Katrina Kaif Morphed Photo: రష్మిక మందన్న మార్ఫింగ్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ వీడియోలో రష్మిక భారీ అందాలతో ఎక్స్పోజింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ డీప్ ఫేక్ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోపై నెటిజన్లు, రష్మిక అభిమానులే కాకుండా బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ఘటనపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న డీప్ ఫేక్ వీడియోపై రష్మిక స్పందించింది. ఈ ఘటనపై స్పందించాల్సి రావడం నిజంగా బాధాకరమని అన్నారు. ఇలాంటి పరిస్థితి ఎదుర్కోవడం భయానకంగా అనిపిస్తోంది. సాంకేతిక పరిజ్ఞానాన్ని దుర్వినియోగం చేయడం కారణంగా ఇలాంటి పరిస్థితి నాకే కాదు.. ప్రతి ఒక్కరికీ పొంచి ఉంది. అంటూ బాధను వ్యక్తం చేసింది.
Read Also:Kurnool: భార్య ఆత్మహత్య చేసుకున్న 6 ఏళ్లకు భర్తకు జైలు శిక్ష.. కారణం ఇదేనా..?
I WILL NOT WASTE MONEY ON SALMAN KHAN pic.twitter.com/nvxjAT3Vtb
— Ahmed (FAN) (@AhmedSrkMan2) November 6, 2023
రష్మిక మందన్న వీడియో తర్వాత ఇప్పుడు కత్రినా కైఫ్ చిత్రాన్ని కూడా మార్ఫింగ్ చేశారు. టైగర్ 3 సినిమాలో ఆమె నటించిన టవల్ మార్ఫింగ్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఫోటోను నవంబర్ 6న సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కొందరు అర్థరాత్రి వరకు ఎడిట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. కత్రినాకు సంబంధించిన ఈ సీన్ టీజర్ వచ్చినప్పటి నుంచి హెడ్లైన్స్లో ఉంది. ఇలా చేయడం అంత ఈజీ కాదని కత్రినా మీడియాకు చెప్పింది. టైగర్ 3లోని దృశ్యాన్ని ఆమె ఇటీవల తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. అందులో టైగర్ 3 కోసం కత్రినా ఎంత కష్టపడుతున్నానో రాసింది. ఫోటోతో పాటు, ఆమె వ్యాయామానికి సంబంధించిన అనేక వీడియో క్లిప్లు కూడా ఉన్నాయి. ఈ పోస్ట్తో చివరి ఫోటోను కత్రినా షేర్ చేసింది. ఇందులో మిచెల్ లీతో కత్రినా ఫైట్ చేస్తూ కనిపించింది.