T Congress: టీ-కాంగ్రెస్లో ముదిరిన సంక్షోభం.. నేడు హైదరాబాద్కు దిగ్విజయ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
T Congress: తెలంగాణ కాంగ్రెస్లో పంచాయతీపై అధిష్ఠానం సీరియస్గానే నజర్ పెట్టింది. ఆ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ను పరిశీలకుడిగా పంపిస్తోంది. ఇవాళ సాయంత్రం ఆయన హైదరాబాద్కు రాబోతున్నారు. అధిష్ఠానం జోక్యంతో సీనియర్ నేతల సమావేశం వాయిదా పడింది. రేపు సీనియర్లు, రేవంత్ టీమ్తో దిగ్విజయ్ సింగ్ సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. ఇవాళ సాయంత్రం 7.45గంటలకు ఆయన హైదరాబాద్కు చేరుకుంటారు. టీ-కాంగ్రెస్లో సమస్యల పరిష్కారంపై దిగ్విజయ్ సింగ్ దృష్టి సారించనున్నారు.
తెలంగాణ కాంగ్రెస్లో ఇటీవల చీలికలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. వలస నేతలు, ఒరిజినల్ నేతలు అంటూ విమర్శలు చేసుకున్నారు. టీపీసీసీ కమిటీల విషయంలో ఒరిజినల్ కాంగ్రెస్ నేతలకు ప్రాధాన్యత ఇవ్వలేదని తెలంగాణ కాంగ్రెస్లోని పలువురు సీనియర్ నేతలు ఆరోపించారు. రేవంత్ రెడ్డి వెంట టీడీపీని వీడి కాంగ్రెస్లో చేరిన నేతలు ఈ నెల 18న తమ పదవులకు రాజీనామాలు సమర్పించారు. కాంగ్రెస్ పార్టీ ఎగ్జిక్యూటివ్ సమావేశానికి సీనియర్లు దూరంగా ఉన్నారు. మంగళవారం పార్టీ సీనియర్ నేతలు సమావేశం అవ్వాలంటూ నిర్ణయం తీసుకున్నారు. ఇంతలో పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ను సమస్యలను పరిష్కరించాలని అధిష్ఠానం నిర్ణయించింది. దీంతో కాంగ్రెస్ సీనియర్ నేతలు తలపెట్టిన సమావేశం వాయిదా పడింది.
Also Read
- US-Iran: శాంతి ఒప్పందంపై ప్రతిష్టంభన.. అమెరికా-ఇరాన్ మధ్య మళ్లీ ఉద్రిక్తతలు!
- Telegram Ban in India: భారత్లో టెలిగ్రామ్పై నిషేధం ఎందుకు..? వివాదానికి కారణమైన 5 కీలక ఫీచర్లు ఇవే
- Vaibhav And Tilak Varma: బిగ్ షాక్.. వైభవ్ సూర్యవంశీకి భారీ జరిమానా, కెప్టెన్ తిలక్ వర్మపై నిషేధం..
- Ind Vs Ned: పసికూన నెదర్లాండ్పై భారీ స్కోర్.. విధ్వంసం స్పష్టించిన ఓపెనర్లు స్మృతి మంధాన, షెఫాలీ వర్మ..
Covid Bells: మళ్లీ దడ పుట్టిస్తున్న కొవిడ్ కేసులు.. భారత్కు నాలుగో వేవ్ ముప్పు!
మరోవైపు కాంగ్రెస్ పార్టీలో చోటుచేసుకున్న పరిణామాలను చక్కదిద్దేందుకు గాను దిగ్విజయ్ను ఏఐసీసీ పరిశీలకుడిగా నియమించింది. దిగ్విజయ్ సింగ్ సూచనతో సీనియర్లు మంగళవారం జరగాల్సిన సమావేశాన్ని వాయిదా వేశారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జుున ఖర్గే, కేసీ వేణుగోపాల్, దిగ్విజయ్ సింగ్లు రాష్ట్రానికి చెందిన పలువురు పార్టీ నేతలతో మంగళవారం ఫోన్లో మాట్లాడారు. పార్టీలో చోటు చేసుకున్న సంక్షోభ నివారణకు ప్రయత్నాలు చేశారు. ఈ ఫోన్లతో సీనియర్లు కొంతమేర శాంతించారు. ఇక తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లతో మాట్లాడేందుకు వస్తున్న దిగ్విజయ్ సింగ్.. వారితో పాటు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితోనూ మాట్లాడతారా ? అనే చర్చ జరుగుతోంది. కొంతకాలంగా ఎంపీ వెంకట్ రెడ్డి పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారు. పార్టీలో కొనసాగడం లేదా వేరే పార్టీలోకి వెళ్లడం వంటి అంశాలను ఎన్నికలకు నెల రోజుల ముందే చెబుతానని అన్నారు. అప్పటివరకు తన నియోజకవర్గం అభివృద్ధి మీదే ఫోకస్ చేస్తానని చెప్పుకొచ్చారు. అయితే కాంగ్రెస్లో కోమటిరెడ్డి బ్రదర్స్కు సన్నిహితుడిగా పేరున్న దిగ్విజయ్ సింగ్ రంగంలోకి దిగితే.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా కూల్ అవుతారేమో చూడాలి.
తాజావార్తలు
-
US-Iran: శాంతి ఒప్పందంపై ప్రతిష్టంభన.. అమెరికా-ఇరాన్ మధ్య మళ్లీ ఉద్రిక్తతలు!
-
Telegram Ban in India: భారత్లో టెలిగ్రామ్పై నిషేధం ఎందుకు..? వివాదానికి కారణమైన 5 కీలక ఫీచర్లు ఇవే
-
Hair Care Tips : జుట్టు త్వరగా జిడ్డుగా మారుతోందా? ఈ సింపుల్ టిప్స్తో రోజంతా ఫ్రెష్గా!
-
Vaibhav And Tilak Varma: బిగ్ షాక్.. వైభవ్ సూర్యవంశీకి భారీ జరిమానా, కెప్టెన్ తిలక్ వర్మపై నిషేధం..
-
Ind Vs Ned: పసికూన నెదర్లాండ్పై భారీ స్కోర్.. విధ్వంసం స్పష్టించిన ఓపెనర్లు స్మృతి మంధాన, షెఫాలీ వర్మ..
ట్రెండింగ్
-
Cleaning Hacks : బాత్రూమ్ బకెట్లు నల్లగా మారాయా.? ఈ ఒక్క చిట్కాతో కొత్తవాటిలా మెరిపించండి.!
-
Vaibhav Sooryavanshi Controversy: వైభవ్ అవుట్పై వివాదం.. థర్డ్ అంపైర్ నిర్ణయంపై అఫ్గాన్ ప్లేయర్స్ అసంతృప్తి!
-
Ragi Bun Dosa: ఆరోగ్యం, రుచి రెండూ ఒకేచోట.. స్పాంజీ లాంటి ‘రాగి బన్ దోస’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Wedding Expenses: పెళ్లి ముహూర్తాలకు వేళాయే.. తక్కువ టైమ్ ఉండటంతో తెలుగు ఇళ్లల్లో బడ్జెట్ టెన్షన్!!
-
Ayodhya Ram Mandir: రాముడికి ప్రసాదంగా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండ్లు.!