AAG Sudhakar Reddy: చంద్రబాబు పట్ల ప్రభుత్వం ఉదారంగా వ్యవహరించింది: అదనపు అడ్వొకేట్ జనరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AAG Sudhakar Reddy: చంద్రబాబు అరెస్ట్పై అదనపు అడ్వొకేట్ జనరల్ సుధాకర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో మొదటిసారిగా డీఐజీ స్థాయి అధికారిని అరెస్టు కోసం పంపించారని.. రహదారిపై ప్రయాణం ఇబ్బందికరంగా ఉంటుందని భావించిన ప్రభుత్వం హెలికాప్టర్లో తీసుకెళ్తామని చెప్పిందని.. జైలు మాన్యువల్ను కూడా కాదని కూడా చంద్రబాబుకి ఎన్నో సదుపాయాలను ప్రభుత్వం కల్పించిందని అదనపు అడ్వొకేట్ జనరల్ సుధాకర్ రెడ్డి వెల్లడించారు. చంద్రబాబును జైలుకు కూడా ఆయన కాన్వాయ్లోనే తీసుకెళ్లారన్నారు. చంద్రబాబు పట్ల ప్రభుత్వం ఎంతో ఉదారంగా వ్యవహరించిందని… ఎంతో గౌరవాన్ని ఇచ్చిందన్నారు. జైలులో చంద్రబాబుకు ఏసీ సదుపాయాన్ని కల్పించేందుకు కూడా మేము అభ్యంతరం చెప్పలేదన్నారు.
Read Also: Tirumala: శ్రీవారి భక్తులకు గుడ్న్యూస్.. టికెట్లకు సంబంధించి టీటీడీ కీలక ప్రకటన
Also Read
- ఏఐ, ఐటీ కోర్సులకు ఫుల్ డిమాండ్.. TG EAPCET 2026 ఫైనల్ ఫేజ్ సీట్ల కేటాయింపు పూర్తి..
- Terror Modules: జంతర్ మంతర్ నిరసనల్లో టెర్రరిస్ట్లు.. 9 మంది పాకిస్థాన్ ఐఎస్ఐ ఉగ్రవాదులు అరెస్ట్
- Himmat Singh: అరెరే.. ఇదేం రన్ అవుట్ భయ్యా.. ఇప్పటి వరకు చూడలే.! వీడియో వైరల్..
- Rahul Gandhi: ఢిల్లీలో గళం.. రాంచీలో మౌనం.. విద్యార్థులపై రాహుల్ గాంధీ కపట ప్రేమ?
రాజమండ్రి జైలులో ఒక బ్లాక్ను ఖాళీ చేయించి పూర్తిస్థాయిలో భద్రతను ప్రభుత్వం చంద్రబాబుకు కల్పించిందని ఆయన తెలిపారు. దీనిని కక్ష్య సాధింపు చర్య.. అని అంటారా అంటూ ప్రశ్నించారు. ఒక మహిళా న్యాయమూర్తి అని కూడా చూడకుండా ఆమె మీద వ్యాఖ్యలు చేశారని తీవ్రంగా మండిపడ్డారు. చంద్రబాబును రిమాండ్కు పంపితే వ్యవస్థలను మేనేజ్ చేశారని గగ్గోలు పెట్టారని ఆయన చెప్పుకొచ్చారు. అరెస్ట్, విచారణ రిమాండ్ సక్రమమైనవని సుప్రీంకోర్టు చెప్పడం ఈ నేతలకు చెంప పెట్టు లాంటిదన్నారు. వారికి అనుకూలంగా తీర్పు వస్తే న్యాయవ్యవస్థ పనిచేసినట్లుగా చెబుతారని.. వ్యతిరేకంగా వస్తే వ్యవస్థలను మేనేజ్ చేశారని అంటారని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. న్యాయమూర్తులపై డిబేట్లు పెట్టి మానసికంగా హింసించారన్నారు. జగన్ కక్ష్య సాధించారని ప్రచారం చేశారని.. చంద్రబాబు పట్ల ఎంతో ఉదారంగా ప్రభుత్వం వ్యవహరించిందన్నారు. దేశంలో ఎందరో ముఖ్యమంత్రులు, ప్రముఖ నాయకులు జైళ్లకు వెళ్లారని.. కానీ వారిలో ఎవరికీ చంద్రబాబు లాంటి సదుపాయాలు లభించలేదన్నారు. దీన్నిబట్టి చూస్తే చంద్రబాబు పట్ల ప్రభుత్వ సహృదయత అర్థం అవుతుందన్నారు. ఈ కేసులో సాక్ష్యాధారాలు అందించిన ఐఏఎస్ అధికారులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని అదనపు అడ్వొకేట్ జనరల్ సుధాకర్ రెడ్డి తెలిపారు. న్యాయమూర్తులను కూడా కించపరిచిన వీరు రూ.371 కోట్ల ను సక్రమంగా విడుదల చేశామని ఎక్కడైనా చెప్పారా అంటూ ప్రశ్నించారు. అరెస్ట్ సక్రమం కాదని అంటున్నారే తప్ప.. అవినీతి జరగలేదని చెప్పడం లేదన్నారు. ఇన్ని రోజులు ప్రభుత్వంపై చల్లిన బురద… సుప్రీంకోర్టు తీర్పుతో కొట్టుకుపోయిందన్నారు. వాదించిన కేసు గురించి మాట్లాడే హక్కు తనకుందని ఏఏజీ సుధాకర్ రెడ్డి తెలిపారు.
తాజావార్తలు
-
ఏఐ, ఐటీ కోర్సులకు ఫుల్ డిమాండ్.. TG EAPCET 2026 ఫైనల్ ఫేజ్ సీట్ల కేటాయింపు పూర్తి..
-
Dhsnudh-Sivakarthikeyan : ధనుష్, శివకార్తికేయన్ సీక్వెల్స్ సినిమాలపై కోలీవుడ్లో భారీ హైప్
-
Terror Modules: జంతర్ మంతర్ నిరసనల్లో టెర్రరిస్ట్లు.. 9 మంది పాకిస్థాన్ ఐఎస్ఐ ఉగ్రవాదులు అరెస్ట్
-
Donald Trump: ట్రంప్ గోల్ఫ్ కోర్స్ సమీపంలో లోడెడ్ గన్తో వ్యక్తి అరెస్ట్.. మరో హత్యాయత్నం కుట్రపై అనుమానాలు?
-
Udhayanidhi Stalin: తంబీ..ఇంతలా దిగజారాలా? ఉదయనిధి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేస్తాడా..?
ట్రెండింగ్
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్తో Lava Probuds Xplore 25° TWS ఇయర్బడ్స్ లాంచ్..!
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!