Gunfire : ప్రియురాలితో, గన్తో జోక్స్ వద్దు.. పేలితే ఇలా ప్రాణం పోద్ది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gunfire : అహ్మదాబాద్లోని వెజల్పూర్లోని ఓ సొసైటీలో షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన జరిగినప్పుడు తన లైసెన్స్ రివాల్వర్తో జోక్ చేయడం యువకుడి మరణానికి కారణమైంది. ఆ సమయంలో యువకుడితో పాటు ప్రియురాలు, డ్రైవర్ కూడా ఉన్నారు. ఆ యువకుడు సరదాగా రివాల్వర్ని తన ప్రియురాలి ముందు తలపై పెట్టుకుని మూడుసార్లు ట్రిగ్గర్ను నొక్కాడు. రెండుసార్లు ట్రిగ్గర్ నొక్కినా లక్కీగా బుల్లెట్ పేలలేదు. మూడోసారి ట్రిగ్గర్ నొక్కడంతో బుల్లెట్ పేలి స్పాట్లోనే ప్రాణాలు పోగొట్టుకున్నాడు.
ఈ ఘటన అహ్మదాబాద్లోని వేజల్పూర్లోని రూపేష్ పార్క్ సొసైటీలో చోటుచేసుకుంది. ఆదివారం అర్థరాత్రి కాల్పుల ఘటన చోటు చేసుకుంది. యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసు బృందం సంఘటనా స్థలానికి చేరుకుంది. దిగ్విజయ్ సింగ్ అలియాస్ భోలో రాజ్పుత్ అనే 36 ఏళ్ల యువకుడు తన సొంత లైసెన్స్ రివాల్వర్తో తలపై కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఇదే అతని మరణానికి కారణం.
Also Read
- CM Chandrababu: చట్ట వ్యతిరేక నిరసనలు సహించం.. వైసీపీ దీక్షలపై సీఎం కీలక వ్యాఖ్యలు..!
- KCR: స్వర్గీయ పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి కేసీఆర్ అండ.. రూ. 2.25 కోట్ల ఆర్థిక సాయం..
- Ragi Semiya Payasam: రాగితో కమ్మని పాయసం.. ఐరన్, కాల్షియం, ఫైబర్ పుష్కలం.. రెసిపీ ఇదిగో!
- Cheyutha Pension: అలర్ట్.. నేటి నుంచి కొత్త పింఛన్ల దరఖాస్తులు ప్రారంభం.. పూర్తి వివరాలు ఇవే..
Read Also:Ananya Nagalla: వేణుస్వామిని కలిసిన అనన్య.. సినిమా కోసమేనా?
మృతుడు దిగ్విజయ్ సింగ్ ప్రాపర్టీ బ్రోకర్గా పనిచేస్తున్నాడని పోలీసులు తెలిపారు. మృతుడు దిగ్విజయ్ సింగ్ తన స్నేహితురాలు ఖుషీ గోస్వామి, డ్రైవర్ సత్యదీప్ వైద్యతో కలిసి రూపేష్ పార్క్ సొసైటీలో కొత్తగా నిర్మించిన ఫ్లాట్లో ఉన్నాడు. అప్పుడు దిగ్విజయ్ సరదాగా తన రివాల్వర్లో బుల్లెట్లను నింపి తన ప్రేయసి ముందు తన తలపై గురిపెట్టాడు. రివాల్వర్ ట్రిగ్గర్ నొక్కడం మొదలుపెట్టాడు. రెండుసార్లు ట్రిగ్గర్ నొక్కిన తర్వాత బుల్లెట్ పేలలేదు, మూడోసారి బుల్లెట్ పేలడంతో అది అతని తలకు తగిలింది. వెంటనే ప్రాణం పోయింది.
పోలీసులు, ఎఫ్ఎస్ఎల్ బృందం ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. యువకుడు రివాల్వర్ ట్రిగ్గర్ను రెండుసార్లు నొక్కినట్లు, దానిని నొక్కడం వల్ల ఏమీ జరగదని సరదాగా చెప్పినట్లు ఎఫ్ఎస్ఎల్ బృందం తెలిపింది. దిగ్విజయ్ సింగ్ మూడోసారి ట్రిగ్గర్ నొక్కడంతో బుల్లెట్ పేలి చనిపోయాడు. మృతుడు దిగ్విజయ్ సింగ్ డ్రైవర్ వాంగ్మూలాన్ని పోలీసులు నమోదు చేశారు.
దిగ్విజయ్ సింగ్ కు మద్యం సేవించే అలవాటు ఉందని పోలీసులు తెలిపారు. ఘటన జరిగిన సమయంలో అతడు మద్యం సేవించి ఉన్నాడా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఈ ఘటన అంతా జోక్లా లేక కుట్ర జరిగిందా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. యువకుడి మృతదేహాన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు ముమ్మరం చేశారు.
Read Also:Manohar Lal Khattar: మరోసారి హర్యానా సీఎంగా మనోహర్ లాల్ ఖట్టర్.. సాయంత్రం ప్రమాణ స్వీకారం..
తాజావార్తలు
-
Ramayana: షాక్ ఇచ్చిన మేకర్స్.. విదేశాల్లో రెండు రోజుల ముందే ‘రామాయణం’…
-
CM Chandrababu: చట్ట వ్యతిరేక నిరసనలు సహించం.. వైసీపీ దీక్షలపై సీఎం కీలక వ్యాఖ్యలు..!
-
HMD Touch AI: 1950mAh బ్యాటరీతో.. హెచ్ఎమ్డి టచ్ ఏఐ ఫోన్ గ్లోబల్ మార్కెట్లలో విడుదలకు రెడీ!
-
KCR: స్వర్గీయ పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి కేసీఆర్ అండ.. రూ. 2.25 కోట్ల ఆర్థిక సాయం..
-
Ragi Semiya Payasam: రాగితో కమ్మని పాయసం.. ఐరన్, కాల్షియం, ఫైబర్ పుష్కలం.. రెసిపీ ఇదిగో!
ట్రెండింగ్
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!