TG Municipal Election Results: ఆ మున్సిపాలిటీలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ పార్టీ విజయకేతనం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Municipal Election Results: తెలంగాణ రాష్ట్రంలో ఊహించని విధంగా ఓ పార్టీ ఒక మున్సిపాలిటీని కైవసం చేసుకుంది. జోగులాంబ గద్వాల జిల్లాలోని వడ్డేపల్లి మున్సిపాలిటీలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్(AIFB) పార్టీ ఘన విజయం సాధించింది. 8వ వార్డులో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి జయశ్రీ విజేతగా తన ప్రత్యర్థిపై 270 ఓట్ల భారీ ఆధిక్యంతో విజయకేతనం ఎగురవేశారు. ఇప్పటి వరకు ఈ పార్టీ తెలంగాణలో గెలవడం ఇదే మొదటిసారి! ఈ పార్టీ గుర్తు సింహం గుర్తు. వడ్డేపల్లి మున్సిపాలిటీలో మొత్తం 10 వార్డులకు గానూ.. ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ 8 గెలుచుకుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ కు ఒక్కో సీటు లభించింది. బీజేపీ, జనసేనకు మాత్రం ఒక్క సీటు కూడా రాలేదు. ఈ పార్టీ గురించి పూర్తి వివరాలు విషయానికి వస్తే.. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (AIFB) 1939లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్థాపించిన వామపక్ష జాతీయవాద రాజకీయ పార్టీ. ఇది భారత జాతీయ కాంగ్రెస్లో ఒక వర్గంగా ప్రారంభమై, పశ్చిమ బెంగాల్లో బలమైన ఉనికిని కలిగి ఉంది. పార్టీ జెండా ఎర్రగా ఉండి, దూకే పులి చిహ్నాన్ని కలిగి ఉంటుంది. ప్రస్తుతం జి. దేవరాజన్ ఈ పార్టీ సెక్రటరీ జనరల్గా వ్యవహరిస్తున్నారు.
READ MORE: Massive Sinkhole: బిజీబిజీగా మెట్రో పనులు.. సడన్ గా బయటపడ్డ భారీ సింక్హోల్.! వీడియో వైరల్..
Also Read
- Eknath Shinde: మహారాష్ట్రలో షిండే మరో ఎత్తుగడ.. మళ్లీ హాట్ టాఫిక్ కాబోతున్నారా?
- Vaibhav Sooryavanshi: వైభవ్ను ఈజీగా అవుట్ చేసే కొత్త ఆయుధం దొరికింది! బయటపడ్డ వండర్ కిడ్ బలహీనత!!
- NEET 2026: నీట్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు శుభవార్త!
- Explained: రెండూ మెసేజింగ్ యాప్లే కానీ.. వాట్సాప్ను వదిలేసి టెలిగ్రామ్నే ఎందుకు బ్యాన్ చేశారు? షాకింగ్ నిజాలు..
సుభాష్ చంద్రబోస్.. ఈ పేరు వినగానే భారత జాతి పులకిస్తుంది. ప్రతి వ్యక్తిలో ఆరాధన భావం ఉప్పొంగుతుంది. సాయుధ పోరాటం ద్వారానే బ్రిటిష్ వారిని మన దేశం నుంచి తరమగలమని ప్రకటించారు. ‘‘నాకు రక్తాన్ని ఇవ్వండి, నేను స్వేచ్ఛను ఇస్తాను’’ అని యువతలో స్వాతంత్య్ర కాంక్షను రగిల్చారు. ‘‘జైహింద్’’ నినాదంతో ప్రజల్లో పోరాట స్ఫూర్తిని నింపారు. ప్రత్యేక సైన్యాన్ని సమకూర్చుకుని ఆంగ్లేయులతో యుద్ధం చేశారు. దేశ ప్రజలంతా ఆయన్ను ‘నేతాజీ’గా పిలుస్తారు. అయితే… 1938లో భారత జాతీయ కాంగ్రెస్ వార్షిక సమావేశానికి అధ్యక్షుడిగా బోస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గాంధీజీతో విభేదాల కారణంగా కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి ‘అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్’ పార్టీని స్థాపించారు. 1940లో ఆ పార్టీ మహాసభ నాగ్పుర్లో జరిగింది.
తాజావార్తలు
-
Early Menopause: 40ఏళ్లలోపే పీరియడ్స్ ఆగిపోతున్నాయా? లాన్సెట్ నివేదికలో కీలక విషయాలు
-
Eknath Shinde: మహారాష్ట్రలో షిండే మరో ఎత్తుగడ.. మళ్లీ హాట్ టాఫిక్ కాబోతున్నారా?
-
ఇరాన్ తీసుకున్న ఈ ఒక్క నిర్ణయంతో ప్రపంచం మొత్తం మారిపోయింది..హార్మూజ్ తెరుచుకున్నా సీన్ మారదా?
-
Peddi : ఇదెక్కడి ట్విస్ట్.. ఇప్పట్లో ఆగేలా లేదు?
-
Maa Inti Bangaram: మా ఇంటి బంగారం పరిస్థితి ఏంటి ?
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Fight: భారత్-శ్రీలంక మ్యాచ్లో గొడవ.. వైభవ్ సూర్యవంశీ ఆగ్రహానికి అసలైన కారణం ఇదే!
-
Mrigashira నక్షత్రంలో పుట్టినవారు ఒక్కచోటు కుదురుగా ఉండరుగా.! అదృష్టం, స్వభావం, కెరీర్ అవకాశాలు ఎలా ఉంటాయంటే.?
-
Tilak Varma: నేను ఎవరికీ నీతులు చెప్పడానికి ఇక్కడ రాలేదు.. తిలక్ వర్మ సంచలన వ్యాఖ్యలు!
-
Vaibhav Sooryavanshi Fight: వైభవ్ సూర్యవంశీపై కఠిన చర్యలు తప్పవా?.. ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయంటే?
-
Lucky Plants : మీ పుట్టిన తేదీ ప్రకారం ఇంట్లో ఏ మొక్క పెంచితే అదృష్టం కలిసొస్తుందో తెలుసా?