Air India Plane Crash : అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. ప్రాథమిక నివేదికలో కీలక విషయాలు!
- ఎయిర్ ఇండియా విమాన ప్రమాద ఘటనపై ప్రాథమిక నివేదిక
- 5 పేజీలతో ప్రాథమిక నివేదికను సమర్పించిన ఏఏఐబీ
- ఫ్లైట్లో ఎటువంటి ప్రమాదకరమైన వస్తువులు లేవు
- విమానంలోని కీలక భాగాలను క్వారంటైన్ చేశాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Air India Plane Crash Preliminary Report Reveals: అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాద ఘటనపై ప్రాథమిక నివేదిక వెల్లడైంది. ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగెంట్ బ్యూరో 15 పేజీలతో ప్రాథమిక నివేదికను సమర్పించింది. ఫ్లైట్ టేకప్ అయిన కొన్ని సెకన్లలోనే ఫ్యూయల్ స్విచ్లు ఆగిపోవడం వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని ప్రాథమికంగా నిర్ధరణకు వచ్చింది. ప్రమాదానికి ముందు ఫ్యూయల్ పరిమితిలోనే ఉందని ఏఏఐబీ పేర్కొంది. విమానయాన మార్గంలో పక్షికి సంబంధించి ఎలాంటి కదలికలు నమోదు కాలేదని స్పష్టం చేసింది. విమానంలో ఎటువంటి ప్రమాదకరమైన వస్తువులు లేవని, కుట్రం కోణం ఉందని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవని ఏఏఐబీ వెల్లడించింది.
జూన్ 12న ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంకు గురైంది. ప్రమాదంలో 241 మంది ప్యాసింజర్లు మృతి చెందారు. ఫ్లైట్ టేకప్ అయిన కొన్ని సెకన్లలోనే ఫ్యూయల్ స్విచ్లు ఆగిపోయాయని ఏఏఐబీ తన నివేదికలో తెలిపింది. రెండు ఇంజన్ల బటన్స్ రన్ టూ కట్ ఆఫ్కు మారాయని, దాంతో ప్లైట్ రెండు ఇంజన్లు ఆగిపోయాయని స్పష్టం చేసింది. విమానం కూలడానికి ముందు పైలట్ల సంభాషణ వివాదాస్పదంగా మారింది. స్విచ్ ఆఫ్ ఎందుకు చేసావు అని మరో పైలెట్ను ప్రశ్నించగా.. తాను స్విచ్ ఆఫ్ చేయలేదని సమాధానం ఇచ్చాడు. ఆ తర్వాత పైలెట్స్ మేడే కాల్ ఇచ్చారు. కాక్ పిట్లో పైలెట్ల చివరి సంభాషణ రికార్డ్ అయింది.
Also Read
- IND Vs ENG: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్.. జట్టులోకి యువ ప్లేయర్..
- Trump-Meloni: ‘ఆమె అంటే ఇష్టం.. కానీ తప్పు చేసింది’.. టర్కీ టూర్లో మెలోనిపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు
- Indonesia: ‘నా డీఎన్ఏలో భారతీయ రక్తం ఉంది’.. ఇండోనేషియా అధ్యక్షుడి వ్యాఖ్యలకు మోడీ హర్షధ్వానాలు
- New Players: టీమిండియాలోకి ముగ్గురు కొత్త యువ ఆటగాళ్లు.. మొదటిసారి టీ20 జట్టులోకి..
ప్రమాదానికి ముందు ఫ్యూయల్ పరిమితిలోనే ఉందని ఏఏఐబీ పేర్కొంది. ‘రెండు ఇంజన్ల ఇంధన స్విచ్ ‘కటాఫ్’ నుంచి మళ్లీ ‘రన్’కు మారింది. ఫ్లైట్లో ఎటువంటి ప్రమాదకరమైన వస్తువులు లేవు. అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ ప్రహరీ దాటక ముందే విమానం ఆగిపోయింది. విమాన ప్రమాదంపై దర్యాప్తు కొనసాగుతోంది. విమానంలోని కీలక భాగాలను క్వారంటైన్ చేశాం’ అని ఏఏఐబీ తెలిపింది.
తాజావార్తలు
-
IND Vs ENG: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్.. జట్టులోకి యువ ప్లేయర్..
-
Hormuz Tank Attacks: హోర్ముజ్ జలసంధిలో యుద్ధ వాతావరణం.. 24 గంటల్లో 3 ఆయిల్ ట్యాంకర్లపై దాడులు!
-
CM Revanth Reddy : కేసీఆర్కు సీఎం రేవంత్ ఓపెన్ ఛాలెంజ్.!
-
Story Board : రాజీనామాలతో చేసిన తప్పు సరైపోతుందా..?
-
Trump-Meloni: ‘ఆమె అంటే ఇష్టం.. కానీ తప్పు చేసింది’.. టర్కీ టూర్లో మెలోనిపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Kitchen Tips : వేడి ఆలూ తొక్క.. 10 సెకన్లలో ఊడిపోతుంది.! ఈ ట్రిక్ తెలుసా.?
-
Kitchen Tips : కుక్కర్లో అన్నం ముద్ద అవుతుందా? ఈ ట్రిక్తో మల్లెపూవులా వస్తుంది!
-
టూరిస్టులకు గుడ్ న్యూస్.. ఒక్క రోజులో 5 అద్భుత గమ్యస్థానాలు.! TSTDC అదిరిపోయే టూర్ ప్యాకేజీ.!
-
7,200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Vivo నుంచి కొత్త G5i, G5z స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
Black Jamun Jam: ప్రిజర్వేటివ్స్ అవసరం లేకుండానే.. 6 నెలలు నిల్వ ఉండే ‘నేరేడు జామ్’ ఇంట్లోనే చేయండి ఇలా.!