Bus Fire Accident: కర్నూలు ఘటన మరవక ముందే.. మరో డబుల్ డెక్కర్ బస్సులో భారీ అగ్నిప్రమాదం.. ఎక్కడంటే?
- ఆగ్రా–లక్నో ఎక్స్ప్రెస్వేపై తెల్లవారుజామున డబుల్ డెక్కర్ బస్సులో భారీ అగ్నిప్రమాదం
- బస్సులో ప్రయాణిస్తున్న 70 మంది ప్రయాణికులు సురక్షితం
- ప్రమాదం రేవ్రి టోల్ ప్లాజా సమీపంలో
- బస్సు ఢిల్లీ నుంచి లక్నో మీదుగా గోండాకు ప్రయాణం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bus Fire Accident: కర్నూలు సమీపంలో జరిగిన దారుణ బస్సు ఘటన జరగక ముందే.. ఆగ్రా-లక్నో ఎక్స్ప్రెస్వేపై రెవ్రి టోల్ ప్లాజా సమీపంలో ఆదివారం తెల్లవారుజామున ఒక డబుల్ డెక్కర్ స్లీపర్ బస్సులో మరో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 70 మంది ప్రయాణికులు ఉండగా.. వారందరూ సురక్షితంగా బయటపడటంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ప్రయాణికులకు ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. బస్సు ఢిల్లీ నుంచి లక్నో మీదుగా గోండాకు ప్రయాణిస్తోంది. టోల్ ప్లాజాకు సుమారు 500 మీటర్ల దూరంలో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ సమాచారం అందిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు.
Perni Nani: ఎంపీ కేశినేని చిన్ని మునిగిపోతున్న నావ.. పేర్ని నాని కీలక వ్యాఖ్యలు
Also Read
- INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
- CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
- India vs Pakistan: అంపైర్లు కూడా భారత్కే సపోర్ట్.. పాక్ క్రికెటర్ సంచలన ఆరోపణలు..
- TG20 League: 'హైదరాబాద్ ఈ ఛాంపియన్స్' ఫైనల్ స్క్వాడ్.. ఇదిగో పూర్తి లిస్ట్..
అయితే అప్పటికే బస్సు డ్రైవర్, కండక్టర్ అప్రమత్తమై ప్రయాణికులందరినీ ముందుగా సురక్షితంగా కిందకు దించేశారు. ఇక అందిన ప్రాథమిక సమాచారం ప్రకారం.. బస్సు టైర్లలో మంట ఏర్పడడం వల్ల మంటలు చెలరేగి, త్వరగా వాహనం అంతటా వ్యాపించి ఉంటాయని డ్రైవర్ తెలిపినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఇక బస్సులో చెలరేగిన మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపులోకి తీసుకురాగా.. ప్రమాదానికి గురైన బస్సును రోడ్డు పక్కకు తొలగించి, ట్రాఫిక్ రాకపోకలను సాధారణ స్థితికి తీసుకొచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ప్రయాణికులు ఎవరికీ ఇబ్బంది కలగకుండా ఉండేందుకు బస్సు యజమాని ప్రత్యామ్నాయ వాహనాన్ని ఏర్పాటు చేసి.. అందరూ వారి గమ్యస్థానాలకు చేరుకోవడానికి ఏర్పాట్లు చేశారు.
Horrifying visuals of a burning Bus carrying Hindu Pilgrims.
It was passing by M dominant Nuh, Mewat area where suddenly the bus was enveloped in flames.
Eight hindu pilgrims dead!
It's the same place where Ms had held thousands of hindu pilgrims in ancient Nalhar shiva Temple pic.twitter.com/20HD29Asf3
— Ritu #सत्यसाधक (@RituRathaur) May 19, 2024
తాజావార్తలు
-
Carrot Oil : ముఖం గ్లో అవ్వాలా.? క్యారెట్ నూనెతో మెరిసే చర్మం..
-
INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
-
CM Revanth Reddy : సైబరాబాద్కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
-
Kitchen Hacks: ఇలా చేస్తే మీ వంటింట్లోకి చీమలు చచ్చినారావు.. కేవలం 2 నిమిషాల్లో ఇంట్లోనే ఈ నాచురల్ స్ప్రే చేసుకోండిలా!
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!