తెలుగు సినీ ఇండస్ట్రీలో ‘మిస్సమ్మ’, ‘స్వయంవరం’ వంటి చిత్రాలతో హోమ్లీ ఇమేజ్ తెచ్చుకున్న నటి లయ, దాదాపు 20 ఏళ్ల తర్వాత మళ్లీ శివాజీతో జతకట్టారు. వీరిద్దరి కాంబినేషన్లో సుధీర్ శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందిన డార్క్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’. ఈ నెల మార్చి 6న థియేటర్లలోకి రానున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా లయ హైదరాబాద్ లో విలేకర్లతో మాట్లాడారు. ఈ సందర్భంగా తన పాత్ర గురించి, కెరీర్ సెకండ్…