NTV Telugu Site icon

Hyderabad: సూసైడ్ నోట్ రాసి సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య.. కారణమిదే..?

Suicide

Suicide

సాఫ్ట్వేర్ ఉద్యోగి సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్న ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. మృతుడు సంగారెడ్డి జిల్లాకు చెందిన కిరణ్గా గుర్తించారు పోలీసులు. అతను విప్రో కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. ఇంట్లో సమస్యలతో డిప్రెషన్లో ఉరేసుకొని ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడినట్లుగా తెలుస్తోంది.

Read Also: Budget 2024: నిరుద్యోగులకు గుడ్ న్యూస్..5 సంవత్సరాల్లో 4 కోట్ల ఉద్యోగాలు!

మృతుడు కొల్లూరు పీఎస్ పరిధిలోని తెల్లాపూర్ (BHEL) విద్యుత్తు నగర్ లో నివాసముంటున్నాడు. అతని వయస్సు (25 సంవత్సరాలు). కుటుంబ సమస్యల నేపథ్యంలో సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ కిరణ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతను చనిపోయే ముందు సూసైడ్ లెటర్ రాశాడు. కాగా.. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. లభ్యమైన సూసైడ్ నోట్ ఆధారంగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు కుటుంబ కారణాలా లేదంటే.. ఇంకేమైనా కారణాలున్నాయా అనే దానిపై విచారణ చేస్తున్నారు. మరోవైపు.. ఆత్మహత్య విషయాన్ని పోలీసులు కుటుంబ సభ్యులకు తెలియజేశారు.

Read Also: BRS : బేషరతుగా పంట రుణమాఫీ, గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వాలి