Pahalgam Attack: ప్రతీకారం తీర్చుకోవాల్సిందే?.. హమాస్పై ఇజ్రాయెల్ దాడిని గుర్తు చేస్తున్న నెటిజన్లు..
- ఉగ్రవాదులను మట్టుబెట్టాలని డిమాండ్
- వైరల్ అవుతున్న WeWantRevenge ట్యాగ్
- హమాస్- ఇజ్రాయెల్ దాడిని గుర్తు చేస్తున్న నెటిజన్లు
జమ్మూ కశ్మీర్లోని పహల్గాంలో మంగళవారం పర్యటకులపై దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడిలో 28 మంది మరణించినట్లు తెలుస్తోంది. కాగా.. ప్రతికారం తీర్చుకోవాలని భారతీయ పౌరులు డిమాండ్ చేస్తున్నారు. గతేడాది అక్టోబర్లో జరిగిన హమాస్, ఇజ్రాయెల్ దాడిని గుర్తు చేస్తున్నారు. హమాస్ (పాలస్తీనా మిలిటెంట్ గ్రూపు) అనవసరంగా ఇజ్రాయెల్తో కయ్యానికి కాలు దువ్వింది. ఆ దేశంపై దాడులు చేసి తన గోతి తానే తవ్వుకుంది. ఇజ్రాయెల్ ధాటికి హమాస్ చాలా నష్టపోవాల్సి వచ్చింది. దాడి జరిగిన కొన్ని గంటల్లో స్పందించిన ఇజ్రాయెల్ గాజాలో బాంబుల వర్షం కురిపించింది. ఇప్పుడు అదే రీతిలో పాకిస్థాన్ అనవసరంగా భారత్తో పెట్టుకుంటుందని నెటిజన్లు అంటున్నారు. ఇజ్రాయెల్ లాగానే భారత్ స్పందించి.. హసమాస్ను మట్టుబెట్టినట్లు పాకిస్థాన్ను లేపేయాలని డిమాండ్ చేస్తున్నారు.
READ MORE: RSS General Secretary: టూరిస్టులపై ఉగ్రదాడి.. పొలిటికల్ పార్టీలు, ప్రజా సంఘాలు కలిసి రావాలి..!
Also Read
- Telangana : పోలీస్ శాఖలో భారీ పదోన్నతులు.. సజ్జనార్, మహేష్ భగవత్ లకు డీజీపీ హోదా..!
- KTR: కాళేశ్వరంపై కాంగ్రెస్ అబద్ధాల కోటలు బద్దలయ్యాయి.. హైకోర్టు తీర్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
- LSG vs RR: టాస్ గెలిచిన లక్నో.. బ్యాటింగ్ ఎవరిదంటే?
- CM Revanth Reddy : పెద్దల చదువుకు పెద్ద పీట.. వయోజనుల్లో అక్షరాస్యత పెంపుపై ప్రత్యేక శ్రద్ధ..
హమాస్- ఇజ్రాయెల్ మధ్యం ఏం జరిగింది?
అప్పట్లో హమాస్కి చెందిన సాయుధ విభాగం ఆకస్మిక దాడులు జరిపింది. ఏం జరుగుతుందో తెలియనంతగా అనూహ్య దాడి జరిగింది. గాజా, ఇజ్రాయెల్ను వేరు చేసే పటిష్టమైన కంచెను హమాస్ ధ్వంసం చేసి ఇజ్రాయెల్లోకి చొచ్చుకొచ్చి దాడి చేసింది. ఈ దాడుల్లో చనిపోయిన ఇజ్రాయెల్ పౌరులు, సైనికుల ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో విస్తృతంగా కనిపించాయి. ఆయుధాలు ధరించిన హమాస్కి చెందిన కొందరు వ్యక్తులు సైనికులను, పౌరులను బంధీలుగా తీసుకెళ్తున్న దృశ్యాలు ఇజ్రాయెలీలను ఆగ్రహానికి గురిచేశాయి. వెంటనే స్పందించిన ఇజ్రాయెల్ కొన్ని గంటల్లోనే హమాస్కు బుద్ధి చెప్పింది. ఎలాంటి హెచ్చరికలు జారీ చేయకుండానే తమపై దాడి చేయడంతో తీవ్రంగా మండిపడ్డ ఇజ్రాయెల్.. హమాస్ని పూర్తిగా తుడిచిపెట్టాలన్న దిశగా దూసుకుపోయింది. ఇజ్రాయెల్ వైమానిక దళాలు హమాస్ రహస్య స్థావరాలపై బాంబుల వర్షం కురిపించాయి. బిల్డింగులు, యూనివర్సిటీలు, మసీదులు.. ఇలా హమాస్ మిలిటెంట్లు ఎక్కడున్నా సరే, ఆ ప్రాంతాల్లో దాడులు చేశాయి. దీంతో.. గాజా మొత్తం చెత్త దిబ్బలాగా మారిపోయింది.
READ MORE: Pahalgam Terror Attack: కాశ్మీర్లో హై టెన్షన్ వాతావరణం.. ముష్కరుల కోసం వేట
ఇలా మెరుపు వేగంతో స్పందించిన ఇజ్రాయెల్ను ఆదర్శంగా తీసుకుని శత్రుదేశంలోని ఉగ్రస్థావరాలను లేకుండా చేయాలని, ఉగ్రవాదులను మట్టుబెట్టాలని నెటిజన్లు కోరుతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియా ప్లాట్ ఫాం ఎక్స్లో “#WeWantRevenge” అని ట్యాగ్ వైరల్ అవుతోంది. మరోవైపు ఈ ఘటనపై భారత ప్రభుత్వం ఇప్పటి వరకు స్పందించలేదు. కేబినెట్ మీటింగ్ అనంతరం ప్రధాని మోడీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఘటన వివరాలు, తదుపరి కార్యాచరణ వెల్లడించే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Jowar Cucumber Roti Recipe: వెయిట్ లాస్కు సూపర్ ఫుడ్.. ఈ రొట్టె తింటే బరువు ఈజీగా తగ్గుతుంది..!
-
Titanic Life Jacket: 114 ఏళ్ల కిందటి విషాదానికి సాక్ష్యం.. వేలంలో రూ.8 కోట్లు పలికిన టైటానిక్ లైఫ్ జాకెట్!
-
Telangana : పోలీస్ శాఖలో భారీ పదోన్నతులు.. సజ్జనార్, మహేష్ భగవత్ లకు డీజీపీ హోదా..!
-
Earthquake: గుజరాత్లో భూకంపం.. ఆందోళనలో ప్రజలు!
-
Donald Trump: గుడ్న్యూస్ చెప్పిన డొనాల్డ్ ట్రంప్.. ఈ శుక్రవారంతో అంతా ఫైనల్..
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?