NTV Telugu Site icon

Wolf Attack: ఆగని తోడేళ్ల బెడద.. తల్లి పక్కన పడుకున్న చిన్నారిపై దాడి

Wolf

Wolf

యూపీలోని బహ్రైజ్ జిల్లాలో తోడేళ్ల భీభత్సం కొనసాగుతోంది. హార్ది పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం రాత్రి తోడేలు మళ్లీ దాడి చేసింది. పూరి బస్తీ గడారియాకు చెందిన మజ్రా జంగిల్ పూర్వా నివాసి పరాస్ (07) ఇంట్లో తన తల్లితో కలిసి పడుకుని ఉండగా తనపై తోడేలు దాడి చేసింది. తోడేలు చిన్నారి మెడ పట్టుకుని పారిపోయేందుకు ప్రయత్నించింది. అయితే చిన్నారి కేకలు వేయడంతో కుటుంబ సభ్యులు లేచి దాన్ని తరిమికొట్టారు. దీంతో.. తోడేలు పొలాల్లోకి వెళ్లిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు, అటవీ సిబ్బంది అక్కడికి చేరుకుని చిన్నారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మళ్లీ తోడేలు హఠాత్తుగా దాడి చేయడంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు.

Rain Alert: సెప్టెంబర్లో ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు- వాతావరణ శాఖ..

ఇంతకుముందు.. రెండు తోడేళ్ల కోసం 57 బృందాలు గాలింపు చర్యలు చేపట్టారు. తోడేళ్లను పట్టుకునేందుకు పీఏసీకి చెందిన 200, రెవెన్యూ శాఖకు చెందిన 32, అటవీశాఖకు చెందిన 25 బృందాలు రంగంలోకి దిగాయి. మహసీ తహసీల్‌లోని హార్ది, ఖైరీఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దాదాపు 50 గ్రామాలు తోడేళ్ల బారిన పడ్డాయి. ఈ ప్రాంతాల్లో ప్రభుత్వం, యంత్రాంగం యుద్ధప్రాతిపదికన అవగాహన, నిర్బంధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. శనివారం కూడా తోడేళ్ల కోసం వెతికినా ఎలాంటి ఆచూకీ లభించలేదు. ఆ తోడేళ్లను పట్టుకునేందుకు మూడు థర్మల్ డ్రోన్లు, నాలుగు బోనులు, అరడజన్ వలలు, ఆరు ట్రాపింగ్ కెమెరాలు అమర్చడం గమనార్హం.

Vande Bharat Sleeper: అదిరిపోయే “వందే భారత్ స్లీపర్ ట్రైన్” ఫీచర్లు.. మీరు ఓ లుక్కేయండి..

మరోవైపు ఈ ప్రాంతంలో ఇద్దరు బాలికలు మిస్సింగ్ అయినట్లు గ్రామస్తులు తెలిపారు. వారి సమాచారం నేటికీ లభించలేదని కొందరు గ్రామస్థులు బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ దేవేష్‌ శర్మకు తెలిపారు. అంతేకాకుండా.. ఆ ఇద్దరు బాలికల అదృశ్యమైన వ్యక్తులు ఎక్కడా నమోదు కాలేదనే అంశం కూడా లేవనెత్తారు. దీనిపై డాక్టర్ దేవేష్ శర్మ అధికారులతో సమావేశం నిర్వహించి సమాచారం సేకరించి విచారణ జరిపిస్తానని హామీ ఇచ్చారు.