Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Adilabad Set To Get Civil Aviation Services Soon Confirms Defence Minister Rajnath Singh

Adilabad Airport : ఆదిలాబాద్‌లో విమానాశ్రయం ఏర్పాటుకు మరో ముందడుగు

Published Date :April 5, 2025 , 1:56 pm
By RAMAKRISHNA KENCHE
  • కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చొరవకు సానుకూల ఫలితం
  • వాయుసేన, పౌర విమానయాన సేవలకు పచ్చజెండా
  • ప్రధాని, రక్షణమంత్రికి కిషన్‌రెడ్డి కృతజ్ఞతలు
Adilabad Airport : ఆదిలాబాద్‌లో విమానాశ్రయం ఏర్పాటుకు మరో ముందడుగు
  • Follow Us :
  • google news
  • dailyhunt

విమానాశ్రయం ఏర్పాటు కోసం దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న ఆదిలాబాద్ వాసుల కలలు త్వరలోనే ఫలించబోతున్నాయి. ఆదిలాబాద్‌‍లోని రక్షణశాఖకు సంబంధించిన వైమానిక విమానాశ్రయంలో పౌరవిమానయాన సేవలు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్లు రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. శుక్రవారం ఈ మేరకు రాజ్‌నాథ్‌ సింగ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి లేఖ రాశారు. కీలకమైన ఆదిలాబాద్ విమానాశ్రయంలో వాయుసేన శిక్షణ సంస్థను ఏర్పాటు చేయబోతున్నామని, దీంతోపాటు.. పౌర విమాన సేవల కోసం ఉమ్మడి కార్యాచరణ చేపట్టేందుకు సానుకూలంగా ఉన్నట్లు స్పష్టం లేఖలో చేశారు.

READ MORE: CM Chandrababu: రాష్ట్రాభివృద్ధి కోసం ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలు చేశాం..

Also Read

  • E85 Petrol: పెట్రోల్‌లో 85% ఇథనాల్.. ఇంధన పరివర్తన దిశగా భారత్..
  • Supplementary exams: పది ఫెయిల్ అయిన విద్యార్థులకు అలర్ట్.. జూన్ 5 నుంచి పరీక్షలు..
  • UAE OPEC Exit: యూఏఈ ఒపెక్ ఎగ్జిట్.. భారత్‌కు లాభం, పాకిస్తాన్‌కు నష్టం..
  • Bhatti Vikramarka: ప్రభుత్వ ఉద్యోగులకు మంత్రి 'భట్టి' భరోసా.. రూ.1000 కోట్ల బకాయిల విడుదల.!

స్థానిక ప్రజలు, నాయకుల నుంచి కొంతకాలంగా వస్తున్న విజ్ఞప్తుల నేపథ్యంలో రాజ్‌నాథ్ సింగ్ కి 29 జనవరి, 2025 నాడు కిషన్‌రెడ్డి లేఖ రాశారు. వ్యక్తిగతంగా కలిసి ఆదిలాబాద్ విమానాశ్రయానికి సంబంధించిన భూములను ప్రజావసరాలకు సద్వినియోగం చేసేలా చొరవ తీసుకోవాలని కోరారు. దీనిపై రక్షణ శాఖ అధికారులతో చర్చించిన తర్వాత సానుకూల నిర్ణయాన్ని తెలియజేస్తూ.. 4 ఏప్రిల్, 2025 (శుక్రవారం) కిషన్‌రెడ్డికి లేఖరాశారు. రాజ్‌నాథ్ సింగ్ సానుకూల స్పందనను కిషన్‌రెడ్డి హృదయపూర్వకంగా స్వాగతించారు. ఇందుకుగానూ ప్రధానమంత్రి నరేంద్రమోడీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుకి హృదయపూర్వక ధన్యవాదములు తెలిపారు.

