AIMIM: బీహార్, మహారాష్ట్రలో సైతం ఎంఐఎం పోటీ.. స్థానాలెన్నంటే.?
హైదరాబాద్ కే పరిమితమైన మజ్లిస్ పార్టీ నెమ్మదిగా దేశంలోని పలు రాష్ట్రాలకు విస్తరిస్తోంది. బీజేపీని కట్టడి చేసేందుకు మజ్లిస్ అత్యధిక స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించినప్పటికీ రాజకీయ పరిస్థితుల కారణంగా మార్పులు చేయాల్సి వచ్చిందని పార్టీ ప్రతినిధులు తెలిపారు. లోక్సభ ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ పది స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు మంగళవారం పార్టీ అధికార ప్రతినిధి ఓ ప్రకటన విడుదల చేశారు. బిహార్లో ఐదు, మహారాష్ట్రలో నాలుగు, తెలంగాణలోని హైదరాబాద్తో కలిపి మొత్తం పది లోకసభ స్థానాల్లో అభ్యర్థులను పోటీకి దింపినట్లు పేర్కొన్నారు. దేశంలో మతతత్వ బీజేపీని అధికారంలోకి రాకుండా అడ్డుకునేందుకు మజ్లిస్ అత్యధిక స్థానాల్లో పోటీ చేయాలని ఆశించినట్లు తెలిపారు.
READ MORE: Thug Life : “థగ్ లైఫ్” స్పెషల్ అప్డేట్ వచ్చేసింది.. శింబు స్టైలిష్ లుక్ అదిరిపోయిందిగా…
Also Read
- House Sales Down: భారీగా పడిపోయిన ఇళ్ల అమ్మకాలు.. ప్రధాన కారణం ఇదే..
- Software Jobs Opening: లేఆఫ్స్ మధ్య భారీ ఊరట.. నియామకాలు స్టార్ట్ చేసిన ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ..
- Success Story: ఊరి నుంచి రూ.12 అప్పు చేసి వచ్చాడు.. నేడు రూ. 15 వేల కోట్లకు అధిపతి..
- IPL 2026: 8 మ్యాచ్లు ఆడి చేసిన స్కోర్ 88.. అతడిని తప్పించాల్సిందే.. రాజస్థాన్ రాయల్స్ ఆటగాడిపై సెహ్వాగ్ ఆగ్రహం..
మహారాష్ట్రలో సిటింగ్ సీటు ఔరంగాబాద్ నుంచి ఇంతియాజ్ జలీల్, పూణె నుంచి అనిస్ సుంద్కే, ఉస్మానాబాద్ నుంచి సిద్ధిఖీ ఇబ్రహీం, ముంబై సెంట్రల్ నుంచి రంజన్ చౌదరి పోటీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇక బిహార్లో కిషన్గంజ్ నుంచి అక్తరుల్ ఇమాన్, హైదరాబాద్ నుంచి మజ్లిస్ అధినేత అసద్దుదీన్ ఒవైసీ పోటీ చేస్తున్నారు. అంతే కాకుండా మరో ఐదు లోకసభ స్థానాల నుంచి మజ్లిస్ అభ్యర్థులు బరిలో ఉన్నట్లు తెలిపారు.
కాగా.. ఇప్పటికే ఎంఐఎం పార్టీ తమిళనాడు, ఉత్తర్ ప్రదేశ్ లో పలు పార్టీలకు మద్దతు ప్రకటించింది. తమిళనాడులో అన్నాడీఎంకేతో పొత్తును ప్రకటించగా.. ఉత్తర్ ప్రదేశ్ లో అప్నాదళ్(కే) తో జతకట్టింది. మాజీ సీఎం ఎడప్పాడి పళనిస్వామి నేతృత్వంలోని ఆ పార్టీకి గతంలో ఎంఐఎం మద్దతు ప్రకటించింది. గతంలో బీజేపీ మిత్రపక్షంగా ఉన్న అన్నాడీఎంకే ఆ పార్టీతో తెగదెంపులు చేసుకుంది. గత నెల ఏప్రిల్ లో ఎక్స్ వేదికగా ఒవైసీ మాట్లాడుతూ.. 2026లో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయని.. పొత్తు కొనసాగుతుందని తెలిపారు. సీఏఏ, ఎన్పీఆర్, ఎన్ ఆర్సీని వ్యతిరేకిస్తామని అన్నాడీఎంకే ప్రకటించడంతో ఎంఐఎం ఆ పార్టీకి మద్దతు ఇస్తోందన్నారు.
- Tags
- AIMIM
- bhihar
- Hydrabad
- ilanadu
- maharastra
తాజావార్తలు
-
CM Revanth Reddy : ఐఏఎస్ల బదిలీల్లో రేవంత్ రెడ్డి క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ
-
House Sales Down: భారీగా పడిపోయిన ఇళ్ల అమ్మకాలు.. ప్రధాన కారణం ఇదే..
-
Software Jobs Opening: లేఆఫ్స్ మధ్య భారీ ఊరట.. నియామకాలు స్టార్ట్ చేసిన ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ..
-
Success Story: ఊరి నుంచి రూ.12 అప్పు చేసి వచ్చాడు.. నేడు రూ. 15 వేల కోట్లకు అధిపతి..
-
Angkrish Raghuvanshi: రేర్ డిస్మిసల్.. అంగ్క్రిష్ రఘువంశీ ఆబ్స్ట్రక్టింగ్ ది ఫీల్డ్ కు ఔట్.. కేకేఆర్ ఆగ్రహం
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!