Khammam: యువకుడి అనుమానాస్పద మృతి.. చివరి వాయిస్ మెసేజ్ విని షాక్

  • అన్నను తీసుకురావడానికి వెళ్లి మృత్యువాత పడ్డ తమ్ముడు
  • మహిళలని ఎత్తుకొని వెళ్తున్నారు.. నన్ను చంపుతున్నారు అంటూ వాయిస్ మెసేజ్
  • మృతదేహం సాగర్ కాలువ లో లభ్యం
  • గంజాయ్ బ్యాచ్ పై అనుమానాలు
Murder

Murder

ఖమ్మంలో గత రెండు రోజుల క్రితం అదృశ్యం అయి కాలువ లో మృత దేహంగా లభ్యం అయిన సంజీవ్ కుమార్ అనే యువకుడి ఘటన విషాదాంతం అయ్యింది. పండుగ రోజున తన సోదరుని బైక్ పై తీసుకురావడానికి ఇంటి నుంచి వెళ్లి మృత్యు వాత పడ్డారు. తన సోదరుడికి వాయిస్ మెయిల్ పంపించాడు. ఒక మహిళను కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్తున్నారని నన్ను ఆటోతో కొట్టి చంపేస్తున్నారని వాయిస్ మెయిల్ లో సోదరుడికి పెట్టారు.

READ MORE: Dense Fog: ఢిల్లీని వదలని పొగమంచు.. ఆలస్యంగా నడుస్తున్న 184 విమానాలు..

తాను వుండే ప్రదేహశాన్ని లోకేషన కూడా పెట్టారు.. అప్పుడే అదే క్షణాల్లో కాలనీవాసులంతా సంజీవ్ కుమార్ కోసం వెతికినప్పటికీ కాల్వ మీద సంజీవ్ కుమార్ బండి కనిపించింది. రెండు రోజుల తర్వాత సాగర్ కాలంలో మృతదేహమై కనిపించాడు. అయితే ఈ వ్యవహారం ఏం జరిగింది సంజీవ్ కుమార్ ని కిడ్నాప్ చేసి హత్య చేశారా? అసలు ఏమి జరిగిందనేది అనుమానాస్పదంగా ఉంది .ఇది హత్య ఆని బంధువులు ఆరోపిస్తున్నారు. పోలీసుల విచారణ సరిగా లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

READ MORE: Alcohol: మద్యం మత్తులో శృంగారం చేస్తున్నారా?