MP: ఏకంగా సీఎం కాన్వాయ్ వాహనాల్లో కల్తీ డీజిల్.. ఒక్కసారిగా ఆగిన 19 కార్లు..!
- ఆగిన మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ కాన్వాయ్
- శుక్రవారం రత్లాంకు వచ్చిన సీఎం మోహన్ యాదవ్
- గురువారం రాత్రి వాహనాలు సిద్ధం చేసిన అధికారులు
- వాహనాలలో కల్తీ డీజిల్ పోసిన బంక్ సిబ్బంది
- ఒక్కసారిగా ఆగిన సీఎం కాన్వాయ్లోని 19 కార్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మధ్యప్రదేశ్లోని రత్లాంలో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ కాన్వాయ్లోని 19 వాహనాలు మార్గమధ్యలో అకస్మాత్తుగా ఆగిపోయాయి. ప్రాథమిక దర్యాప్తులో సాంకేతిక లోపం ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేశారు. కానీ.. అనంతరం వాహనాలు ఆగిపోవడానికి కల్తీ డీజిల్ కారణమని తెలుసుకున్నారు. అధిక మొత్తంలో నీరు కలిగిన కల్తీ డీజిల్ని ట్యాంకుల్లో నింపినట్లు తెలిసింది. ఈ డీజిల్ను రత్లాంలోని దోసి గ్రామ సమీపంలోని భారత్ పెట్రోల్ పంపులో పోసుకున్నారు. ఈ సంఘటన తర్వాత.. స్థానిక పరిపాలనలో కలకలం చెలరేగింది. పెట్రోల్ పంపును వెంటనే సీజ్ చేశారు. దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేశారు. సంఘటన జరిగిన సమయంలో ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ తన కాన్వాయ్లో లేనప్పటికీ.. ఈ సంఘటన భద్రతా వ్యవస్థలో పెద్ద లోపాన్ని చూపిస్తుంది.
READ MORE: Gold Rates: గోల్డ్ ధరలు ఢమాల్.. ఒక్కరోజె రూ. 930 తగ్గిన తులం బంగారం ధర
Also Read
- Weather Alert: ఈ నెల తొలిసారి వాతావరణ శాఖ భారీ హెచ్చరిక.. ఈ జిల్లాల్లో దంచికొట్టనున్న వర్షాలు
- Student Success: జేబులో రూ.1,000.. చేతిలో పాత ల్యాప్టాప్.. ఇప్పుడు రూ.3.5 కోట్ల స్కాలర్షిప్..
- Rain Alert: వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఇవాళ, రేపు పలుచోట్ల మోస్తరు వర్షాలు!
- Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
వాస్తవానికి.. శుక్రవారం మధ్యాహ్నం జరిగే పరిశ్రమల సమావేశంలో పాల్గొనేందుకు రత్లాంకు సీఎం మోహన్ యాదవ్ విమానంలో చేరుకుంటారు. ఆయనను అక్కడి నుంచి తీసుకెళ్లేందు ఈ కాన్వాయ్ని ఏర్పాటు చేశారు. అయితే.. శుక్రవారం రాత్రి 19 వాహనాల్లో డీజిల్ నింపారు. వాహనాలన్నీ ఒక్కసారిగా ఆగిపోయాయి. దీంతో రాత్రి సయమంలో మెకానిక్లను బలవంతంగా రంగంలోకి దించారు. వాహనాల నుంచి ఇంధన ట్యాంకులను తీసివేసి ఖాళీ చేయించి మరమ్మత్తులు చేపట్టారు. ఎయిర్స్ట్రిప్ నుంచి ముఖ్యమంత్రి కాన్వాయ్ సజావుగా ప్రయాణించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు నయీబ్ తహసీల్దార్ ఆశిష్ ఉపాధ్యాయ తెలిపారు. పెట్రోల్ పంపును సీజ్ చేశారు. ఇంధన నమూనాలను సేకరించారు. పంపు యజమాని, ఉద్యోగుల స్టేట్మెంట్లను నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Weather Alert: ఈ నెల తొలిసారి వాతావరణ శాఖ భారీ హెచ్చరిక.. ఈ జిల్లాల్లో దంచికొట్టనున్న వర్షాలు
-
Toxic Advance Booking: రిలీజ్కు ముందే యష్ ‘టాక్సిక్’ రికార్డు.. ‘ధురందర్’ను దాటేసిన బుకింగ్స్!
-
Student Success: జేబులో రూ.1,000.. చేతిలో పాత ల్యాప్టాప్.. ఇప్పుడు రూ.3.5 కోట్ల స్కాలర్షిప్..
-
Rain Alert: వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఇవాళ, రేపు పలుచోట్ల మోస్తరు వర్షాలు!
-
Raaka: ‘బన్నీని ఇలా ఎప్పుడూ చూడలేదు’.. ‘రాకా’ సెట్ చూసి షాకైన మంచు లక్ష్మి
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!