Gujarat: సూరత్లోని సామూహిక ఆత్మహత్య కేసులో ట్విస్ట్.. పోస్టుమార్టం రిపోర్ట్ లో ఏముందంటే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gujarat: శనివారం గుజరాత్ సూరత్ లోని శ్రీ సిద్ధేశ్వర్ కాంప్లెక్స్లో ఒకే కుటుంబానికి చెందిన 7 మంది మృతి చెందిన ఘటన వెలుగు చూసింది. కాగా ఘటన స్థలంలో విషం బాట్టిల్ తో పాటుగా సూసైడ్ లెటర్ దొరకడంతో అందరూ అది సామూహిక ఆత్మహత్యగా భావించారు. అయితే తాజాగా ఆ ఘటనకు సంబందించిన పోస్టుమార్టం రిపోర్ట్స్ వచ్చాయి. ఆ రిపోర్ట్స్ ఆధారంగా అసలు నిజాలు వెలుగు చూశాయి. అందరూ భావించినట్లు కుటుంభం సభ్యులు అందరూ కలిసి సామూహిక ఆత్మహత్యకు పాల్పడలేదు. మనీష్ సోలంకి తన కుటుంభ సభ్యులకు విషమిచ్చి చంపేశారు. అలానే అతని పెద్ద కుమార్తె మెడ పైన, అతని తల్లి మెడ పైన కూడా గొంతు నులిమి చంపిన గుర్తులు కనిపించాయి. పోస్టుమార్టం రిపోర్ట్ లో మనీష్ సోలంకితో పాటు అతని భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక పసికందు, అతని వృద్ధ తల్లి మృతదేహాలలో విషం కనిపించింది. అయితే అతని తల్లీ, కూతురు పోస్టుమార్టం నివేదికలో గొంతు నులిమి ఊపిరి ఆడకుండా చేయడం వల్లే ఇద్దరూ చనిపోయారని తేలింది.
Read also:Vizianagaram Train Accident: విజయనగరం రైలు ప్రమాదం.. విచారణ ప్రారంభం
Also Read
- Chennai: టెక్ మహీంద్రా కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం.. మంటల్లో ఆఫీస్ దగ్ధం
- Pawan Kalyan : ఒక్కడిగా మొదలై.. లక్షలాది మంది సైన్యంగా.. జనసేన విస్తరణపై పవన్ కీలక వ్యాఖ్యలు.!
- FSSAI : పామాయిల్పై కీలక ప్రకటన.. అపోహలు వద్దు.. అది సురక్షితం..!
- Nadendla Manohar: జనసేన లక్ష్యం 25 లక్షల సభ్యత్వాలు.. కార్యకర్తలకు భరోసా.. రూ. 46 కోట్ల భీమా సాయం
అలానే ఘటన స్థలంలో దొరికిన సూసైడ్ నోట్ లో మనీష్ పేరు మాత్రమే ఉంది. మిగిలిన కుటంబసభ్యుల పేర్లు లేవు. కావున మనీష్ ముందుగా అందరిని చంపి తరువాత తాను చనిపోయినట్లు తెలుస్తుంది. కాగా మనీష్ సోలంకి కుటుంబాన్ని హత్య చేసి తాను ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు తెలియలేదు. శనివారం పాలన్పూర్ పాటియా ప్రాంతం లోని శ్రీ సిద్ధేశ్వర్ కాంప్లెక్స్ లోని సి-2 టవర్ లోని ఫ్లాట్ నంబర్ జి-1 నుండి చెడువాసన వస్తున్న క్రమంలో స్థానికులు ఇంటి తలుపు తట్టగా ఎవరు స్పందించలేదు. ఈ నేపథ్యంలో స్థానికులకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటీన ఘటనాస్థలానికి వచ్చి తలుపు పగలగొట్టి చూడగా.. ఇంటీరియర్ డిజైన్ వ్యాపారి మనీష్ సోలంకి (37), అతని భార్య రీటా బెన్ సోలంకీ, తండ్రి కాను సోలంకి, తల్లి శోభన, కూతురు దిశా సోలంకి, కూతురు కావ్య సోలంకి, కుమారుడు కుశాల్ సోలంకి విగతజీవులుగా పడివున్నారు. దీనితో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చెప్పాట్టరు.
తాజావార్తలు
-
Chennai: టెక్ మహీంద్రా కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం.. మంటల్లో ఆఫీస్ దగ్ధం
-
Pawan Kalyan : ఒక్కడిగా మొదలై.. లక్షలాది మంది సైన్యంగా.. జనసేన విస్తరణపై పవన్ కీలక వ్యాఖ్యలు.!
-
FSSAI : పామాయిల్పై కీలక ప్రకటన.. అపోహలు వద్దు.. అది సురక్షితం..!
-
Gautam Adani: అదానీకి అమెరికా బిగ్ షాక్.. రూ.2200 కోట్ల లంచాల కేసులో అదానీపై యూఎస్ సెక్యూరిటీస్ సంస్థ నయా యాక్షన్!
-
Chiranjeevi : సీఎం విజయ్’కి చిరు ఫోన్
ట్రెండింగ్
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!