Dhurandhar 2: బాలీవుడ్ బాక్సాఫీస్ను షేక్ చేసిన చిత్రం ‘ధురంధర్’. ఆదిత్య ధర్ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ నటించిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్ల సునామీని సృష్టించింది. ఇక ఇప్పుడు ‘ధురంధర్ ది రివెంజ్’ అంటూ సీక్వెల్ చిత్రాన్ని థియేటర్స్లోకి తీసుకురావడానికి రడీ అవుతున్నారు మేకర్స్. నేడే ఈ చిత్ర టీజర్ను కూడా రిలీజ్ చేశారు. ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ‘ధురంధర్ 2’ 2026 మార్చి 19న పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్ రిలీజ్కు రడీ అవుతుంది.
మరోసారి థియేటర్స్లో దుమ్ములేపడానికి రడీ అవుతున్న ‘ధురంధర్ 2’ సినిమా కారణంగా మార్చిలో రిలీజ్ కావాల్సిన కొన్ని చిత్రాలకు ఇబ్బందులు తప్పడం లేదంటూ సినీ సర్కిల్లో జోరుగా ప్రచారం జరుగుతుంది. ధురంధర్ దెబ్బకు అవి రిలీజ్ డేట్లను సర్దుబాటు చేసుకోడానికి రడీ అవుతున్నట్లు సమాచారం. ఈ వరుసలో యంగ్ హీరో అడివి శేష్ నటిస్తున్న తాజా చిత్రం ‘డెకాయిట్’ కూడా ఉన్నట్లు టాక్ నడుస్తుంది. ఈ సినిమాను మార్చి 19న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కానీ అదే రోజున ధురంధర్ 2 థియేటర్స్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వడానికి రడీ అవుతుండటం, ఇప్పటికే రిలీజ్ అయిన ధురంధర్ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సృష్టించిన వసూళ్ల సునామీ కారణంగా ఆ టైంలో మరే ఇతర సినిమాలు రిలీజ్కు ప్లాన్ చేసుకోడానికి వెనకా ముందు ఆడుతున్నాయి. మరి బాక్సాఫీస్ వద్ద అడివి శేష్ వర్సెస్ రణ్వీర్ సింగ్ వార్ జరుగుతుందా, లేదంటే ‘ధురంధర్ ది రివెంజ్’ దెబ్బకు ‘డెకాయిట్’ వాయిదా వేస్తారా అనేది తెలియాల్సి ఉంది. ఇప్పటి వరకు ‘డెకాయిట్’ మేకర్స్ సినిమా పోస్ట్పోన్పై ఎలాంటి అఫీషియల్ అన్సౌన్స్మెంట్ చేయలేదు. డెకాయిట్ సినిమా విషయానికి వస్తే షేనియల్ డియో ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తుండగా, మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటిస్తున్నారు.
READ ALSO: Stock Market: గుడ్ న్యూస్ చెప్పిన ట్రంప్ .. అంబానీకి కలిసొచ్చిన వేల కోట్ల అదృష్టం!