Accident or Conspiracy: Godhra : గుజరాత్ అల్లర్ల నేపథ్యంతో తెరకెక్కిన ‘గోద్రా’..ఆసక్తిగా సాగిన టీజర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ మరో కాంట్రవర్సీయల్ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతోంది. ఇప్పటికే 1990లలో కశ్మీరీ పండితుల ఊచకోతపై గత ఏడాది ‘ది కశ్మీరీ ఫైల్స్’,అలాగే కేరళలో లవ్ జిహాద్ పై ‘ది కేరళ స్టోరీ’ వంటి సినిమాలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి.ఇప్పుడు 2002లో జరిగిన గోద్రా రైలు దగ్ధం, అల్లర్లకు సంబంధించిన కథతో “యాక్సిడెంట్ ఆర్ కాన్స్పిరసీ: గోద్రా”అనే సినిమా వస్తోంది. గోద్రా ఈ పేరు వినగానే మనకు గుర్తోచ్చేది గుజరాత్ రైలు యాక్సిడెంట్. దాదాపు 21 ఏళ్ల క్రితం జరిగిన సబర్మతి ఎక్స్ప్రెస్ రైలు దహనం, ఆ తర్వాత గుజరాత్ లో జరిగిన అల్లర్ల నేపథ్యంలో మూవీని తెరక్కిస్తున్నారు.తాజాగా ఈ మూవీ టీజర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. నిజ జీవిత సంఘటన ఆధారం వస్తోన్న ఈ మూవీ టీజర్ ఎంతో ఆసక్తిగా సాగింది.
2002లో జరిగిన గోద్రా రైలు దహనం గురించి ముఖ్యమైన వివరాలను మాత్రం సబ్ టైటిల్స్ రూపంలో చూపించారు. చివరికి అసలు గోద్రా ఘటన ప్రమాదమా లేక కుట్ర అంటూ టీజర్ ను ముగించారు.. బీజే పురోహిత్ మరియు రామ్ కుమార్ పాల్ నిర్మిస్తున్న ఈ సినిమాను ఎంకే శివాక్ష్ దర్శకత్వం వహిస్తున్నారు. రణవీర్ షోరే మరియు మనోజ్ జోషి ఈ సినిమాలో ప్రధాన పాత్రలలో నటించారు.ఈ మూవీ టీజర్ తో పాటు మూవీ రిలీజ్ డేట్ పై కూడా మేకర్స్ హింట్ ఇచ్చారు. మార్చి 1న ఈ మూవీని వరల్డ్ వైడ్ గా థియేటర్లో రిలీజ్ చేసేందుకు మూవీ టీం ప్లాన్ చేస్తుంది.కాగా 2002లో జరిగిన ఈ రైలు ప్రమాదంలో అయోధ్య నుంచి తిరిగి వస్తున్న 59 మంది మరణించారు. ఆ తర్వాత గుజరాత్ లో మత కల్లోలాలు జరిగాయి. గోద్రా రైలు దగ్ధం వెనుక అసలు సూత్రధారి ఎవరు, ఆ రోజు ఏం జరిగింది, గోద్రా రైలు దగ్ధం అనంతరం జరిగిన అల్లర్లకు కారణాలు ఏమిటి.. అనే కోణంలో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు సమాచారం.
Also Read
- Dwcra Group: డ్వాక్రా మహిళల ఖాతాల్లోకి డబ్బులు.. బ్యాంకర్లకు మంత్రి కీలక ఆదేశాలు..
- Disha Salian Case: ‘మోదీ, ట్రంప్ పేర్లు కూడా చేర్చండి’.. ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు
- Tata Sons: టాటా గ్రూప్లో కీలక పరిణామం.. పగ్గాలు మళ్లీ చంద్రశేఖరన్కే.. లొల్లి తప్పదా?
- CM Chandrababu: శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. సెప్టెంబర్ 19న ఇళ్ల పట్టాలు పంపిణీ..
తాజావార్తలు
-
Dwcra Group: డ్వాక్రా మహిళల ఖాతాల్లోకి డబ్బులు.. బ్యాంకర్లకు మంత్రి కీలక ఆదేశాలు..
-
Disha Salian Case: ‘మోదీ, ట్రంప్ పేర్లు కూడా చేర్చండి’.. ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు
-
Peddapur School Food Poisoning: స్కూల్లో ఫుడ్ పాయిజనింగ్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత
-
Tata Sons: టాటా గ్రూప్లో కీలక పరిణామం.. పగ్గాలు మళ్లీ చంద్రశేఖరన్కే.. లొల్లి తప్పదా?
-
CM Chandrababu: శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. సెప్టెంబర్ 19న ఇళ్ల పట్టాలు పంపిణీ..
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!