Afghanistan: భారత్ బాటలో ఆఫ్ఘన్.. తాలిబన్ల దెబ్బతో పాకిస్థాన్కు నీటి గండం ఖాయం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Afghanistan: భారతదేశం బాటలో ఆఫ్ఘనిస్థాన్ నడుస్తుంది. తాజాగా తాలిబన్ల దెబ్బతో పాకిస్థాన్లో నీటి కటకట ఏర్పడుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. అసలు ఇండియా అనుసరించింది ఏంటో తెలుసా.. భారత్లో పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత దాయాది దేశానికి నీటి సరఫరాను రద్దు చేసింది. ఇప్పుడు ఇదే బాటలో తాలిబన్ ప్రభుత్వం కూడా వేగంగా అడుగులు వేస్తుంది. తాలిబాన్ డిప్యూటీ సమాచార మంత్రి ముజాహిద్ ఫరాహి ఇటీవల మాట్లాడుతూ.. కునార్ నదిపై ఆనకట్టల నిర్మాణాన్ని ఆలస్యం చేయకుండా ప్రారంభించాలని తాలిబాన్ సుప్రీం నాయకుడు షేక్ హిబతుల్లా అఖుంద్జాదా నుంచి జల & ఇంధన మంత్రిత్వ శాఖకు సూచనలు అందాయని ప్రకటించారు. వాస్తవానికి ఈ నది పాకిస్తాన్కు ప్రధాన నీటి వనరు అని విశ్లేషకులు చెబుతున్నారు.
READ ALSO: TheRajaSaab : డార్లింగ్ ప్రభాస్ ‘రాజాసాబ్ పార్ట్ 2’ ఫిక్స్
Also Read
- MS Dhoni: “మిస్టర్ కూల్”కి అంత కోపం వచ్చిందా.. మ్యాచ్ ఓడిపోవడంతో టీవీ పగలగొట్టాడా.?
- Sunglasses Safety Tips: మీ సన్గ్లాసెస్ అసలైనవేనా? నకిలీదా..? కేవలం 2 సెకన్లలో చెక్ చేయండి.. లేదంటే కళ్లకు ప్రమాదమే!
- Jessica Head: అబ్బె.. ఏం చిల్లరగాళ్లు ఉన్నారా మీరు.! కోహ్లితో వాగ్వాదం.. ట్రావిస్ హెడ్ భార్యకు ఆన్లైన్ వేధింపుల సెగ..
- Kitchen Tips: దోసెలు పెనానికి అంటుకుపోతున్నాయా..? ఈ చిన్న చిట్కా చాలు..
ముజాహిద్ ఫరాహి మాట్లాడుతూ.. విదేశీ సంస్థల కోసం వేచి ఉండటానికి బదులుగా దేశీయ ఆఫ్ఘన్ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకోవాలని అమీర్ అల్-ముమినీన్ మంత్రిత్వ శాఖను ఆదేశించారు. అలాగే తాలిబన్ మంత్రి ముల్లా అబ్దుల్ లతీఫ్ మన్సూర్ మాట్లాడుతూ.. “ఆఫ్ఘన్లకు వారి నీటి వనరులను నిర్వహించుకునే హక్కు ఉంది” అని నొక్కి చెప్పారు. ప్రాజెక్టు అమలులో జాప్యాలను నివారించడానికి విదేశీ కంపెనీలకు బదులుగా దేశీయ ఆఫ్ఘన్ కంపెనీలకు ప్రాజెక్టు కాంట్రాక్టులు ఇవ్వడం కూడా ఈ సూచనలలో ఉందని చెప్పారు. వాస్తవానికి పాకిస్థాన్లో ప్రవహించే కాబూల్, కునార్ నదులు దాయాది దేశానికి ప్రధాన నీటి వనరుగా ఉన్నాయి.
ఇటీవలి ఇండియాలో జరిగిన పహల్గామ్ ఉగ్రవాద దాడి తరువాత భారతదేశం – పాకిస్థాన్తో జల ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. అలాగే నీటి సరఫరాపై ఆంక్షలు విధించే చర్చలు జరిగాయి. కాశ్మీర్లో 26 మంది పౌరుల హత్య జరిగిన వెంటనే, సింధు నది నీటి ఉపయోగించడాన్ని నియంత్రించే 1960 సింధు జల ఒప్పందంలో భారత ప్రభుత్వం తన భాగస్వామ్యాన్ని నిలిపివేసింది. అలాగే ఈ ఒప్పందాన్ని తిరిగి దాయాది దేశంతో చేసుకోలేదు. ఇదే సమయంలో చీనాబ్ నదిపై ఉన్న రణబీర్ కాలువ పొడవును 120 కి.మీ.కు రెట్టింపు చేయడం పాక్కు జల నియంత్రణలో కీలకమైన ప్రణాళికలలో ఒకటి. ఈ నది భారతదేశం గుండా పాకిస్థాన్లోని పంజాబ్ వ్యవసాయ ప్రాంతానికి వెళుతుంది.
READ ALSO: Jogi Ramesh: దమ్ముంటే.. నన్ను ఎదురుగా ధైర్యంగా ఎదుర్కొండి.. మాజీ మంత్రి హాట్ కామెంట్స్..!
తాజావార్తలు
-
Kollywood: నెక్స్ట్ సూపర్ స్టార్ ఎవరు?
-
MS Dhoni: “మిస్టర్ కూల్”కి అంత కోపం వచ్చిందా.. మ్యాచ్ ఓడిపోవడంతో టీవీ పగలగొట్టాడా.?
-
Jasprit Bumrah: డాన్ బ్రాడ్మన్కు రివర్స్.. బుమ్రా పేరిట అత్యంత చెత్త ప్రపంచ రికార్డు!
-
Peddi: రిలీజ్కు ముందే నార్త్ అమెరికాలో.. ‘పెద్ది’ రికార్డ్ హంగామా..
-
Sunglasses Safety Tips: మీ సన్గ్లాసెస్ అసలైనవేనా? నకిలీదా..? కేవలం 2 సెకన్లలో చెక్ చేయండి.. లేదంటే కళ్లకు ప్రమాదమే!
ట్రెండింగ్
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!