Fire Accident In Train: గ్యాస్ లీకేజీ కావడంతో.. ఆగి ఉన్న రైల్వే కోచ్లో భారీ అగ్నిప్రమాదం
- రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్పూర్లో లుని రైల్వే స్టేషన్లోని క్యాంపింగ్ కోచ్లో.
- అకస్మాత్తుగా మంటలు వ్యాప్తి.
- గ్యాస్ లీకేజీ కావడంతో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fire Accident In Train: రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్పూర్లో లుని రైల్వే స్టేషన్లోని క్యాంపింగ్ కోచ్లో అకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి. ఈ కోచ్ రైల్వే కార్మికులకు చెందినది. అందులో వారు ఆహారం వండుతున్నారు. వంట చేస్తుండగా గ్యాస్ లీకేజీ కావడంతో మంటలు చెలరేగడంతో కోచ్లో ఉన్న ఉద్యోగులు భయాందోళనకు గురయ్యారు. మంటలు చెలరేగడంతో స్టేషన్లో గందరగోళం నెలకొనడంతో మంటలను అధికారులు ఆర్పే ప్రయత్నం చేశారు. ఈ కోచ్ జోధ్పూర్ – లూని సెక్షన్ మధ్య ట్రాక్ లపై పనిచేసే ఉద్యోగుల కోసమేనని రైల్వే అధికారులు తెలిపారు. రైలుకు కోచ్ కనెక్ట్ కాకపోవడంతో మంటలు చెలరేగడంతో పెద్ద ప్రమాదం జరగలేదు. అయితే, కోచ్లో రెండు గ్యాస్ సిలిండర్లు ఉంచి ఉండడంతో వాటిని బయటకు తీయలేకపోవడంతో పేలుడు ప్రమాదం పొంచి ఉంది.
Also Read
- Modi-Meloni Selfie Goes Viral: వైరల్గా మారిన మోడీ-మెలోని కొత్త సెల్ఫీ..
- Mamata Banerjee: కేంద్రంలో బీజేపీ అధికారం కోల్పోవడం ఖాయం.. మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు..
- AP Heatwave Alert: ఏపీలో భగ్గుమంటున్న ఎండలు.. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు..
- Google I/O 2026: AIలో Google దూకుడు.. కొత్త Gemini 3.5 Flash నుంచి AI చిప్స్ వరకు భారీ ప్రకటనలు.!
అగ్నిప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే లూని పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న రైల్వే సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలైనట్లు సమాచారం లేదు. మంటలను త్వరగా అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని రైల్వే స్టేషన్ అధికారులు తెలిపారు. పోలీసులు, రైల్వే అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించి పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇది పాత కండం కోచ్ అని, అది లాక్లో ఉందని జోధ్పూర్ రైల్వే డివిజన్ మేనేజర్ పంకజ్ కుమార్ సింగ్ తెలిపారు. అగ్నిప్రమాదం వల్ల ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. పాత కోచ్ రైలు మార్గంలో నిలబడి ఉంది. ఆ ప్రాంతంలో జరుగుతున్న రైల్వే పనుల్లోని ఉద్యోగులు దీనిని క్యాంపింగ్ కోచ్గా ఉపయోగిస్తున్నారు. మధ్యాహ్నం అందులోనే ఆహారం వండుతున్నారు. ఈ సమయంలో మంటలు చెలరేగాయి.
Read Also: Most Expensive Rice: భూమి మీద అత్యంత ఖరీదైన బియ్యం ఎక్కడ పండిస్తారంటే? ఒక్క కిలో ధర ఏకంగా వేలల్లో..
जोधपुर के लूणी रेलवे स्टेशन पर खड़े रेलवे डिब्बे में खाना बनाते समय लगी आग, फायर ब्रिगेड मौके पर। @AshwiniVaishnaw pic.twitter.com/yFRrctgGUx
— Dr. Ashok Sharma (@ashok_Jodhpurii) November 13, 2024
తాజావార్తలు
-
Sridevi: ‘కోర్ట్’ హీరోయిన్కు జాక్పాట్..రజినీకాంత్ మూవీలో శ్రీదేవి..?
-
Modi-Meloni Selfie Goes Viral: వైరల్గా మారిన మోడీ-మెలోని కొత్త సెల్ఫీ..
-
Mamata Banerjee: కేంద్రంలో బీజేపీ అధికారం కోల్పోవడం ఖాయం.. మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు..
-
Sathi Leelavathi: ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చిన ‘సతీ లీలావతి’!
-
Rajasthan Royals Record: రాజస్థాన్ రాయల్స్ నయా రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే మొదటి జట్టుగా ఆర్ఆర్!
ట్రెండింగ్
-
Google I/O 2026: AIలో Google దూకుడు.. కొత్త Gemini 3.5 Flash నుంచి AI చిప్స్ వరకు భారీ ప్రకటనలు.!
-
PCOS గురించి ఈ నిజాలు తెలుసా..? వైద్యులు చెబుతున్న కీలక విషయాలు ఇవే.!
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?