Abortions: అత్యంత విద్యావంతులు ఉన్న రాష్ట్రంలో పెరిగిన గర్భస్రావం కేసులు.. కారణాలు..?
- కేరళలో పెరుగుతున్న గర్భస్రావం కేసులు
- 9 ఏళ్లలో 76% పెరిగిన గర్భస్రావాలు
- ఆందోళన కరమంటున్న నిపుణులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గర్భస్రావం చేయించుకోవడంలో మహిళలు అనేక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఉదాహరణకు, ఒక మహిళ గర్భస్రావం చేయించుకోవడానికి ఆసుపత్రికి వెళితే, ఆమెను చాలా ప్రశ్నలు అడుగుతారు. కారణం తెలియకుండా చేయడానికి చాలా ఆసుపత్రులు నిరాకరిస్తాయి. ఇదిలా ఉండగా.. అత్యధిక విద్యావంతులు ఉన్న రాష్ట్రంలో మాత్రం గర్భస్రావం కేసులు క్రమంగా పెరుగుతున్నాయి.
READ MORE: Kartik Maharaj: 6 నెలల్లో 12 సార్లు అత్యాచారం.. పద్మశ్రీ అవార్డు గ్రహీతపై ఆరోపణలు..
Also Read
- Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
- Third Front: దేశంలో ‘‘థర్డ్ ఫ్రంట్’’.. కనిమొళి వరస భేటీలతో కొత్త చర్చ..
- Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
- Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
హెల్త్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (HMIS) ప్రకారం.. కేరళలో గత 9 సంవత్సరాలలో గర్భస్రావ కేసులు 76% కంటే ఎక్కువగా పెరిగాయి. ఈ నివేదిక ప్రకారం.. 2014-15లో మొత్తం 17,025 గర్భస్రావాలు జరిగాయి. 2023-24లో దాదాపు 30,000 గర్భస్రావ కేసులు నమోదయ్యాయి. వీటిలో 21,282 కేసులు ప్రైవేట్ ఆసుపత్రులలో నమోదయ్యాయి. 8,755 కేసులు మాత్రమే ప్రభుత్వ ఆసుపత్రులలో నమోదయ్యాయి. 2015-16 నుంచి 2024-25 వరకు, కేరళలో మొత్తం 1,97,782 గర్భస్రావాలు నమోదయ్యాయి. వీటిలో 67,004 మాత్రమే ప్రభుత్వ ఆసుపత్రులలో నమోదయ్యాయి. మిగతా 1,30,778 మొత్తం గర్భస్రావాలు ప్రైవేట్ ఆసుపత్రులలో చేయించారు. ఇందులో మహిళల ఇష్టపూర్వకంగా, ఇష్టం లేకుండా చేసిన గర్భస్రావాలు రెండూ ఉన్నాయి.
చాలా మంది గర్భస్రావాలను తప్పుగా చూస్తారు. వాస్తవానికి, చాలా గర్భస్రావాలు మహిళల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని జరుగుతాయని వైద్యులు చెబుతున్నారు. కానీ కొన్ని గర్భస్రావాలు మాత్రం బలవంతంగా చేయిస్తారు. కొందరు పెళ్లికి ముందే తప్పటడుగు వేసి గర్భం దాల్చిన వాళ్లు కూడా ఉంటారు. గర్భస్రావం కోసం ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రులను ఎంచుకుంటున్నారని ఆరోగ్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రైవేట్ ఆసుపత్రులపై ఆధారపడటం పెరగడానికి ప్రధాన కారణం గోప్యత అని వెల్లడిస్తున్నారు. అంటే.. ప్రైవేట్లో చేయించుకుని ఎవ్వరికీ తెలియకుంగా జాగ్రత్తపడతారు. ఏదేమైనా అత్యధిక అక్షరాస్యత ఉన్న రాష్ట్రాల్లో ఒకటైన కేరళలో గర్భస్రావం కేసులు పెరగడం ఆందోళన కరమే అని నిపుణులు చెబుతున్నారు.
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!