Gunfire : ప్రియురాలితో, గన్తో జోక్స్ వద్దు.. పేలితే ఇలా ప్రాణం పోద్ది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gunfire : అహ్మదాబాద్లోని వెజల్పూర్లోని ఓ సొసైటీలో షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన జరిగినప్పుడు తన లైసెన్స్ రివాల్వర్తో జోక్ చేయడం యువకుడి మరణానికి కారణమైంది. ఆ సమయంలో యువకుడితో పాటు ప్రియురాలు, డ్రైవర్ కూడా ఉన్నారు. ఆ యువకుడు సరదాగా రివాల్వర్ని తన ప్రియురాలి ముందు తలపై పెట్టుకుని మూడుసార్లు ట్రిగ్గర్ను నొక్కాడు. రెండుసార్లు ట్రిగ్గర్ నొక్కినా లక్కీగా బుల్లెట్ పేలలేదు. మూడోసారి ట్రిగ్గర్ నొక్కడంతో బుల్లెట్ పేలి స్పాట్లోనే ప్రాణాలు పోగొట్టుకున్నాడు.
ఈ ఘటన అహ్మదాబాద్లోని వేజల్పూర్లోని రూపేష్ పార్క్ సొసైటీలో చోటుచేసుకుంది. ఆదివారం అర్థరాత్రి కాల్పుల ఘటన చోటు చేసుకుంది. యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసు బృందం సంఘటనా స్థలానికి చేరుకుంది. దిగ్విజయ్ సింగ్ అలియాస్ భోలో రాజ్పుత్ అనే 36 ఏళ్ల యువకుడు తన సొంత లైసెన్స్ రివాల్వర్తో తలపై కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఇదే అతని మరణానికి కారణం.
Also Read
- Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
- US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
- I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. 'ఐబొమ్మ', 'బప్పం' వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
- CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
Read Also:Ananya Nagalla: వేణుస్వామిని కలిసిన అనన్య.. సినిమా కోసమేనా?
మృతుడు దిగ్విజయ్ సింగ్ ప్రాపర్టీ బ్రోకర్గా పనిచేస్తున్నాడని పోలీసులు తెలిపారు. మృతుడు దిగ్విజయ్ సింగ్ తన స్నేహితురాలు ఖుషీ గోస్వామి, డ్రైవర్ సత్యదీప్ వైద్యతో కలిసి రూపేష్ పార్క్ సొసైటీలో కొత్తగా నిర్మించిన ఫ్లాట్లో ఉన్నాడు. అప్పుడు దిగ్విజయ్ సరదాగా తన రివాల్వర్లో బుల్లెట్లను నింపి తన ప్రేయసి ముందు తన తలపై గురిపెట్టాడు. రివాల్వర్ ట్రిగ్గర్ నొక్కడం మొదలుపెట్టాడు. రెండుసార్లు ట్రిగ్గర్ నొక్కిన తర్వాత బుల్లెట్ పేలలేదు, మూడోసారి బుల్లెట్ పేలడంతో అది అతని తలకు తగిలింది. వెంటనే ప్రాణం పోయింది.
పోలీసులు, ఎఫ్ఎస్ఎల్ బృందం ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. యువకుడు రివాల్వర్ ట్రిగ్గర్ను రెండుసార్లు నొక్కినట్లు, దానిని నొక్కడం వల్ల ఏమీ జరగదని సరదాగా చెప్పినట్లు ఎఫ్ఎస్ఎల్ బృందం తెలిపింది. దిగ్విజయ్ సింగ్ మూడోసారి ట్రిగ్గర్ నొక్కడంతో బుల్లెట్ పేలి చనిపోయాడు. మృతుడు దిగ్విజయ్ సింగ్ డ్రైవర్ వాంగ్మూలాన్ని పోలీసులు నమోదు చేశారు.
దిగ్విజయ్ సింగ్ కు మద్యం సేవించే అలవాటు ఉందని పోలీసులు తెలిపారు. ఘటన జరిగిన సమయంలో అతడు మద్యం సేవించి ఉన్నాడా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఈ ఘటన అంతా జోక్లా లేక కుట్ర జరిగిందా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. యువకుడి మృతదేహాన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు ముమ్మరం చేశారు.
Read Also:Manohar Lal Khattar: మరోసారి హర్యానా సీఎంగా మనోహర్ లాల్ ఖట్టర్.. సాయంత్రం ప్రమాణ స్వీకారం..
తాజావార్తలు
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!