READ MORE: MLC Nagababu: పిఠాపురంలో హై టెన్షన్.. నాగబాబు పర్యటనలో జై వర్మ నినాదాలు

ఈ నేపథ్యంలో కిషన్‌రెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు. పత్తి వ్యాపారానికి, ఇతర వ్యవసాయ ఉత్పత్తులకు ఆదిలాబాద్ ప్రధానమైన కేంద్రంగా ఉందన్నారు. దీంతో ఆదిలాబాద్‌తో పాటుగా చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలనుంచి.. విమానాశ్రయాన్ని తెరిపించే విషయంలో చొరవతీసుకోవాలని దశాబ్దాలుగా డిమాండ్ వినిపిస్తోందని స్పష్టం చేశారు. దీనిపై తాను 7 జూలై, 2022 నాడు, 15 ఫిబ్రవరి, 2023నాడు నాటి ముఖ్యమంత్రికి లేఖలు రాసిట్లు చెప్పారు. ఐదేళ్లుగా ఈ విషయంపై పదే పదే ప్రస్తావించినా.. రాష్ట్ర ప్రభుత్వం సహకరించలేదన్నారు. అటు, ప్రజల డిమాండ్‌కు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తే విమానయాన సేవలను ప్రారంభించేందుకు అవసరమైన ప్రక్రియను ప్రారంభిస్తామని 6 అక్టోబర్, 2021 నాడు నాటి పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ముఖ్యమంత్రికి లేఖ రాసినట్లు గుర్తు చేశారు. కానీ దీనికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పందన కరువైందని విమర్శించారు.

READ MORE: Bhadradri Kothagudem : పోలీసుల ఎదుట లొంగిపోయిన 86 మంది మావోయిస్టు దళ సభ్యులు..

ఇటీవలే వరంగల్ విమానాశ్రయానికి అనుమతులు లభించడంతో.. విమానాశ్రయం ఏర్పాటుకు అవసరమైన భూసేకరణను రాష్ట్ర ప్రభుత్వం త్వరగా పూర్తిచేసి ఇస్తే.. ఇతర మౌలికసదుపాయాల నిర్మాణ పనులు కూడా వేగవంతం చేసేందుకు వీలవుతుందని కిషన్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. తద్వారా వీలైనంత త్వరగానే.. వరంగల్ ప్రజల స్వప్నం సాకారం కానుందని సంతోషం వ్యక్తం చేశారు. గతనెలలో.. వరంగల్ విమానాశ్రయం ఏర్పాటు, ఇందుకు సంబంధించిన పురోగతి తదితర విషయాలను తాను, రామ్మోహన్ నాయుడు సంయుక్త మీడియా సమావేశంలో వెల్లడించిన సంగతి తెలిసిందే.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Adilabad Airport
  • Adilabad Development
  • Agriculture Transport
  • Air Force Training Base
  • Airport Infrastructure

తాజావార్తలు

  • Mukesh Ambani: స్టాక్ మార్కెట్‌లో రిలయన్స్ లాభాల జోరు.. 3 రోజుల్లోనే రూ.1.35 లక్షల కోట్ల ప్రాఫిట్! ఎలా వచ్చాయో తెలుసా?

  • E85 Petrol: పెట్రోల్‌లో 85% ఇథనాల్.. ఇంధన పరివర్తన దిశగా భారత్..

  • Supplementary exams: పది ఫెయిల్ అయిన విద్యార్థులకు అలర్ట్.. జూన్ 5 నుంచి పరీక్షలు..

  • Pan Masala: గుట్కా ప్రియులకు షాక్.. పాన్ మసాలా ప్యాకెట్లపై కేంద్రం సంచలన నిర్ణయం!

  • UAE OPEC Exit: యూఏఈ ఒపెక్ ఎగ్జిట్.. భారత్‌కు లాభం, పాకిస్తాన్‌కు నష్టం..

ట్రెండింగ్‌

  • 50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్‌తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!

  • 13 అంగుళాల 3.5K PureSight Pro డిస్‌ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?

  • 7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!

  • 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్‌, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions