Fire Accident In Train: గ్యాస్ లీకేజీ కావడంతో.. ఆగి ఉన్న రైల్వే కోచ్లో భారీ అగ్నిప్రమాదం
- రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్పూర్లో లుని రైల్వే స్టేషన్లోని క్యాంపింగ్ కోచ్లో.
- అకస్మాత్తుగా మంటలు వ్యాప్తి.
- గ్యాస్ లీకేజీ కావడంతో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fire Accident In Train: రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్పూర్లో లుని రైల్వే స్టేషన్లోని క్యాంపింగ్ కోచ్లో అకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి. ఈ కోచ్ రైల్వే కార్మికులకు చెందినది. అందులో వారు ఆహారం వండుతున్నారు. వంట చేస్తుండగా గ్యాస్ లీకేజీ కావడంతో మంటలు చెలరేగడంతో కోచ్లో ఉన్న ఉద్యోగులు భయాందోళనకు గురయ్యారు. మంటలు చెలరేగడంతో స్టేషన్లో గందరగోళం నెలకొనడంతో మంటలను అధికారులు ఆర్పే ప్రయత్నం చేశారు. ఈ కోచ్ జోధ్పూర్ – లూని సెక్షన్ మధ్య ట్రాక్ లపై పనిచేసే ఉద్యోగుల కోసమేనని రైల్వే అధికారులు తెలిపారు. రైలుకు కోచ్ కనెక్ట్ కాకపోవడంతో మంటలు చెలరేగడంతో పెద్ద ప్రమాదం జరగలేదు. అయితే, కోచ్లో రెండు గ్యాస్ సిలిండర్లు ఉంచి ఉండడంతో వాటిని బయటకు తీయలేకపోవడంతో పేలుడు ప్రమాదం పొంచి ఉంది.
Also Read
- Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
- RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
- Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
- Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
అగ్నిప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే లూని పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న రైల్వే సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలైనట్లు సమాచారం లేదు. మంటలను త్వరగా అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని రైల్వే స్టేషన్ అధికారులు తెలిపారు. పోలీసులు, రైల్వే అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించి పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇది పాత కండం కోచ్ అని, అది లాక్లో ఉందని జోధ్పూర్ రైల్వే డివిజన్ మేనేజర్ పంకజ్ కుమార్ సింగ్ తెలిపారు. అగ్నిప్రమాదం వల్ల ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. పాత కోచ్ రైలు మార్గంలో నిలబడి ఉంది. ఆ ప్రాంతంలో జరుగుతున్న రైల్వే పనుల్లోని ఉద్యోగులు దీనిని క్యాంపింగ్ కోచ్గా ఉపయోగిస్తున్నారు. మధ్యాహ్నం అందులోనే ఆహారం వండుతున్నారు. ఈ సమయంలో మంటలు చెలరేగాయి.
Read Also: Most Expensive Rice: భూమి మీద అత్యంత ఖరీదైన బియ్యం ఎక్కడ పండిస్తారంటే? ఒక్క కిలో ధర ఏకంగా వేలల్లో..
जोधपुर के लूणी रेलवे स्टेशन पर खड़े रेलवे डिब्बे में खाना बनाते समय लगी आग, फायर ब्रिगेड मौके पर। @AshwiniVaishnaw pic.twitter.com/yFRrctgGUx
— Dr. Ashok Sharma (@ashok_Jodhpurii) November 13, 2024
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!