గుజరాత్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అహ్మదాబాద్-వడోదర ఎక్స్ప్రెస్ హైవేపై నదియాడ్ సమీపంలో బుధవారం ఘోర ప్రమాదం జరిగింది. ఆయిల్ ట్యాంకర్ ను ఓ కారు వెనుక నుండి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 10 మంది మృతి చెందారు. వారిలో ఎనిమిది మంది అక్కడికక్కడే మృతి చెందగా, ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది.
Read Also: Delhi Crime: దారుణం.. స్క్రూడ్రైవర్తో పొడిచి భార్య, బావమరిదిని హత్య చేసిన భర్త
మృతుల్లో ఒక మహిళ కూడా ఉంది. సమాచారం అందుకున్న ఎమర్జెన్సీ 108, పోలీసు బృందం సంఘటనా స్థలానికి చేరుకుంది. వెంటనే సహాయక చర్యలు చేపట్టి క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదం జరగడంతో అహ్మదాబాద్-వడోదర ఎక్స్ప్రెస్ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. మరోవైపు.. ప్రమాదంలో మృతి చెందిన మృతదేహాలను కారులో నుంచి బయటకు తీయడానికి కొందరు స్థానికులు పోలీసులకు సహకరించారు. ఈ ప్రమాదంలో మృతదేహాలు నుజ్జునుజ్జయ్యాయి. వారిని గుర్తుపట్టలేనంత స్థితిలో ఉన్నారు. ఈ క్రమంలో.. పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి, ట్రాఫిక్ను క్లియర్ చేశారు.
#WATCH | Ahmedabad, Gujarat: 10 people died in a road accident that took place on Vadodara-Ahmedabad Expressway. pic.twitter.com/rIGVpgppQK
— ANI (@ANI) April 17, 2024
Read Also: KTR : సివిల్స్లో తెలుగుతేజాలు.. అభినందించిన కేటీఆర్
