TG Municipal Election Results: ఆ మున్సిపాలిటీలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ పార్టీ విజయకేతనం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Municipal Election Results: తెలంగాణ రాష్ట్రంలో ఊహించని విధంగా ఓ పార్టీ ఒక మున్సిపాలిటీని కైవసం చేసుకుంది. జోగులాంబ గద్వాల జిల్లాలోని వడ్డేపల్లి మున్సిపాలిటీలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్(AIFB) పార్టీ ఘన విజయం సాధించింది. 8వ వార్డులో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి జయశ్రీ విజేతగా తన ప్రత్యర్థిపై 270 ఓట్ల భారీ ఆధిక్యంతో విజయకేతనం ఎగురవేశారు. ఇప్పటి వరకు ఈ పార్టీ తెలంగాణలో గెలవడం ఇదే మొదటిసారి! ఈ పార్టీ గుర్తు సింహం గుర్తు. వడ్డేపల్లి మున్సిపాలిటీలో మొత్తం 10 వార్డులకు గానూ.. ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ 8 గెలుచుకుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ కు ఒక్కో సీటు లభించింది. బీజేపీ, జనసేనకు మాత్రం ఒక్క సీటు కూడా రాలేదు. ఈ పార్టీ గురించి పూర్తి వివరాలు విషయానికి వస్తే.. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (AIFB) 1939లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్థాపించిన వామపక్ష జాతీయవాద రాజకీయ పార్టీ. ఇది భారత జాతీయ కాంగ్రెస్లో ఒక వర్గంగా ప్రారంభమై, పశ్చిమ బెంగాల్లో బలమైన ఉనికిని కలిగి ఉంది. పార్టీ జెండా ఎర్రగా ఉండి, దూకే పులి చిహ్నాన్ని కలిగి ఉంటుంది. ప్రస్తుతం జి. దేవరాజన్ ఈ పార్టీ సెక్రటరీ జనరల్గా వ్యవహరిస్తున్నారు.
READ MORE: Massive Sinkhole: బిజీబిజీగా మెట్రో పనులు.. సడన్ గా బయటపడ్డ భారీ సింక్హోల్.! వీడియో వైరల్..
Also Read
- CM Chandrababu Kuppam Tour: కుప్పంలో సీఎం బిజీ షెడ్యూల్.. 23 వేల ఉద్యోగాల లక్ష్యంగా భారీ పరిశ్రమలకు శ్రీకారం
- Kambham Road Accident: పెళ్లి ఇంట్లో పెను విషాదం.. ఇద్దరు అన్నలు సహా నలుగురు మృతి.. పెళ్లి కూతురుకి తీవ్రగాయాలు..
- Astrology: జూలై 3 శుక్రవారం దినఫలాలు.. ఈ రాశివారికి శుభవార్త
- OTR: జోరుగా సాగర సమరం.. సాగర్ బీఆర్ఎస్లో ఎంసీ కోటిరెడ్డి vs నోముల భగత్..
సుభాష్ చంద్రబోస్.. ఈ పేరు వినగానే భారత జాతి పులకిస్తుంది. ప్రతి వ్యక్తిలో ఆరాధన భావం ఉప్పొంగుతుంది. సాయుధ పోరాటం ద్వారానే బ్రిటిష్ వారిని మన దేశం నుంచి తరమగలమని ప్రకటించారు. ‘‘నాకు రక్తాన్ని ఇవ్వండి, నేను స్వేచ్ఛను ఇస్తాను’’ అని యువతలో స్వాతంత్య్ర కాంక్షను రగిల్చారు. ‘‘జైహింద్’’ నినాదంతో ప్రజల్లో పోరాట స్ఫూర్తిని నింపారు. ప్రత్యేక సైన్యాన్ని సమకూర్చుకుని ఆంగ్లేయులతో యుద్ధం చేశారు. దేశ ప్రజలంతా ఆయన్ను ‘నేతాజీ’గా పిలుస్తారు. అయితే… 1938లో భారత జాతీయ కాంగ్రెస్ వార్షిక సమావేశానికి అధ్యక్షుడిగా బోస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గాంధీజీతో విభేదాల కారణంగా కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి ‘అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్’ పార్టీని స్థాపించారు. 1940లో ఆ పార్టీ మహాసభ నాగ్పుర్లో జరిగింది.
తాజావార్తలు
-
Revolt RVX: రివోల్ట్ నుంచి కొత్త RVX ఎలక్ట్రిక్ బైక్ లాంచ్.. 160KM రేంజ్, 90kmph టాప్ స్పీడ్
-
CM Chandrababu Kuppam Tour: కుప్పంలో సీఎం బిజీ షెడ్యూల్.. 23 వేల ఉద్యోగాల లక్ష్యంగా భారీ పరిశ్రమలకు శ్రీకారం
-
Vaibhav Sooryavanshi: దయచేసి వైభవ్ను ఆడించండి.. బీసీసీఐకి ఎవరన్నా చెప్పండ్రా బాబు.. దిగ్గజాల కామెంట్స్ వైరల్!
-
Telegram, Signal: వాట్సాప్ యూజర్నేమ్ వివాదం.. టెలిగ్రామ్, సిగ్నల్కు కేంద్రం నోటీసులు.. కారణమేంటి?
-
T20 World Cup 2026: సెమీస్లో దక్షిణాఫ్రికాపై ఘన విజయం.. ఫైనల్లో ఆస్ట్రేలియాతో ఇంగ్లండ్ ఢీ!
ట్రెండింగ్
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!