Abhishek Sharma: దానికోసమే వెయిటింగ్.. అభిషేక్ సోదరి కీలక వ్యాఖ్యలు!
- పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో చెలరేగిన అభిషేక్ శర్మ
- 39 బంతుల్లోనే 74 పరుగులు
- అభిషేక్ ఇన్నింగ్స్పై సోదరి సంతోషం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆసియా కప్ 2025లో అభిషేక్ శర్మ సెంచరీ చేయాలని తాను కోరుకుంటున్నట్లు సోదరి కోమల్ శర్మ చెప్పారు. సెంచరీ కోసమే తాను వెయిటింగ్ చేస్తున్నానని వెల్లడించారు. అభిషేక్ అద్భుతమైన టాలెంట్ కలిగిన ప్లేయర్ అని, అతడికి ఆకాశమే హద్దు అని తెలిపారు. అభిషేక్ ఆట చూడటం బాగుందని, దాయాది పాకిస్థాన్పై ఇన్నింగ్స్ను ఆస్వాదించాం అని అభిషేక్ తల్లి మంజు శర్మ చెప్పుకొచ్చారు. 2025 ఆసియా కప్ సూపర్-4లో భాగంగా పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో అభిషేక్ చెలరేగాడు. 39 బంతుల్లోనే 74 పరుగులు చేసి.. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు.
భారత్, పాకిస్థాన్ మ్యాచ్ కోసం అభిషేక్ శర్మ తల్లి మంజు, సోదరి కోమల్ దుబాయ్కు వెళ్లారు. అభిషేక్ బంతిని బాదినప్పుడల్లా ఇద్దరు తెగ ఎంజాయ్ చేశారు. మ్యాచ్ అనంతరం ఇద్దరూ మాట్లాడుతూ తమ ఆనందం వ్యక్తం చేశారు. ‘భారత్, పాకిస్థాన్ మ్యాచ్ ప్రతిసారి నేను చూడాలనుకుంటా. ఇన్నాళ్లకు ప్రత్యక్షంగా చూశాం. అభిషేక్ బాగా ఆడాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ రావడం కంటే ఇంకే కావాలి?. సంతోషంలో ఏం మాట్లాడాలో తెలియడం లేదు. ఒక్కటి మాత్రం చెప్పగలను, మేం చాలా ఆనందంగా ఉన్నాము. అభిషేక్ అద్భుత టాలెంట్ ఉన్న ప్లేయర్. త్వరలోనే అభిషేక్ బ్యాట్ నుంచి సెంచరీ చూస్తానని అనుకుంటున్నా. సెంచరీ కోసమే నేను వెయిటింగ్’ అని కోమల్ శర్మ తెలిపారు.
Also Read
- Ayodhya: అయోధ్య రామాలయ విరాళాల కుంభకోణంలో కీలక పరిణామం.. ట్రస్ట్ కీలక సభ్యులు రాజీనామా..
- Women's World Cup 2026: రన్రేట్ ప్లస్.. కానీ ఆసీస్తో నెక్స్ట్ మ్యాచ్! సెమీఫైనల్ చేరాలంటే భారత్కు ఉన్న అవకాశాలివే..
- CM Yogi: "ఎవ్వరినీ వదిలి పెట్టను".. అయోధ్య విరాళాల దుర్వినియోగంపై సీఎం యోగి ఆగ్రహం..
- Ketan Murder Case: కేతన్ హత్య కేసులో కొత్త ట్విస్ట్.. ఇద్దరు తల్లుల మధ్య మాటల యుద్ధం!
Also Read: Jacqueline Fernandez: ఖరీదైన బహుమతులు, లగ్జరీ లైఫ్.. జాక్వెలిన్కు సుప్రీం షాక్
‘అభిషేక్ శర్మ ఆట చూడటం చాలా బాగుంది. పాకిస్థాన్పై ఇన్నింగ్స్ను నెను బాగా ఎంజాయ్ చేశా. తొలి బంతికే సిక్స్ కొట్టడం నేను మరిచిపోలేను. ప్రత్యర్థి బౌలర్ ఎవరనేది చూడకుండా.. అభిషేక్ ధైర్యంగా ఆడుతాడు. దానిని ఎప్పటినుంచో ఓ అలవాటుగా మార్చుకున్నాడు. మీ మద్దతు ఇలాగే ఉంటే.. భారతదేశం కోసం మరిన్ని అద్భుతమైన ఇన్నింగ్స్లు ఆడతాడు. ఆసియా కప్ 2025లో తప్పకుండా సెంచరీ చేస్తాడని నేను నమ్మకంగా ఉన్నా’ అని అభిషేక్ తల్లి మంజు తన ఆనందం వ్యక్తం చేశారు. అభిషేక్ ఇన్నింగ్స్తో పాకిస్థాన్పై భారత్ సునాయాస విజయం సాధించింది.
తాజావార్తలు
-
Ayodhya: అయోధ్య రామాలయ విరాళాల కుంభకోణంలో కీలక పరిణామం.. ట్రస్ట్ కీలక సభ్యులు రాజీనామా..
-
Women’s World Cup 2026: రన్రేట్ ప్లస్.. కానీ ఆసీస్తో నెక్స్ట్ మ్యాచ్! సెమీఫైనల్ చేరాలంటే భారత్కు ఉన్న అవకాశాలివే..
-
CM Yogi: “ఎవ్వరినీ వదిలి పెట్టను”.. అయోధ్య విరాళాల దుర్వినియోగంపై సీఎం యోగి ఆగ్రహం..
-
Online Shopping: ఒక్క పైసా ఖర్చు చేయకుండా ఆన్లైన్ షాపింగ్… కొరియాలో ఊపందుకుంటున్న కొత్త ట్రెండ్
-
RC17 Update: రామ్ చరణ్ కెరీర్లోనే తొలిసారి.. సుక్కు మాస్టర్ ప్లాన్ మాములుగా లేదుగా!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!