Fatal Accident: బస్సు కిటికీ నుంచి తల బయటకు పెట్టిన మహిళ.. వెనుక నుంచి ట్రక్కు ఢీ
- బస్సు కిటికీ నుంచి తల బయటకు పెట్టిన మహిళ
- వెనుక నుంచి ట్రక్కు ఢీ
- తల.. మొండెం వేరు
- రాజస్థాన్ నుండి 40 మంది భక్తులతో ప్రయాగ్రాజ్ వెళ్తున్న వోల్వో బస్సు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రమాదాలు ఎప్పుడు ఎలా జరుగుతాయో ఎవరూ ఊహించలేరు. అజాగ్రత్త, నిర్లక్ష్యంతో రెప్పపాటులో ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు ఎన్నో చూశాం. అయితే ఇలాంటిదే ఒక ఘటన జరిగింది. సాధారణంగా మనం బస్సుల్లో ప్రయాణిస్తున్నప్పుడు కిటికీల్లో నుంచి చేతులు, తల బయటపెట్టకూడదు అని హెచ్చరిస్తూ బస్సులో రాసి ఉంటాయి. అయితే వీటిని చాలా మంది పట్టించుకోరు. కొందరు వాంతి వస్తుందని, మరికొందరు బయటి ప్రదేశాలను చూడాలనో, ఇంకొందరు అత్యుత్సాహంతో తల, చేతులు బయట పెడుతుంటారు. ఆ క్రమంలో అనుకోని ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోయిన ఘటనలు అనేకం చూశాం. ఇలాంటి ఘటనే యూపీ కౌశాంబిలోని భర్వారీలోని కోఖ్రాజ్ హైవేపై సోమవారం రాత్రి జరిగింది. ఈ ఘోర ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. ఆ మహిళ మెడ మొండెం నుంచి విడిపోయింది. బస్సులో ప్రయాణిస్తున్న మహిళ తలను వెనుక నుంచి వస్తున్న ఓ ట్రక్కు ఢీకొట్టింది. దీంతో.. తల శరీరం నుంచి విడిపోయింది.
Gold Rates Today: మగువలకు ‘గోల్డెన్’ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు!
Also Read
- Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
- US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
- I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. 'ఐబొమ్మ', 'బప్పం' వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
- CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
వోల్వో బస్సు భక్తులతో ప్రయాగ్రాజ్ నుంచి మధుర బృందావనం వెళుతోంది. అయితే.. ఈ ప్రమాదంతో మృతురాలి కుటుంబ సభ్యులు రోదనలు మిన్నంటాయి. సమాచారం ప్రకారం.. సోమవారం రాత్రి రాజస్థాన్ నుండి 40 మంది భక్తులతో వోల్వో బస్సు ప్రయాగ్రాజ్ నుండి మధుర బృందావనానికి వెళుతోంది. రాత్రి 2 గంటల సమయంలో కోఖ్రాజ్ సమీపంలో బస్సులో ప్రయాణిస్తున్న 40 ఏళ్ల మహిళ కిటికీలోంచి చూస్తోంది. ఇంతలో వెనుక నుంచి వేగంగా వస్తున్న ట్రక్కు ఓవర్టేక్ చేసిందుకు ప్రయత్నించి. మహిళ తలకు తగులుకుంటూ వెళ్లింది. దీంతో.. శరీరం నుంచి విడిపోయి రోడ్డుపై పడింది.
Pet Dog: పెంపుడు కుక్క కరవడంతో తండ్రి కొడుకు మృతి.. భీమిలిలో విషాదం
కాగా.. బస్సులో ఆమె పక్కనే కూర్చున్న ఇద్దరి కూతుళ్లు కూడా గాయపడ్డారు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే బస్సులో ఉన్న భక్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమీపంలోని హోటళ్లలో ఉన్న ప్రజలు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనానంతరం పారిపోతున్న ట్రక్కు డ్రైవర్ను పోలీసులు పట్టుకున్నారు. గాయపడిన బాలికలను సమీప ఆసుపత్రికి తరలించారు. అనంతరం మృతురాలి బంధువులకు ప్రమాదం గురించి సమాచారం అందించారు. అర్థరాత్రి పోలీసులు విచారణ జరిపి మహిళ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టంకు తరలించారు. ఈ కేసులో ఒకరిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
- Tags
- bus window
- fatal accident
- head
- HIT
- Truck
తాజావార్తలు
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!