Aadi Srinivas : రేవంత్ రెడ్డి అమెరికాకు సరికొత్త తెలంగాణను పరిచయం చేసారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్రం కోసం చిత్తశుద్ధితో పని చేస్తున్న రేవంత్ పై సోషల్ మీడియాలో కారుకూతలు కూస్తున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి అమెరికాకు సరికొత్త తెలంగాణను పరిచయం చేసారని, పెట్టబడులకు తెలంగాణను స్వర్గంగా మార్చుతున్నారన్నారు. రేవంత్ అమెరికా పర్యటన విజయవంతం కావడం బీఆర్ఎస్ నేతలు తట్టుకోలేక పోతున్నారని, సూటు బూటు వేసుకొని దావొస్ వెళ్లిన కేటీఆర్ ఎన్ని కంపెనీలను తెలంగాణకి తెచ్చారన్నారు ఆది శ్రీనివాస్. కేటీఆర్ ఏంవోయూ కుదుర్చుకున్న కంపెనీలన్నీ ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోయాయని, ఒప్పందం చేసుకున్న కంపెనీలకు గత ప్రభుత్వం సరైన వసతులు కల్పించలేదన్నారు ఆది శ్రీనివాస్. రేవంత్ సక్సెస్ తక్కువ చేసి చూపించేందుకు బీఆర్ఎస్ సోషల్ మీడియా కష్టపడుతోందని, బుర్రలేని వాళ్ళు కేటీఆర్ రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నారన్నారు. అంగుళం భూమి కేటాయించకముందే మనీ లాండరింగ్ జరిగిందని ఆరోపించడం హాస్యాస్పదమని ఆయన వ్యాఖ్యానించారు.
Delhi: స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు 150 మంది మహిళా సర్పంచ్లు!..ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా?
Also Read
- UPI Charges: UPI ఛార్జీలపై కీలక అప్డేట్.. కిరాణా దుకాణాలు, చిన్న వ్యాపారులకు గుడ్న్యూస్
- Jharkhand: జార్ఖండ్లో పేపర్ లీక్ నిరసనలు.. ప్రభుత్వంతో చర్చలు విఫలం
- Rashid Khan Creates ODI History: వన్డేల్లో అరుదైన రికార్డు.. తొలి స్పిన్నర్గా చరిత్ర సృష్టించిన రషీద్ ఖాన్..
- Bengaluru: బాత్రూమ్లో మహిళ అస్థిపంజరం లభ్యం.. ట్విస్ట్ ఏంటంటే..!
తప్పులు చేసి తీహార్ జైల్లో ఎవరున్నారో ప్రజలకు తెలుసు అని ఆయన వ్యాఖ్యానించారు. కేటీఆర్ పదేండ్ల సూటు బూటు హడావిడికి రేవంత్ కేవలం 8 నెలల్లోనే సమాధానం చెప్పారని, ఒకవైపు ప్రభుత్వ ఉద్యోగాలు, మరోవైపు ప్రయివేట్ ఉద్యోగాల కల్పన చేస్తుంటే బీఆర్ఎస్ నేతలు తట్టుకోలేకపోతున్నారన్నారు ఆది శ్రీనివాస్. తెలంగాణ అభివృద్దే మా ప్రభుత్వ లక్ష్యమని, మూడు సార్లు దావోస్ పోయి కంపెనీలు తెచ్చానన్న కేటీఆర్ దానిలో ఎంత మందికి ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలన్నారు. విదేశీ పర్యటనల పేరుతో దుబాయి వెళ్లి సొంత బిల్డింగులు కొనుక్కున్న మీతో రేవంత్ కి పోలికా? అని ఆయన హెద్దేవ చేశారు. కేటీఆర్ ఇచ్చిన స్క్రిప్ట్ చదివి దిగజారవద్దని బీఆర్ఎస్ నేతలకు సూచిస్తున్నా అని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాగే పనిచేస్తే మా పని ఖతం అవుతుందని బీఆర్ఎస్ నేతలు భయపడుతున్నారన్నారు ఆది శ్రీనివాస్.
Stock market: హిండెన్బర్గ్ నివేదిక ఎఫెక్ట్.. ఫ్లాట్గా ముగిసిన సూచీలు
తాజావార్తలు
-
UPI Charges: UPI ఛార్జీలపై కీలక అప్డేట్.. కిరాణా దుకాణాలు, చిన్న వ్యాపారులకు గుడ్న్యూస్
-
Jharkhand: జార్ఖండ్లో పేపర్ లీక్ నిరసనలు.. ప్రభుత్వంతో చర్చలు విఫలం
-
Rashid Khan Creates ODI History: వన్డేల్లో అరుదైన రికార్డు.. తొలి స్పిన్నర్గా చరిత్ర సృష్టించిన రషీద్ ఖాన్..
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
Bengaluru: బాత్రూమ్లో మహిళ అస్థిపంజరం లభ్యం.. ట్విస్ట్ ఏంటంటే..!
ట్రెండింగ్
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!