Armed Vigilante Groups: కేంద్రం కీలక నిర్ణయం.. ఆ గ్రామస్థుల చేతికి ఆయుధాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Armed Vigilante Groups: జమ్మూలోని రౌజౌరీలో హిందువులే లక్ష్యంగా దాడులు పెరిగిపోతుండటం, ఇళ్లలోకి చొరబడి ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడడంతో ఇద్దరు చిన్నారులు సహా ఆరుగురు ప్రాణాలు కోల్పోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భద్రతాపరంగా ఉద్రిక్తతలు చెలరేగిన నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే భారీగా పారామిలిటరీ బలగాలను మోహరిస్తుండగా.. తాజాగా గ్రామ పరిరక్షణ బలగాలను పునరుద్ధరిస్తోంది. వారికి ప్రభుత్వమే ఆయుధాలు అందించి గ్రామాల్లో నిఘా వేసేందుకు ప్రోత్సహిస్తోంది. జమ్మూకశ్మీర్లోని రాజౌరీలో పూర్వపు గ్రామ రక్షణ కమిటీల పునరుద్ధరణ దూకుడుగా కొనసాగుతోంది. జిల్లాలో ఇప్పటికే 5,000 మంది సాయుధ సభ్యులు ఉండగా, మరింత మంది గ్రామస్తులు పోలీసుల నుంచి ఆయుధాలు పొందేందుకు నమోదు చేసుకుంటున్నారు.
గ్రామ రక్షణ కమిటీలు విలేజ్ ఢిఫెన్స్ గ్రూప్స్ లేదా వీడీజీలుగా పేరు మార్చబడ్డాయి. రెండు దశాబ్దాల తర్వాత మొదటిసారిగా ఇంత పెద్ద ఎత్తున పునరుద్ధరించబడుతున్నాయి. ప్రతి సభ్యుడు 303 రైఫిల్, 100 రౌండ్ల మందుగుండు సామగ్రిని కలిగి ఉంటారు. వీరికి ఎస్ఎల్ఆర్ రైఫిళ్లను కూడా సమకూర్చాలని ప్రభుత్వం యోచిస్తోంది. దాదాపు 30 ఏళ్ల క్రితం జమ్మూ కాశ్మీర్లో శాంతిభద్రతల యంత్రాంగం కుప్పకూలినప్పుడు కమిటీలు ఏర్పాటయ్యాయి. అయితే, సాధారణ ప్రజలను రక్షించే బాధ్యతను విస్మరించి, అటువంటి బృందాలకు ఆయుధాలు అందించిన ప్రభుత్వంపై విమర్శలు ఎదురయ్యాయి. చివరకు, భద్రతా దళాలు మైదానంలో తిరిగి నియంత్రణ సాధించడంతో ఈ కమిటీల పాత్ర తగ్గిపోయింది.
Also Read
- AP High Court: కోర్టు ఆదేశాలను తేలిగ్గా తీసుకోవద్దు.. అధికారులకు హైకోర్టు వార్నింగ్..
- AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు డెడ్లైన్.. హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం కీలక సమాచారం
- Kangana Ranaut-Baba Ramdev: నా యవ్వనం గురించి మీకెందుకు బెంగ.. బాబా రామ్దేవ్పై కంగనా ఫైర్
- School Holidays: కుక్కల బెడదతో స్కూళ్లకు సెలవులు.. 4 రోజులు ఆన్లైన్ క్లాసులే..
Woman Strangled Infant: తల్లి కాదు రాక్షసి.. 3 రోజుల పసికందును..
రాజౌరిలోని డాంగ్రీ గ్రామంలో ఇటీవల కొంతమంది హిందువులపై, మైనారిటీ కమ్యూనిటీపైరాజౌరిలోని డాంగ్రీ గ్రామంలో జరిగిన తీవ్రవాద దాడి తర్వాత వారు మళ్లీ పునరుద్ధరించబడ్డారు. రాజౌరిలోని పంచాయతీ కేంద్రాల వద్ద పోలీసులు ఆయుధాలను తనిఖీ చేయడంతోపాటు శిక్షణకు సంబంధించిన అవసరాలను గమనిస్తున్నారు. చాలా కాలం క్రితం వారి తల్లిదండ్రులకు, ఇతర బంధువులకు ఇచ్చిన ఆయుధాలను యువకులు స్వాధీనం చేసుకుంటున్నారు.
పూంచ్లోని నియంత్రణ రేఖకు సమీపంలోని మంగ్నార్ గ్రామం వద్ద పెట్రోలింగ్లో ఉన్న గ్రూప్ సభ్యుడు ఒకరు మీడియాతో మాట్లాడారు. “రైఫిల్ను శుభ్రం చేయడానికి నేను ఇక్కడకు వచ్చాను. అది సరిగ్గా ఉందో లేదో తనిఖీ చేయడానికి, మాపై దాడి జరిగితే ఉగ్రవాదులను ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను” అని యువకులలో ఒకరైన టింకూ రైనా అన్నారు. 20 ఏళ్ల అతను ఇంకా పోలీసు రికార్డులలో ఒక సమూహంలో నమోదు చేయలేదని చెప్పాడు, అయితే .303 రైఫిల్ తన మామకు కేటాయించబడింది.
తాజావార్తలు
-
Telangana Congress : కొండా సురేఖ, చిన్నారెడ్డికి షోకాజ్ నోటీసులు.!
-
AP High Court: కోర్టు ఆదేశాలను తేలిగ్గా తీసుకోవద్దు.. అధికారులకు హైకోర్టు వార్నింగ్..
-
OTR : అమరావతిలో MLA క్వార్టర్స్ రెడీ..వైసీపీ ఎమ్మెల్యేలు తీసుకుంటారా?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు డెడ్లైన్.. హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం కీలక సమాచారం
-
Star Couple: బిగ్ డెసిషన్ తీసుకున్న బాలీవుడ్ స్టార్ కపుల్.. నిర్మాతలుగా మారుతున్న సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా!
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!