Gunfire : ప్రియురాలితో, గన్తో జోక్స్ వద్దు.. పేలితే ఇలా ప్రాణం పోద్ది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gunfire : అహ్మదాబాద్లోని వెజల్పూర్లోని ఓ సొసైటీలో షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన జరిగినప్పుడు తన లైసెన్స్ రివాల్వర్తో జోక్ చేయడం యువకుడి మరణానికి కారణమైంది. ఆ సమయంలో యువకుడితో పాటు ప్రియురాలు, డ్రైవర్ కూడా ఉన్నారు. ఆ యువకుడు సరదాగా రివాల్వర్ని తన ప్రియురాలి ముందు తలపై పెట్టుకుని మూడుసార్లు ట్రిగ్గర్ను నొక్కాడు. రెండుసార్లు ట్రిగ్గర్ నొక్కినా లక్కీగా బుల్లెట్ పేలలేదు. మూడోసారి ట్రిగ్గర్ నొక్కడంతో బుల్లెట్ పేలి స్పాట్లోనే ప్రాణాలు పోగొట్టుకున్నాడు.
ఈ ఘటన అహ్మదాబాద్లోని వేజల్పూర్లోని రూపేష్ పార్క్ సొసైటీలో చోటుచేసుకుంది. ఆదివారం అర్థరాత్రి కాల్పుల ఘటన చోటు చేసుకుంది. యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసు బృందం సంఘటనా స్థలానికి చేరుకుంది. దిగ్విజయ్ సింగ్ అలియాస్ భోలో రాజ్పుత్ అనే 36 ఏళ్ల యువకుడు తన సొంత లైసెన్స్ రివాల్వర్తో తలపై కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఇదే అతని మరణానికి కారణం.
Also Read
- Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
- NASA: అంగారక గ్రహంపై ఏలియన్ 'జెల్లీఫిష్' కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
- Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
- T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
Read Also:Ananya Nagalla: వేణుస్వామిని కలిసిన అనన్య.. సినిమా కోసమేనా?
మృతుడు దిగ్విజయ్ సింగ్ ప్రాపర్టీ బ్రోకర్గా పనిచేస్తున్నాడని పోలీసులు తెలిపారు. మృతుడు దిగ్విజయ్ సింగ్ తన స్నేహితురాలు ఖుషీ గోస్వామి, డ్రైవర్ సత్యదీప్ వైద్యతో కలిసి రూపేష్ పార్క్ సొసైటీలో కొత్తగా నిర్మించిన ఫ్లాట్లో ఉన్నాడు. అప్పుడు దిగ్విజయ్ సరదాగా తన రివాల్వర్లో బుల్లెట్లను నింపి తన ప్రేయసి ముందు తన తలపై గురిపెట్టాడు. రివాల్వర్ ట్రిగ్గర్ నొక్కడం మొదలుపెట్టాడు. రెండుసార్లు ట్రిగ్గర్ నొక్కిన తర్వాత బుల్లెట్ పేలలేదు, మూడోసారి బుల్లెట్ పేలడంతో అది అతని తలకు తగిలింది. వెంటనే ప్రాణం పోయింది.
పోలీసులు, ఎఫ్ఎస్ఎల్ బృందం ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. యువకుడు రివాల్వర్ ట్రిగ్గర్ను రెండుసార్లు నొక్కినట్లు, దానిని నొక్కడం వల్ల ఏమీ జరగదని సరదాగా చెప్పినట్లు ఎఫ్ఎస్ఎల్ బృందం తెలిపింది. దిగ్విజయ్ సింగ్ మూడోసారి ట్రిగ్గర్ నొక్కడంతో బుల్లెట్ పేలి చనిపోయాడు. మృతుడు దిగ్విజయ్ సింగ్ డ్రైవర్ వాంగ్మూలాన్ని పోలీసులు నమోదు చేశారు.
దిగ్విజయ్ సింగ్ కు మద్యం సేవించే అలవాటు ఉందని పోలీసులు తెలిపారు. ఘటన జరిగిన సమయంలో అతడు మద్యం సేవించి ఉన్నాడా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఈ ఘటన అంతా జోక్లా లేక కుట్ర జరిగిందా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. యువకుడి మృతదేహాన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు ముమ్మరం చేశారు.
Read Also:Manohar Lal Khattar: మరోసారి హర్యానా సీఎంగా మనోహర్ లాల్ ఖట్టర్.. సాయంత్రం ప్రమాణ స్వీకారం..
తాజావార్తలు
-
Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
-
NASA: అంగారక గ్రహంపై ఏలియన్ ‘జెల్లీఫిష్’ కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
-
Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
-
Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
-
T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!