Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Adilabad Aa Naluguru Repeat The Scene

Tragedy: ఆ నలుగురు సినిమా సీన్ రిపీట్.. మృతదేహం ముందే ఆస్తిపంపకాలు..

Published Date :September 14, 2023 , 11:55 am
By NTV WebDesk
Tragedy: ఆ నలుగురు సినిమా సీన్ రిపీట్.. మృతదేహం ముందే ఆస్తిపంపకాలు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Tragedy: డబ్బు.. డబ్బు డబ్బే ప్రపంచం.. అది లేకపోతే మానవ సంబంధాలకు విలువేలేదు. జానెడు పొట్ట నిండాలంటే చేతిలో పైసా ఉండాల్సిందే. హాలో అంటే.. బోలో అని పలకాలన్నా డబ్బే కావాలి. అలాంటి డబ్బు కుటుంబాలను నిలబెడుతుంది.. పడగొడుతుంది. సమాజంలో గౌరవంగా బతకాలంటే ప్రతి ఒక్కరికీ డబ్బే కావాలి. అలాంటి గౌరవాన్ని అందించేందుకు కుటుంబ పెద్ద నానాకష్టాలు పడతాడు. ఎవరికి ఏ ఆపద వచ్చినా ఎంత ఖర్చైనా ఆదుకుంటాడు. అలాంటి పెద్దాయన చనిపోతే ఓ కుటుంబం ఇన్నాళ్లు కంటి రెప్పలా చూసుకున్న పెద్దాయనను వదిలి… శవం అక్కడ ఉండగానే ఆస్తి పంపకాలకు సిద్ధం అయింది. అచ్చం ఆ నలుగురు మూవీ సీన్ రిపీట్ అయింది. సూర్యాపేట జిల్లా మోతె మండలంలోని సిరికొండ గ్రామంలో బుధవారం ఇది వెలుగుచూసింది. అనారోగ్యంతో మృతి చెందిన ఓ వ్యక్తి మృతదేహాన్ని రెండ్రోజులుగా ఇంటి ముందే ఉంచి దాయాదులు ఆస్తుల పంపకంపై దృష్టిపెట్టారు. ఆస్తుల పంపకాలు అయిపోయి రిజిస్ట్రేషన్‌ చేసిన తర్వాతే దహన సంస్కారాలు చేయాలంటూ భీష్మించుకున్నారు.

అసలేం జరిగింది.?

సిరికొండకు చెందిన వెంపటి సత్యనారాయణ(63) మంగళవారం అనారోగ్యంతో మృతిచెందారు. కొన్నేళ్లుగా భార్యాభర్తల మధ్య గొడవల కారణంగా ఈయన తన సోదరుల వద్ద ఉంటున్నారు. మృతుడి భార్య భాగ్యమ్మ తన సోదరుల వద్ద ఉంటుంది. వీరికి సంతానం లేదు. ఇటీవల సత్యనారాయణ క్యాన్సర్‌ బారినపడి ఆరోగ్యం క్షీణించడంతో వైద్య చికిత్స కోసం ఈయన సోదరులు రూ.లక్షల్లో అప్పులు చేసినట్లు చెబుతున్నారు. భాగ్యమ్మకు గ్రామంలో తల్లిగారిచ్చిన సుమారు నాలుగెకరాల వ్యవసాయ భూమి ఈమె పేరిటే ఉంది. భార్యభర్తల మధ్య గొడవల నేపథ్యంలో భాగ్యమ్మ పేరిట ఉన్న భూమిలో ఎకరం భూమిని సత్యనారాయణ పేర రిజిస్ట్రేషన్‌ చేసేందుకు ఇటీవల పెద్దలు నిర్ణయించి సోమవారం ధరణిలో స్లాట్‌ బుక్‌ చేశారు.

మరుసటి రోజు (మంగళవారం) ఉదయం రిజిస్ట్రేషన్‌కు సత్యనారాయణ రావలసి ఉంది. ఇంతలోనే… మంగళవారం ఉదయం అతడు అనారోగ్యంతో మృతిచెందాడు. ఈ నేపథ్యంలో రంగప్రవేశం చేసిన సత్యనారాయణ సోదరులు తాము అన్న వైద్య ఖర్చులకు సుమారు రూ.30 లక్షలదాకా ఖర్చు చేశామని, వదిన పేరు మీద ఉన్న భూమిలో ఎకరన్నర భూమి తమ పేరిట రిజిస్ట్రేషన్‌ చేయాలని పట్టుబట్టారు. ధరణిలో స్లాట్‌ బుక్‌ చేసి భూమి రిజిస్ట్రేషన్‌ చేసేదాకా దహన సంస్కారాలు చేసేది లేదంటూ కార్యక్రమాలు జరగకుండా అడ్డుకున్నారు. పనిలో పనిగా భాగ్యమ్మను తాము ఇన్నాళ్లు పోషించామని, మా పేర భూమి పట్టా చేయాలంటూ భాగ్యమ్మ వదిన, మరదళ్లు, వారి పిల్లలు పట్టుబట్టారు. ఈ నేపథ్యంలో తహసీల్‌ కార్యాలయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది.

పోలీస్టేషన్ లో ఫిర్యాదు..
దీంతో భాగ్యమ్మ తాను ఇన్నాళ్లుగా తలదాచుకున్న వారి బంధువుల పిల్లలపై పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అనంతరం స్లాట్‌ బుక్‌ చేసుకున్న ఆయన సోదరులు వారిలో ఒకరి పేరిట భాగ్యమ్మ పేర ఉన్న భూమిలో ఎకరన్నర పట్టా చేయించుకున్నారు. భాగ్యమ్మ వదిన, మరదలు చెరో అరెకరం భూమి పట్టా చేయించుకునేందుకు స్లాట్‌ బుక్‌ చేసుకున్నారు. బుధవారం సాయంత్రం గ్రామానికి వెళ్లి సత్యనారాయణ అంత్యక్రియలు నిర్వహించారు. ఆస్తుల రిజిస్ట్రేషన్‌ కోసం బంధువులంతా కలిసి మృతదేహాన్ని ఇంటి ముందు వదిలి వెళ్లడంతో కుమారుడి శవానికి వృద్ధురాలైన తల్లి ఒంటరిగా కాపలా కాయడం పలువురిని కలచివేసింది.
Chandrababu: అంగళ్లు కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Aa Naluguru
  • AA Naluguru scene
  • AA Naluguru scene repeat
  • Adilabad

తాజావార్తలు

  • Moinabad Drug Case : మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసులో కొనసాగుతున్న విచారణ..

  • Chiranjeevi : ఫ్యామిలీతో కలిసి ఉస్తాద్ భగత్ సింగ్ చూసిన మెగాస్టార్

  • Kolkata Knight Riders: ఐపీఎల్ ముందే కేకేఆర్‌కు వరుస దెబ్బలు.. మరో స్టార్ బౌలర్ దూరం..

  • Iran Nowruz: 1980ల ఇరాన్-ఇరాక్ వార్ తర్వాత మొదటిసారిగా.. యుద్ధం మధ్య నౌరూజ్ జరుపుకున్న ఇరాన్

  • Aditya Dhar: నెక్స్ట్ హీరో ఫిక్స్.. ‘ధురంధర్‌’కి మూడింతల బడ్జెట్‌తో కొత్త ప్రాజెక్ట్!

ట్రెండింగ్‌

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • Rice vs Chapati: డయాబెటిస్ ఉన్నవారు అన్నం తినాలా? లేక చపాతీ తినాలా? తింటే ఎంత తినాలి.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions