Afghanistan Rejects Pakistan Delegation: పాక్ను ఛీకొట్టిన ఆఫ్ఘన్.. దాయాది రక్షణ మంత్రి కాబూల్ పర్యటనకు ‘ నో’ చెప్పిన తాలిబన్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Afghanistan Rejects Pakistan Delegation: పాకిస్థాన్-ఆఫ్ఘనిస్థాన్ దేశాల మధ్య చెలరేగిన ఘర్షణలు ఇప్పుడిప్పుడే కాస్త శాంతించాయి. తాజాగా పాక్ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం అధికారిక పర్యటన కోసం చేసిన అభ్యర్థనలను ఆఫ్ఘనిస్తాన్ పదే పదే తిరస్కరించింది. ఒకరకంగా చెప్పాలంటే ఛీకొట్టిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక్కడ విశేషం ఏమిటంటే గత మూడు రోజులుగా దాయాది రక్షణ మంత్రి ఖవాజా ముహమ్మద్ ఆసిఫ్, ఐఎస్ఐ చీఫ్ అసిమ్ మాలిక్, మరో ఇద్దరు పాక్ జనరల్స్ మూడు వేర్వేరు వీసా అభ్యర్థనలను ఆఫ్ఘనిస్థాన్కు సమర్పించారు. కానీ ఈ అభ్యర్థనలను కాబూల్ తిరస్కరించింది. ఎందుకో తెలుసా..
READ ALSO: AP Power Staff JAC: విద్యుత్ ఉద్యోగుల చర్చలు విఫలం.. ఎల్లుండి నుంచి సమ్మె..
Also Read
- Rishab Pant: అనుకున్నదే జరిగింది.. LSG కెప్టెన్సీ నుంచి రిషభ్ పంత్ ఔట్..
- Sergio Gor: భారత్ ప్రపంచంలో వేగంగా ఎదుగుతోంది.. పెట్టుబడులకు విశ్వసనీయ ప్రాంతమన్న సెర్గియా గోర్
- Trump-Pakistan: ట్రంప్తో పాకిస్థాన్కు కొత్త సంకటం.. సౌదీకి షరీఫ్, మునీర్!
- El Nino Effect On Stock Market: ఎల్నినో ప్రభావం స్టాక్ మార్కెట్పై పడనుందా.. భారీగా పతనమవ్వనున్న సూచీలు..?
వీసా అభ్యర్థనల తిరస్కరణలకు కారణాలు తెలుసా..
ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ ఆఫ్ఘనిస్థాన్ (IEA).. పాకిస్థాన్ ఇటీవల చేసిన గగనతల ఉల్లంఘనలను, పాక్టికా ప్రావిన్స్లోని పౌర ప్రాంతాలపై వైమానిక దాడుల కారణంగా వారి అధికారిక పర్యటనకు వీసా అభ్యర్థనలు తిరస్కరించినట్లు ఉదహరించింది. కాబుల్ పర్యటనకు రావడానికి ప్రయత్నిస్తున్న పాకిస్థాన్ ప్రతినిధి బృందంలో రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్, ఐఎస్ఐ డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ ముహమ్మద్ అసిమ్ మాలిక్, ఇద్దరు సీనియర్ పాక్ జనరల్స్ ఉన్నారు. ఈ నలుగురు సభ్యులు మాత్రమే వీసా అభ్యర్థనలు సమర్పించారని పలు నివేదికలు తెలిపాయి.
పాకిస్థాన్ ఇటీవల పౌర ప్రాంతాలపై వైమానిక దాడులు, పాక్టికా ప్రావిన్స్లో గగనతల ఉల్లంఘనలను ఉటంకిస్తూ ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ (IEA).. దాయాది ప్రతినిధుల బృందానికి దేశంలో పర్యటించడానికి వీసాను ఆమోదించడానికి నిరాకరించినట్లు పేర్కొంది. “మా పౌరులు దాడికి గురైనప్పుడు ఏ ప్రతినిధి బృందం కూడా కాబూల్కు వస్తుందని ఆశించలేము” అని కాబూల్ అధికారులు తెలిపారు. ఆఫ్ఘనిస్థాన్ నిర్ణయం కేవలం దౌత్యపరమైన అవమానం మాత్రమే కాదని, ఆఫ్ఘన్ తన నిబంధనలపై పాక్తో చర్చలు జరపదని ఇది స్పష్టమైన సందేశాన్ని పంపుతుందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆఫ్ఘన్ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించినందుకు ప్రతీకారం తీర్చుకోవాలనేది కాబూల్ ఉద్దేశం అని ఈ నిర్ణయం ప్రతిబింబిస్తుందని చెబుతున్నారు. పాక్ అభ్యర్థనను కాబూల్ తిరస్కరించడం ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలలో పెరుగుతున్న ఉద్రిక్తతలను సూచిస్తుందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Colonel Sanders: 60 ఏళ్ల వయసులో రూ. 9 వేల పెన్షన్తో మొదలైన బిలియన్ డాలర్ల సామ్రాజ్యం.. కేఎఫ్సీ పెద్దాయన కథ ఇదే!
-
Rishab Pant: అనుకున్నదే జరిగింది.. LSG కెప్టెన్సీ నుంచి రిషభ్ పంత్ ఔట్..
-
Sergio Gor: భారత్ ప్రపంచంలో వేగంగా ఎదుగుతోంది.. పెట్టుబడులకు విశ్వసనీయ ప్రాంతమన్న సెర్గియా గోర్
-
Vaibhav Suryavanshi: వైభవ్కు మా షాహీన్ అఫ్రిది, హారిస్ రౌఫ్ దొరికితే ఖతమే.. బుడ్డోడి ఆటకు పాక్ ఫిదా..
-
Vivo T5: వివో T5 మిడ్-రేంజ్ ఫోన్ విడుదల.. 7,200mAh భారీ బ్యాటరీ, స్నాప్డ్రాగన్ 6s Gen 2 చిప్
ట్రెండింగ్
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..
-
AC Tips : ఏసీని పదేపదే ఆన్ చేసి ఆఫ్ చేస్తే ఏమవుతుంది.?
-
భారత్లో Sony BRAVIA 7 II RGB Mini LED 4K టీవీల లాంచ్.. అద్భుత ఫీచర్లతో సరికొత్త సిరీస్.!