Central Roads and Transport Department: వామ్మో గంటకు 53 ప్రమాదాలు.. మరణాల సంఖ్య తెలిస్తే షాకవుతారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అజాగ్రత్త వల్లనో, అతివేగం వల్లనో నిత్యం ఏదో ఒక చోట ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. అని మనలో చాలామంది అనుకుంటారు. కానీ రోజుకు కాదు గంటకి పదుల సంఖ్యలో ప్రమాదాలు జరుగుతున్నాయి. అందులో గంటకి ఎంతమంది చని పోతున్నారో తెలిస్తే షాక్ అవుతారు. దేశంలో జరుగుతున్న ప్రమాదాలు, మరణాల గురించి కేంద్ర రహదారి, రవాణాశాఖ నివేదికను విడుదల చేసింది. ఆ నివేదికలో 2021 సంవత్సరం కంటే 2022 సంవత్సరంలో 11.9% ప్రమాదాలు, 9.4% మరణాలు, 15.3% క్షతగాత్రుల సంఖ్య పెరిగిందని పేర్కొంది. ఈ నివేదిక ప్రకారం గంటకు 53 ప్రమాదాలు జరుగగా.. 19 మంది మరణిస్తున్నారు. అలానే ప్రమాదాల పరంగా, మరణాల పరంగా ముందు వరసలో ఉన్న 10 రాష్ట్రాల పేర్లను నివేదికలో పేర్కొంది.
Read also:Indian Racing League: హైదరాబాద్లో ఇండియన్ రేసింగ్ లీగ్ రద్దు.. కారణం ఇదే..
Also Read
- Petrol-Diesel: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?.. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కీలక వ్యాఖ్యలు
- Retirement Age Increase: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారందరికీ పదవీ విరమణ వయస్సు పెంపు.!
- US: అమెరికాలో ఘోరం.. అగ్నిప్రమాదంలో గుజరాత్కు చెందిన కుటుంబం మృతి
- IND vs SL Test Series: ఆగస్టు 15 నుంచి భారత్-శ్రీలంక టెస్ట్ సమరం.. షెడ్యూల్ విడుదల.!
ఇందులో ప్రమాదాల పరంగా తమిళనాడు, మధ్యప్రదేశ్, కేరళ, ఉత్తర్ప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలు తొలి పది స్థానాలను కైవసం చేసుకున్నాయి. కాగా మరణాల పరంగా చూస్తే ఉత్తర్ప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక, బిహార్, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, తెలంగాణ రాష్ట్రాలు మొదటి పదిస్థానాల్లో నిలిచాయి. అయితే గతంలో ప్రమాదాలు ఎక్కువగా జరిగే రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ 7 వ స్థానంలోను తెలంగాణా 9 వ స్థానంలో ఉండేది. కానీ తాజాగా విడుదలైన ప్రమాదాల జాబితాల నివేదికలో ఆంధ్రప్రదేశ్ స్థానం 7 నుండి 8కి చేరింది. కాగా తెలంగాణా స్థానం 9 నుండి 10కి చేరింది. కాగా ఎక్కువగా ప్రమాదాలు గ్రామాలల్లో జరుగుతున్నట్లు నివేదిక వెల్లడించింది. అలానే గుంతలు మిట్టలు ఉన్న రోడ్లకన్న బాగున్న రోడ్ల పైనే ఎక్కువ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నట్లు నివేదిక పేర్కొంది.
తాజావార్తలు
-
Harish Rao : జూపల్లి మాట మార్చారు.. చర్చకు రాకుండా తప్పించుకున్నారు
-
Petrol-Diesel: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?.. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కీలక వ్యాఖ్యలు
-
Retirement Age Increase: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారందరికీ పదవీ విరమణ వయస్సు పెంపు.!
-
US: అమెరికాలో ఘోరం.. అగ్నిప్రమాదంలో గుజరాత్కు చెందిన కుటుంబం మృతి
-
KTR : రాహుల్, రేవంత్లతో చర్చకు సిద్ధం.. జూపల్లి ఎందుకు దూరాడో తెలీదు
ట్రెండింగ్
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!