Medico Student: పీజీ వైద్యవిద్యార్ధి ప్రాణాలు తీసిన సెల్ఫీ సరదా
రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ప్రవీణ్ రిమ్స్లో పీజీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. నిన్న (ఆదివారం) కావడంతో తొమ్మిది మంది స్నేహితులతో కలిసి ఆదిలాబాద్ వినాయక్ చౌక్ నుంచి ఆదిలాబాద్ రూరల్ మండలం మీదుగా శివ్ఘాట్ కు వెళ్లారు. పక్కనే ఉన్న సాత్నాల వాగు దగ్గర కోటి లింగాలను దర్శించుకున్నారు. అనంతరం వాగు అందాలను సెల్ఫీ తీసుకుంటుండగా.. ప్రవీణ్ ఫోన్ వాగులో పడిపోయింది. దాని కోసం అందులోకి ప్రవీణ్ దిగి.. నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాడు.
Read Also: Income Tax Return: 2019తో పోలిస్తే కోటీశ్వరులు 50శాతం పెరిగారు.. 4.65కోట్ల మంది కట్టిన పన్ను సున్నా
Also Read
- Nashik TCS Case: నిదా ఖాన్ బెయిల్ పిటిషన్పై కోర్టులో ముగిసిన కీలక వాదనలు.. ఆసక్తికరంగా మారిన తీర్పు..!
- Mahesh Babu: రాజమౌళి తర్వాత మహేష్ బాబు ప్లాన్ మామూలుగా లేదుగా!
- PM Modi: క్రీడాకారులతో కలిసి ఫుట్బాల్ ఆడిన మోడీ.. ఫొటోలు వైరల్
- CM Revanth Reddy: కాళేశ్వరం ప్రాజెక్ట్పై సీబీఐ విచారణకు ఒత్తిడి పెంచాలి.. మంత్రులకు సీఎం సూచన..
అయితే, అతడిని కాపాడేందుకు మరో ఇద్దరు స్నేహితులు వాగులోకి దిగగా ఉక్కిరిబిక్కిరి కావడంతో బయటకు వచ్చేశాడు. దీంతో స్థానికుల సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఇక గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. చీకటి పడటంతో గాలింపు చర్యలు కష్టంగా మారినట్లు పోలీసులు తెలిపారు. నేడు మళ్లీ ఐదుగురు గజ ఈతగాళ్ల సహాయంతో అన్వేషణ చేయగా.. ప్రవీణ్ మృతదేహం దొరికింది. వాగులో నుంచి బయటకు తీసి పోలీసులకు అప్పగించారు.
Read Also: Tomoto Van: బోల్తాపడ్డ టమాటా వ్యాన్.. దోపిడీకి దిగిన ప్రజలు
కాగా.. సిరిసిల్లా జిల్లాకు చెందిన తల్లిదండ్రులకు పోలీసులు ప్రవీణ్ గల్లంతు అయినట్లు సమాచారం తెలియజేశారు. ప్రవీణ్ కుటుంబసభ్యులు, బంధువులు వాగువద్దకు చేరుకొని కొడుకు మృతదేహం చూసి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఉన్నత చదువులు చదివి కుటుంబానికి భరోసానిస్తాడని అనుకున్నాం.. కానీ ఇలా ప్రాణాలు పోగొట్టుకుంటాడు అనుకోలేదని కుటుంబ సభ్యులు వాపోతున్నారు. ఇదిలా ఉండగా ప్రవీణును కాపాడేందుకు ప్రయత్నించిన స్నేహితుల్లో ఒకరైన కార్తీక్ అస్వస్థతకు గురికావడంతో రిమ్స్లో చికిత్స అందిస్తున్నారు. ప్రవీణ్ తప్ప మిగిలిన ఎనిమిది మంది సురక్షితంగా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఇక ప్రవీణ్ మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం రిమ్స్ ఆస్పత్రికి తరలించారు.
తాజావార్తలు
-
Nashik TCS Case: నిదా ఖాన్ బెయిల్ పిటిషన్పై కోర్టులో ముగిసిన కీలక వాదనలు.. ఆసక్తికరంగా మారిన తీర్పు..!
-
Mahesh Babu: రాజమౌళి తర్వాత మహేష్ బాబు ప్లాన్ మామూలుగా లేదుగా!
-
PM Modi: క్రీడాకారులతో కలిసి ఫుట్బాల్ ఆడిన మోడీ.. ఫొటోలు వైరల్
-
CM Revanth Reddy: కాళేశ్వరం ప్రాజెక్ట్పై సీబీఐ విచారణకు ఒత్తిడి పెంచాలి.. మంత్రులకు సీఎం సూచన..
-
Bhuvneshwar Kumar: విమర్శకులకు వికెట్లతో సమాధానం.. భువనేశ్వర్ గణాంకాలు చూస్తే దిమ్మతిరిగి పోవాల్సిందే..
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!