Delhi Mayor Polls: ఢిల్లీలో హైటెన్షన్.. వీధుల్లో ఆప్, బీజేపీ పోటాపోటీ నిరసనలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi Mayor Polls: మేయర్ ఎన్నికలపై ఢిల్లీ వీధుల్లో ఆప్, బీజేపీ నిరసనలు కొనసాగుతున్నాయి. ఇవాళ దేశ రాజధానిలోని వీధుల్లో రెండు పార్టీలు పరస్పరం ఆందోళనలు చేపట్టాయి. ఆప్ మద్దతుదారులు బీజేపీ ప్రధాన కార్యాలయం వెలుపల నిరసన తెలుపుతుండగా.. బీజేపీ కార్యకర్తలు ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ నివాసానికి కవాతు నిర్వహించారు. ముఖ్యమంత్రి నివాసం వద్ద నిరసన కోసం అక్కడ గుమిగూడిన 2,000 మంది బీజేపీ కార్యకర్తలపై ఢిల్లీ పోలీసులు వాటర్ ఫిరంగులను ప్రయోగించవలసి వచ్చింది.
ఢిల్లీ కొత్త మేయర్ను ఎన్నుకునే సమావేశంలో ఇటీవల భారీ ఘర్షణ చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఇవాళ మళ్లీ ఇరు పార్టీలకు చెందిన వర్గాలు నిరసన చేపట్టాయి. ఇటీవల ఢిల్లీ మేయర్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో బీజేపీ, ఆప్ కౌన్సిలర్లు వాగ్వాదానికి దిగడం, నినాదాలు చేశారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయమైన సివిక్ సెంటర్లో శుక్రవారం జరిగిన ఘర్షణలో తమ కౌన్సిలర్లు గాయపడ్డారని రెండు పార్టీలు పేర్కొన్నాయి.
Also Read
- Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
- CJI Surya Kant: "యువత మాట వినండి".. విద్యార్థుల నిరసనలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు..
- YS Jagan: చంద్రబాబు పాలనలో రైతులు రోడ్డున పడ్డారు.. ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారు!
- 144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
Asaduddin Owaisi: 2024లో నుపుర్ శర్మ ఢిల్లీ నుంచి పోటీ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు..
గత నెలలో జరిగిన పౌర ఎన్నికల్లో 250 స్థానాలకు గాను 134 స్థానాలను కైవసం చేసుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ, షెల్లీ ఒబెరాయ్, అషు ఠాకూర్లను ఉన్నత పదవికి అభ్యర్థులుగా పేర్కొంది. 104 వార్డులు గెలుచుకున్న బీజేపీ మేయర్ పదవికి రేఖా గుప్తాను నిలబెట్టింది. ఢిల్లీ నుంచి బీజేపీకి చెందిన ఏడుగురు లోక్సభ ఎంపీలు, ఆప్కు చెందిన ముగ్గురు రాజ్యసభ సభ్యులు, ఢిల్లీ స్పీకర్ నామినేట్ చేసిన 14 మంది ఎమ్మెల్యేలు కూడా మేయర్ ఎన్నికలో పాల్గొంటారు. 9 మంది కౌన్సిలర్లు ఉన్న కాంగ్రెస్ ఓటింగ్లో పాల్గొనకూడదని నిర్ణయించుకుంది.
ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా 10 మంది నామినేటెడ్ సభ్యులను నియమించడంతో ఆప్ అభ్యంతరం వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండానే అపాయింట్మెంట్లు చేసినందుకు సక్సేనాను ఆప్ లక్ష్యంగా పెట్టుకోగా, లెఫ్టినెంట్ గవర్నర్కు అలా చేయడానికి హక్కు ఉందని బీజేపీ పేర్కొంది. మేయర్ ఎన్నికలకు ముందు ఆల్డర్మెన్లను నామినేట్ చేయడం బీజేపీకి అనుకూలంగా ఓటు వేయడానికి కుట్ర పన్నుతుందని ఆప్ ఆరోపించింది. నిబంధనల ప్రకారం నామినేటెడ్ సభ్యులు ఎన్నికల్లో ఓటు వేయలేరు. మేయర్ ఎన్నికకు అధ్యక్షత వహించడానికి తాత్కాలిక స్పీకర్గా బీజేపీ కౌన్సిలర్ సత్య శర్మను నియమించినందుకు లెఫ్టినెంట్ గవర్నర్ను ఆప్ తప్పుపట్టింది. ఆ పదవికి హౌస్లో సీనియర్ కౌన్సిలర్ ముఖేష్ గోయల్ను ఆప్ సిఫార్సు చేసింది.
#Watch | Delhi police uses water cannon on BJP workers who were protesting outside Delhi Chief Minister Arvind Kejriwal's residence against violence in MCD House on 6 January. pic.twitter.com/yRvBtYTBpd
— ANI (@ANI) January 9, 2023
తాజావార్తలు
-
Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
-
CJI Surya Kant: “యువత మాట వినండి”.. విద్యార్థుల నిరసనలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు..
-
YS Jagan: చంద్రబాబు పాలనలో రైతులు రోడ్డున పడ్డారు.. ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారు!
-
SVC 63: టైటిల్ లేదు.. హైప్ మాత్రం పీక్స్లో.. మొదలైన సల్మాన్, నయనతారల హై వోల్టేజ్ యాక్షన్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
ట్రెండింగ్
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?