Gunfire : ఆఫ్ఘనిస్తాన్లో కాల్పులు కలకలం.. నలుగురి కాల్చివేత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gunfire : ఆఫ్ఘనిస్తాన్లోని బమియాన్ ప్రావిన్స్లో ముష్కరులు ముగ్గురు విదేశీయులతో సహా నలుగురిని కాల్చిచంపారు. విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితి విషమించడంతో స్థానిక ఆస్పత్రిలో చేర్పించారు. శుక్రవారం అర్థరాత్రి సెంట్రల్ ఆఫ్ఘనిస్తాన్లో పలువురు ముష్కరులు కాల్పులు జరిపారని, ముగ్గురు విదేశీ పౌరులతో సహా కనీసం నలుగురు వ్యక్తులు మరణించారని తాలిబాన్ ప్రతినిధి తెలిపారు. ప్రధాన పర్యాటక ప్రాంతమైన బమియాన్ ప్రావిన్స్లో ఘటనా స్థలంలో నలుగురు అనుమానితులను అరెస్టు చేశామని, విచారణ కొనసాగుతోందని అధికారి తెలిపారు. సాయంత్రం జరిగిన ఈ దాడికి ఎవరూ వెంటనే బాధ్యత వహించలేదు.
Read Also:What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
Also Read
- East Godavari Thief: తూర్పుగోదావరి జిల్లాలో ఘరానా దొంగ అరెస్ట్.. జూదం కోసం వరుస చోరీలు.. బెయిల్పై బయటకు వచ్చి!
- Praggnanandhaa: వరల్డ్ ఛాంపియన్కు చెక్ మెట్.. హ్యాట్రిక్ విజయంతో నార్వే చెస్ టైటిల్ రేసులో దూసుకపోతున్న ప్రజ్ఞానంద.!
- K Annamalai: "కొత్త రాజకీయ ఉద్యమం మొదలు పెడుతున్నా".. అన్నామలై సంచలన ప్రకటన..
- Green SM Limo: ఓలా-ఉబర్లకు పోటీగా కొత్త కంపెనీ.. బుకింగ్పై ఏకంగా 50% బంపర్ డిస్కౌంట్!!
తాలిబాన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి అబ్దుల్ మతీన్ కని ప్రకారం… దాడిలో నలుగురు విదేశీయులతో సహా మరో ఏడుగురు గాయపడ్డారని తెలిపారు. 20 సంవత్సరాల యుద్ధం తర్వాత అమెరికా, నాటో దళాలు దేశం నుంచి ఉపసంహరించుకునే చివరి వారాల్లో ఉన్నందున, ఆగష్టు 2021లో ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ అధికారాన్ని స్వాధీనం చేసుకుంది. నాలుగు, ఆరవ శతాబ్దాల మధ్య రాతిలో చెక్కబడిన, 2001 ప్రారంభంలో అల్-ఖైదా ఆదేశాల మేరకు తాలిబాన్లచే ధ్వంసం చేయబడిన రెండు పెద్ద బుద్ధ విగ్రహాల ప్రదేశంగా బమియాన్ బాగా ప్రసిద్ధి చెందింది.
Read Also:KCR : తెలంగాణలో మళ్లీ ఉద్యమించాలి
ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్కు ప్రధాన ప్రత్యర్థి మిత్రపక్షమైన ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) గ్రూపుపై దాడికి నిందలు మోపే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా పాఠశాలలు, ఆసుపత్రులు, మసీదులు, మైనారిటీ షియా ప్రాంతాలపై ఐఎస్ ఉగ్రవాదులు పలు దాడులు చేశారు. ఐఎస్ గ్రూపు ఉగ్రవాదుల దాడుల్లో ఇప్పటికే చాలా మంది ప్రాణాలు కోల్పోగా.. ఇప్పుడు ఐఎస్ గ్రూపు ఉగ్రవాదులే ఈ దాడికి పాల్పడ్డారనే అనుమానాలు మళ్లీ వ్యక్తమవుతున్నాయి. ఈ దాడిలో విదేశీయులను ప్రత్యేకంగా లక్ష్యంగా చేసుకున్నారు, అయితే మరణించిన వారు ఏ దేశానికి చెందినవారు అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు.
తాజావార్తలు
-
KL Rahul: కేఎల్ రాహుల్కు ఊహించని షాక్!
-
PEDDI : రాయలసీమలో దేవరను దాటలేకపోయిన ‘పెద్ది’
-
East Godavari Thief: తూర్పుగోదావరి జిల్లాలో ఘరానా దొంగ అరెస్ట్.. జూదం కోసం వరుస చోరీలు.. బెయిల్పై బయటకు వచ్చి!
-
Praggnanandhaa: వరల్డ్ ఛాంపియన్కు చెక్ మెట్.. హ్యాట్రిక్ విజయంతో నార్వే చెస్ టైటిల్ రేసులో దూసుకపోతున్న ప్రజ్ఞానంద.!
-
K Annamalai: “కొత్త రాజకీయ ఉద్యమం మొదలు పెడుతున్నా”.. అన్నామలై సంచలన ప్రకటన..
ట్రెండింగ్
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..