Train Accident: పట్టాలు తప్పిన రైలు కోచ్లు.. తప్పిన పెను ప్రమాదం..
- తమిళనాడులో రైలు ప్రమాదం
- పట్టాలు తప్పిన కోచ్లు
- తప్పిన పెను ప్రమాదం
తమిళనాడులో మంగళవారం ఉదయం రైలు ప్రమాదం తప్పింది. పుదుచ్చేరికి వెళ్తున్న మెయిన్లైన్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ (MEMU) రైలు కోచ్లు పట్టాలు తప్పాయి. విల్లుపురం సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారి తెలిపారు. లోకో పైలట్ దానిని చూసి వెంటనే రైలును ఆపడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. మూడు గంటల్లోనే రైలు రాకపోకలను పునరుద్ధరించినట్లు అధికారులు తెలిపారు. పట్టాలు తప్పడానికి గల కారణాలు విచారణ పూర్తయిన తర్వాతే తెలుస్తుందని చెప్పారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు.
READ MORE: Laurene Powell: మహా కుంభమేళాలో అస్వస్థతకు గురైన స్టీవ్ జాబ్స్ భార్య..
Also Read
- UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
- PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
- S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
- Petrol Bunks Rush: పెట్రోల్ బంకుల వద్ద రద్దీకి అసలు కారణాలు ఇవే..!
దాదాపు 500 మంది ప్రయాణికులతో విల్లుపురం-పుదుచ్చేరి రైలు ఉదయం 5.25 గంటలకు విల్లుపురం నుంచి బయలుదేరింది. రైలు మలుపు దాటుతుండగా దాని కోచ్లు పట్టాలు తప్పడంతో లోకో పైలట్ వెంటనే రైలును ఆపారు. ఈ ప్రమాదం కారణంగా విల్లుపురం మార్గంలో ఉదయం 8.30 గంటల వరకు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. విల్లుపురం-పుదుచ్చేరి మెము రైలు 38 కిలోమీటర్ల స్వల్ప దూరం ప్రయాణిస్తుంది.
READ MORE: Bandi Sanjay Kumar: పసుపు రైతుల జీవితాల్లో కొత్త కాంతులు రాబోతున్నయ్..
ఇదిలా ఉండగా… చలికాలంలో దట్టమైన పొగమంచు కారణంగా రైళ్ల వేగం మందగించడం గమనార్హం. మనం దేశ రాజధాని ఢిల్లీలో మంగళవారం ఉదయం దట్టమైన పొగమంచు అలముకొంది. దీని కారణంగా దృశ్యమానత మందగించింది. రైళ్ల నిర్వహణకు అంతరాయం కలిగింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉదయం 6 గంటల వరకు మొత్తం 39 రైళ్లు ఆలస్యంగా నడిచాయి. కొన్ని రైళ్లు 30 నిమిషాలు ఆలస్యంగా నడవగా, మరికొన్ని రైళ్లు నాలుగు గంటల వరకు ఆలస్యంగా నడుస్తున్నాయి.
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో