AIMIM: బీహార్, మహారాష్ట్రలో సైతం ఎంఐఎం పోటీ.. స్థానాలెన్నంటే.?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ కే పరిమితమైన మజ్లిస్ పార్టీ నెమ్మదిగా దేశంలోని పలు రాష్ట్రాలకు విస్తరిస్తోంది. బీజేపీని కట్టడి చేసేందుకు మజ్లిస్ అత్యధిక స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించినప్పటికీ రాజకీయ పరిస్థితుల కారణంగా మార్పులు చేయాల్సి వచ్చిందని పార్టీ ప్రతినిధులు తెలిపారు. లోక్సభ ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ పది స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు మంగళవారం పార్టీ అధికార ప్రతినిధి ఓ ప్రకటన విడుదల చేశారు. బిహార్లో ఐదు, మహారాష్ట్రలో నాలుగు, తెలంగాణలోని హైదరాబాద్తో కలిపి మొత్తం పది లోకసభ స్థానాల్లో అభ్యర్థులను పోటీకి దింపినట్లు పేర్కొన్నారు. దేశంలో మతతత్వ బీజేపీని అధికారంలోకి రాకుండా అడ్డుకునేందుకు మజ్లిస్ అత్యధిక స్థానాల్లో పోటీ చేయాలని ఆశించినట్లు తెలిపారు.
READ MORE: Thug Life : “థగ్ లైఫ్” స్పెషల్ అప్డేట్ వచ్చేసింది.. శింబు స్టైలిష్ లుక్ అదిరిపోయిందిగా…
Also Read
- 200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
- Global Fuel Crisis: అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్లో రికార్డ్ స్థాయికి చేరిన డీజిల్, పెట్రోల్ ధరలు.. నెక్ట్స్ భారత్ వంతేనా?
- Girls Hair Cutting: నిద్రలో ఉండగా జడలు కత్తిరింపు.. భీమిలి కేజీబీవీలో కలకలం
- Job Loss Benefit: ఉద్యోగం పోయిందా? డోంట్ వర్నీ.. 50% జీతం మీ అకౌంట్లోకి వస్తుంది.. ఈ స్కీమ్ గురించి తెలుసా?
మహారాష్ట్రలో సిటింగ్ సీటు ఔరంగాబాద్ నుంచి ఇంతియాజ్ జలీల్, పూణె నుంచి అనిస్ సుంద్కే, ఉస్మానాబాద్ నుంచి సిద్ధిఖీ ఇబ్రహీం, ముంబై సెంట్రల్ నుంచి రంజన్ చౌదరి పోటీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇక బిహార్లో కిషన్గంజ్ నుంచి అక్తరుల్ ఇమాన్, హైదరాబాద్ నుంచి మజ్లిస్ అధినేత అసద్దుదీన్ ఒవైసీ పోటీ చేస్తున్నారు. అంతే కాకుండా మరో ఐదు లోకసభ స్థానాల నుంచి మజ్లిస్ అభ్యర్థులు బరిలో ఉన్నట్లు తెలిపారు.
కాగా.. ఇప్పటికే ఎంఐఎం పార్టీ తమిళనాడు, ఉత్తర్ ప్రదేశ్ లో పలు పార్టీలకు మద్దతు ప్రకటించింది. తమిళనాడులో అన్నాడీఎంకేతో పొత్తును ప్రకటించగా.. ఉత్తర్ ప్రదేశ్ లో అప్నాదళ్(కే) తో జతకట్టింది. మాజీ సీఎం ఎడప్పాడి పళనిస్వామి నేతృత్వంలోని ఆ పార్టీకి గతంలో ఎంఐఎం మద్దతు ప్రకటించింది. గతంలో బీజేపీ మిత్రపక్షంగా ఉన్న అన్నాడీఎంకే ఆ పార్టీతో తెగదెంపులు చేసుకుంది. గత నెల ఏప్రిల్ లో ఎక్స్ వేదికగా ఒవైసీ మాట్లాడుతూ.. 2026లో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయని.. పొత్తు కొనసాగుతుందని తెలిపారు. సీఏఏ, ఎన్పీఆర్, ఎన్ ఆర్సీని వ్యతిరేకిస్తామని అన్నాడీఎంకే ప్రకటించడంతో ఎంఐఎం ఆ పార్టీకి మద్దతు ఇస్తోందన్నారు.
- Tags
- AIMIM
- bhihar
- Hydrabad
- ilanadu
- maharastra
తాజావార్తలు
-
Raptee.HV T30: రాప్టీ.హెచ్వి T30 ఎలక్ట్రిక్ బైక్.. 150KM రియల్ రేంజ్, కారు ఛార్జర్తో ఛార్జింగ్!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Global Fuel Crisis: అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్లో రికార్డ్ స్థాయికి చేరిన డీజిల్, పెట్రోల్ ధరలు.. నెక్ట్స్ భారత్ వంతేనా?
-
Sangeet First Single: ఏఆర్ రెహమాన్ చేతుల మీదుగా ‘నీ వల్లే’ సాంగ్ రిలీజ్.. సిద్ శ్రీరామ్ మెలోడీకి ఫిదా అవుతున్న ఫ్యాన్స్!
-
Girls Hair Cutting: నిద్రలో ఉండగా జడలు కత్తిరింపు.. భీమిలి కేజీబీవీలో కలకలం
ట్రెండింగ్
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!