక్స్కు చక్కటి కాంబినేషన్ గా నిలిచాయి. మొత్తం మీద 4 గంటల ప్రయాణంలో ఈ భోజనాలు పూర్తిగా అయిపోయాయి. అయితే, ఈ విమానంపై వచ్చిన మొదటి నివేదికలలో కొన్ని వివరాలపై సామాజిక మాధ్యమాల్లో ప్రశ్నలు లేవనెత్తబడ్డాయి. ముఖ్యంగా, 300 మంది ప్రయాణికుల సంఖ్యపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఒక యూజర్ ఈ విషయంపై వ్యాఖ్యానిస్తూ.. ఈ విమానం, ఎయిర్బస్ లేదా బోయింగ్ 737 అని అభిప్రాయపడ్డాడు. నిజానికి ఈ ఫ్లైట్ లో 300 మందిని తీసుకెళ్లలేరు. గరిష్ఠ సామర్థ్యం సుమారు 176 మంది మాత్రమే. ఆ సంఖ్యకు సరిపోల్చితే, ప్రతి ప్రయాణికుడికి సగటున 85 మిల్లీలీటర్ల మద్యం పడిందని తెలిపాడు.
Also Read: OTT Platforms : ఆ 18 ఓటీటీలు బ్యాన్.. కారణం ఇదే !
દારૂ અને ખમણનું કોમ્બિનેશન,વાઇરલ થયા સુરતીઓ! ,એર ઈન્ડિયા સુરતથી બેંગકોકની પહેલી ફ્લાઇટના પહેલા જ દિવસે 98% પેસેન્જર્સ મળ્યા, પેસેન્જરોએ વિસ્કી અને બીયરનો સ્ટોકજ પતાવી દીધો, 300 પેસેન્જરે 4 કલાકની મુસાફરીમાં 1.80 લાખથી વધારેનો 15 લિટર દારૂ પીધો#SURAT #bangkok #AirIndia #gujju pic.twitter.com/bhQH66vjGH
— Kunj Patel (@patelkunj4444) December 21, 2024
ఈ సంఘటన గుజరాత్ నిషేధ విధానంపై కొత్త చర్చలను తెరపైకి తీసుకువచ్చింది. ఒక సామాజిక మాధ్యమ యూజర్ వ్యాఖ్యానిస్తూ, ఇది గుజరాత్ ప్రజలు మద్యం వినియోగానికి ఆసక్తి చూపిస్తున్నట్లు స్పష్టం చేస్తోందని, నిషేధాన్ని మరోసారి ఆలోచించాలని అంటున్నారు. నియంత్రిత మద్యం అమ్మకాల ద్వారా ఆదాయం పొందడాన్ని పరిగణనలోకి తీసుకోవడం అవసరమని కామెంట్ చేస్తున్నారు. నిషేధం ఉన్నప్పటికీ, రాష్ట్రంలో అక్రమ మద్యం వ్యాపారం జరుగుతుందని చూడగలుగుతున్నామని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Kitchen Hacks : ఉల్లిపాయలు కోసేటప్పుడు కన్నీళ్లకు బైబై.. కళ్లమంటను తగ్గించే సింపుల్ చిట్కాలు.!
-
Congress: తుంగతుర్తి కాంగ్రెస్ పంచాయితీకి తెర.. జగ్గారెడ్డితో ఎమ్మెల్యే మందుల సామెల్ భేటీ.!
-
National Mourning: ఖతార్ మాజీ ఎమిర్ కన్నుమూత.. భారత్ కీలక నిర్ణయం..
-
Varanasi: రూమరా? నిజమా? రాజమౌళి – మహేష్ బాబు సినిమాతో ఎన్టీఆర్ కొడుకు ఎంట్రీ!
-
Bihar: లవ్ ఎఫైర్.. మహిళా కానిస్టేబుల్ కిడ్నాప్, అత్యాచారం..
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో అల్లం-పసుపు టీ ఎందుకు తాగాలి.?
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..