MP: ఏకంగా సీఎం కాన్వాయ్ వాహనాల్లో కల్తీ డీజిల్.. ఒక్కసారిగా ఆగిన 19 కార్లు..!
- ఆగిన మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ కాన్వాయ్
- శుక్రవారం రత్లాంకు వచ్చిన సీఎం మోహన్ యాదవ్
- గురువారం రాత్రి వాహనాలు సిద్ధం చేసిన అధికారులు
- వాహనాలలో కల్తీ డీజిల్ పోసిన బంక్ సిబ్బంది
- ఒక్కసారిగా ఆగిన సీఎం కాన్వాయ్లోని 19 కార్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మధ్యప్రదేశ్లోని రత్లాంలో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ కాన్వాయ్లోని 19 వాహనాలు మార్గమధ్యలో అకస్మాత్తుగా ఆగిపోయాయి. ప్రాథమిక దర్యాప్తులో సాంకేతిక లోపం ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేశారు. కానీ.. అనంతరం వాహనాలు ఆగిపోవడానికి కల్తీ డీజిల్ కారణమని తెలుసుకున్నారు. అధిక మొత్తంలో నీరు కలిగిన కల్తీ డీజిల్ని ట్యాంకుల్లో నింపినట్లు తెలిసింది. ఈ డీజిల్ను రత్లాంలోని దోసి గ్రామ సమీపంలోని భారత్ పెట్రోల్ పంపులో పోసుకున్నారు. ఈ సంఘటన తర్వాత.. స్థానిక పరిపాలనలో కలకలం చెలరేగింది. పెట్రోల్ పంపును వెంటనే సీజ్ చేశారు. దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేశారు. సంఘటన జరిగిన సమయంలో ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ తన కాన్వాయ్లో లేనప్పటికీ.. ఈ సంఘటన భద్రతా వ్యవస్థలో పెద్ద లోపాన్ని చూపిస్తుంది.
READ MORE: Gold Rates: గోల్డ్ ధరలు ఢమాల్.. ఒక్కరోజె రూ. 930 తగ్గిన తులం బంగారం ధర
Also Read
- Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
- Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
- Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
- First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
వాస్తవానికి.. శుక్రవారం మధ్యాహ్నం జరిగే పరిశ్రమల సమావేశంలో పాల్గొనేందుకు రత్లాంకు సీఎం మోహన్ యాదవ్ విమానంలో చేరుకుంటారు. ఆయనను అక్కడి నుంచి తీసుకెళ్లేందు ఈ కాన్వాయ్ని ఏర్పాటు చేశారు. అయితే.. శుక్రవారం రాత్రి 19 వాహనాల్లో డీజిల్ నింపారు. వాహనాలన్నీ ఒక్కసారిగా ఆగిపోయాయి. దీంతో రాత్రి సయమంలో మెకానిక్లను బలవంతంగా రంగంలోకి దించారు. వాహనాల నుంచి ఇంధన ట్యాంకులను తీసివేసి ఖాళీ చేయించి మరమ్మత్తులు చేపట్టారు. ఎయిర్స్ట్రిప్ నుంచి ముఖ్యమంత్రి కాన్వాయ్ సజావుగా ప్రయాణించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు నయీబ్ తహసీల్దార్ ఆశిష్ ఉపాధ్యాయ తెలిపారు. పెట్రోల్ పంపును సీజ్ చేశారు. ఇంధన నమూనాలను సేకరించారు. పంపు యజమాని, ఉద్యోగుల స్టేట్మెంట్లను నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
-
Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
-
Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
-
First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!