Acid Attack: గణపతి శోభా యాత్రలో యాసిడ్ దాడి… పలువురికి తీవ్రగాయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Acid Attack: బీహార్ రాష్ట్రంలోని మోతిహారి జిల్లాకు చెందిన మధుబన్ కంటోన్మెంట్ చౌక్ సమీపంలో శుక్రవారం సాయంత్రం గణపతి శోభ యాత్ర సందర్భంగా దుండగులు యాసిడ్ విసిరారు. ఈ దాడిలో ముగ్గురు గాయపడినట్లు వెలుగులోకి వచ్చింది. ఎవరికీ గాయాలు కాలేదని పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో ఆగ్రహం చెందిన ప్రజలు మధుబన్ కంటోన్మెంట్ చౌక్ సమీపంలోని ప్రధాన రహదారిపై ఊరేగింపును నిలిపివేసి, దాడి చేసిన వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ సంఘటన గురించి సమాచారం అందుకున్న మోతిహారి సదర్ అసిస్టెంట్ పోలీస్ సూపరింటెండెంట్ రాజ్, సిటీ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ విశ్వమోహన్ చౌదరి, ఛటౌని పోలీస్ స్టేషన్ హెడ్ కంచన్ భాస్కర్, ముఫాసిల్ పోలీస్ స్టేషన్ హెడ్ అవ్నీష్ కుమార్ సహా పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. పోలీసు రక్షణలో గణపతి విగ్రహాన్ని నిమజ్జనం చేశారు. దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేస్తామని పోలీసు అధికారులు హామీ ఇచ్చారు. దీంతో ఆగ్రహించిన ప్రజలు శాంతించారు.
Also Read
- Vizag Steel Plant Accident: విశాఖ స్టీల్ప్లాంట్లో భారీ అగ్ని ప్రమాదం.. పలువురు కార్మికుల సజీవ దహనం
- Tejashwi Yadav: బ్యాలెట్తో ఎన్నికలు జరిపితే బీజేపీ గెలవదు.. తేజస్వి యాదవ్ కీలక వ్యాఖ్యలు
- Kitchen Cleaning Tips: కొత్త పాత్రలపై ఉన్న మొండి స్టిక్కర్స్ పోవడం లేదా? ఈ ట్రిక్స్తో నిమిషాల్లో క్లీన్!
- Gas Cylinder Subsidy: గ్యాస్ వినియోగదారులకు బిగ్ షాక్.. ‘రాయితీ’కి కత్తెర.. వంటగదిలో ఇక కట్టెల పొయ్యే...
Read Also:Beauty tips: అందంగా ఉండాలి అనుకుంటున్నారా ఈ జ్యూస్ తాగండి..
దాడిలో గాయపడిన వ్యక్తుల గురించి సమాచారం అందలేదని పోలీసు సూపరింటెండెంట్ కంతేష్ కుమార్ మిశ్రా తెలిపారు. దాడి చేసిన వారి కోసం పోలీసులు వెతుకుతున్నారు. గణేష్ చతుర్థి పూజల అనంతరం గణేష్ విగ్రహ నిమజ్జనం జరుగుతోంది. దేవీచౌక్లో బయలుదేరిన విగ్రహ నిమజ్జన ఊరేగింపు మీనాబజార్ ప్రధాన రహదారిలోని మధుబన్ కంటోన్మెంట్ చౌక్కు చేరుకుంది. కొందరు దుండగులు యాసిడ్ విసిరినట్లు పుకారు పుట్టించారు. అయితే సాయంత్రం వరకు యాసిడ్ కారణంగా ఎవరూ గాయపడలేదు.
యాసిడ్ లాంటి ద్రవం రోడ్డుపై చిందినట్లు గుర్తించామని మోతీహరి ఎస్పీ తెలిపారు. క్షతగాత్రులకు చికిత్స అందించేందుకు వెతుకుతున్నారు. విషయం సద్దుమణిగింది. సమీపంలో అమర్చిన సీసీటీవీ వీడియో ఫుటేజీల ఆధారంగా పుకారు పుట్టించిన వారికోసం వెతుకుతున్నారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదని మోతీహరి సదర్ ఎస్డిపిఓ రాజ్ తెలిపారు.
Read Also: Ustaad Bhagat Singh: హరీషన్న మాంచి స్పీడు మీదున్నాడే!
తాజావార్తలు
-
Vizag Steel Plant Accident: విశాఖ స్టీల్ప్లాంట్లో భారీ అగ్ని ప్రమాదం.. పలువురు కార్మికుల సజీవ దహనం
-
Tejashwi Yadav: బ్యాలెట్తో ఎన్నికలు జరిపితే బీజేపీ గెలవదు.. తేజస్వి యాదవ్ కీలక వ్యాఖ్యలు
-
Kitchen Cleaning Tips: కొత్త పాత్రలపై ఉన్న మొండి స్టిక్కర్స్ పోవడం లేదా? ఈ ట్రిక్స్తో నిమిషాల్లో క్లీన్!
-
Health Benefits of Silver : వెండి పాత్రలో నీరు తాగితే ఏమవుతుంది? కంగనా అలవాటు వైరల్.!
-
Gas Cylinder Subsidy: గ్యాస్ వినియోగదారులకు బిగ్ షాక్.. ‘రాయితీ’కి కత్తెర.. వంటగదిలో ఇక కట్టెల పొయ్యే…
ట్రెండింగ్
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!