T Congress: టీ-కాంగ్రెస్లో ముదిరిన సంక్షోభం.. నేడు హైదరాబాద్కు దిగ్విజయ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
T Congress: తెలంగాణ కాంగ్రెస్లో పంచాయతీపై అధిష్ఠానం సీరియస్గానే నజర్ పెట్టింది. ఆ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ను పరిశీలకుడిగా పంపిస్తోంది. ఇవాళ సాయంత్రం ఆయన హైదరాబాద్కు రాబోతున్నారు. అధిష్ఠానం జోక్యంతో సీనియర్ నేతల సమావేశం వాయిదా పడింది. రేపు సీనియర్లు, రేవంత్ టీమ్తో దిగ్విజయ్ సింగ్ సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. ఇవాళ సాయంత్రం 7.45గంటలకు ఆయన హైదరాబాద్కు చేరుకుంటారు. టీ-కాంగ్రెస్లో సమస్యల పరిష్కారంపై దిగ్విజయ్ సింగ్ దృష్టి సారించనున్నారు.
తెలంగాణ కాంగ్రెస్లో ఇటీవల చీలికలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. వలస నేతలు, ఒరిజినల్ నేతలు అంటూ విమర్శలు చేసుకున్నారు. టీపీసీసీ కమిటీల విషయంలో ఒరిజినల్ కాంగ్రెస్ నేతలకు ప్రాధాన్యత ఇవ్వలేదని తెలంగాణ కాంగ్రెస్లోని పలువురు సీనియర్ నేతలు ఆరోపించారు. రేవంత్ రెడ్డి వెంట టీడీపీని వీడి కాంగ్రెస్లో చేరిన నేతలు ఈ నెల 18న తమ పదవులకు రాజీనామాలు సమర్పించారు. కాంగ్రెస్ పార్టీ ఎగ్జిక్యూటివ్ సమావేశానికి సీనియర్లు దూరంగా ఉన్నారు. మంగళవారం పార్టీ సీనియర్ నేతలు సమావేశం అవ్వాలంటూ నిర్ణయం తీసుకున్నారు. ఇంతలో పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ను సమస్యలను పరిష్కరించాలని అధిష్ఠానం నిర్ణయించింది. దీంతో కాంగ్రెస్ సీనియర్ నేతలు తలపెట్టిన సమావేశం వాయిదా పడింది.
Also Read
- Balka Suman: మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్పై కేసు నమోదు
- YS Jagan: వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో జగన్ కీలక వ్యాఖ్యలు.. రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు పిలుపు
- TDP Mahanadu: పసుపు జెండా చూస్తే వచ్చే వైబ్రేషన్సే వేరు.. మహానాడులో చంద్రబాబు భావోద్వేగ ప్రసంగం
- స్టైలిష్ డిజైన్, 50MP పెరిస్కోప్ కెమెరా, IP69K రెసిస్టెన్స్ తో OPPO Reno16 సిరీస్ లాంచ్..
Covid Bells: మళ్లీ దడ పుట్టిస్తున్న కొవిడ్ కేసులు.. భారత్కు నాలుగో వేవ్ ముప్పు!
మరోవైపు కాంగ్రెస్ పార్టీలో చోటుచేసుకున్న పరిణామాలను చక్కదిద్దేందుకు గాను దిగ్విజయ్ను ఏఐసీసీ పరిశీలకుడిగా నియమించింది. దిగ్విజయ్ సింగ్ సూచనతో సీనియర్లు మంగళవారం జరగాల్సిన సమావేశాన్ని వాయిదా వేశారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జుున ఖర్గే, కేసీ వేణుగోపాల్, దిగ్విజయ్ సింగ్లు రాష్ట్రానికి చెందిన పలువురు పార్టీ నేతలతో మంగళవారం ఫోన్లో మాట్లాడారు. పార్టీలో చోటు చేసుకున్న సంక్షోభ నివారణకు ప్రయత్నాలు చేశారు. ఈ ఫోన్లతో సీనియర్లు కొంతమేర శాంతించారు. ఇక తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లతో మాట్లాడేందుకు వస్తున్న దిగ్విజయ్ సింగ్.. వారితో పాటు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితోనూ మాట్లాడతారా ? అనే చర్చ జరుగుతోంది. కొంతకాలంగా ఎంపీ వెంకట్ రెడ్డి పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారు. పార్టీలో కొనసాగడం లేదా వేరే పార్టీలోకి వెళ్లడం వంటి అంశాలను ఎన్నికలకు నెల రోజుల ముందే చెబుతానని అన్నారు. అప్పటివరకు తన నియోజకవర్గం అభివృద్ధి మీదే ఫోకస్ చేస్తానని చెప్పుకొచ్చారు. అయితే కాంగ్రెస్లో కోమటిరెడ్డి బ్రదర్స్కు సన్నిహితుడిగా పేరున్న దిగ్విజయ్ సింగ్ రంగంలోకి దిగితే.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా కూల్ అవుతారేమో చూడాలి.
తాజావార్తలు
-
Balka Suman: మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్పై కేసు నమోదు
-
SRH vs RR Eliminator: కళ్లు చెదిరే గణాంకాలు వర్మ.. ఎలిమినేటర్లో బౌలర్లకు అతి పెద్ద సవాల్ ఆ ఇద్దరే!
-
YS Jagan: వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో జగన్ కీలక వ్యాఖ్యలు.. రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు పిలుపు
-
Vishwambhara : అదిగో విశ్వంభర.. ఇదిగో రిలీజ్
-
TDP Mahanadu: పసుపు జెండా చూస్తే వచ్చే వైబ్రేషన్సే వేరు.. మహానాడులో చంద్రబాబు భావోద్వేగ ప్రసంగం
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, 50MP పెరిస్కోప్ కెమెరా, IP69K రెసిస్టెన్స్ తో OPPO Reno16 సిరీస్ లాంచ్..
-
200MP కెమెరా, 8600mAh బ్యాటరీ, Dimensity 8550 Elite చిప్తో HONOR 600 సిరీస్ లాంచ్.!
-
12.1 అంగుళాల 3K డిస్ప్లే, 10100mAh బ్యాటరీతో HONOR Pad 20 లాంచ్.!
-
Raw Mango Roti Pachadi: అమ్మ చేతి రుచిని గుర్తు చేసే పుల్లటి “మామిడికాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
రూ.11,999కే 6000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Lava SHARK 2 5G లాంచ్..!