Fire Accident In Train: గ్యాస్ లీకేజీ కావడంతో.. ఆగి ఉన్న రైల్వే కోచ్లో భారీ అగ్నిప్రమాదం
- రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్పూర్లో లుని రైల్వే స్టేషన్లోని క్యాంపింగ్ కోచ్లో.
- అకస్మాత్తుగా మంటలు వ్యాప్తి.
- గ్యాస్ లీకేజీ కావడంతో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fire Accident In Train: రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్పూర్లో లుని రైల్వే స్టేషన్లోని క్యాంపింగ్ కోచ్లో అకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి. ఈ కోచ్ రైల్వే కార్మికులకు చెందినది. అందులో వారు ఆహారం వండుతున్నారు. వంట చేస్తుండగా గ్యాస్ లీకేజీ కావడంతో మంటలు చెలరేగడంతో కోచ్లో ఉన్న ఉద్యోగులు భయాందోళనకు గురయ్యారు. మంటలు చెలరేగడంతో స్టేషన్లో గందరగోళం నెలకొనడంతో మంటలను అధికారులు ఆర్పే ప్రయత్నం చేశారు. ఈ కోచ్ జోధ్పూర్ – లూని సెక్షన్ మధ్య ట్రాక్ లపై పనిచేసే ఉద్యోగుల కోసమేనని రైల్వే అధికారులు తెలిపారు. రైలుకు కోచ్ కనెక్ట్ కాకపోవడంతో మంటలు చెలరేగడంతో పెద్ద ప్రమాదం జరగలేదు. అయితే, కోచ్లో రెండు గ్యాస్ సిలిండర్లు ఉంచి ఉండడంతో వాటిని బయటకు తీయలేకపోవడంతో పేలుడు ప్రమాదం పొంచి ఉంది.
Also Read
- Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
- Ganesh Procession Tragedy: వినాయకుడి ఊరేగింపులో విషాదం.. జనరేటర్ ఫ్యాన్కు జుట్టు చిక్కుకుని బాలిక మృతి
- ENG vs SL: హడలెత్తించిన 'హ్యారీ బ్రూక్' సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
- CM Chandrababu: ఆరు నెలల్లో 5.52 లక్షల ఇళ్లను పూర్తి చేయాలి.. సీఎం కీలక ఆదేశాలు
అగ్నిప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే లూని పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న రైల్వే సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలైనట్లు సమాచారం లేదు. మంటలను త్వరగా అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని రైల్వే స్టేషన్ అధికారులు తెలిపారు. పోలీసులు, రైల్వే అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించి పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇది పాత కండం కోచ్ అని, అది లాక్లో ఉందని జోధ్పూర్ రైల్వే డివిజన్ మేనేజర్ పంకజ్ కుమార్ సింగ్ తెలిపారు. అగ్నిప్రమాదం వల్ల ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. పాత కోచ్ రైలు మార్గంలో నిలబడి ఉంది. ఆ ప్రాంతంలో జరుగుతున్న రైల్వే పనుల్లోని ఉద్యోగులు దీనిని క్యాంపింగ్ కోచ్గా ఉపయోగిస్తున్నారు. మధ్యాహ్నం అందులోనే ఆహారం వండుతున్నారు. ఈ సమయంలో మంటలు చెలరేగాయి.
Read Also: Most Expensive Rice: భూమి మీద అత్యంత ఖరీదైన బియ్యం ఎక్కడ పండిస్తారంటే? ఒక్క కిలో ధర ఏకంగా వేలల్లో..
जोधपुर के लूणी रेलवे स्टेशन पर खड़े रेलवे डिब्बे में खाना बनाते समय लगी आग, फायर ब्रिगेड मौके पर। @AshwiniVaishnaw pic.twitter.com/yFRrctgGUx
— Dr. Ashok Sharma (@ashok_Jodhpurii) November 13, 2024
తాజావార్తలు
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
-
Dhanush D56 Title: ధనుష్ D56కి ‘పడయల్’ టైటిల్.. ఊహించని మాస్ యాక్షన్తో రాబోతున్నాడా?
-
Ganesh Procession Tragedy: వినాయకుడి ఊరేగింపులో విషాదం.. జనరేటర్ ఫ్యాన్కు జుట్టు చిక్కుకుని బాలిక మృతి
-
Shreyas Iyer: అప్పుడు చాలా బాధేసింది.. ఏం చేయాలో అర్థం కాలేదు.. ఇప్పుడు ఫుల్ హ్యాపీ!
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
ట్రెండింగ్
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!
-
రూ.1,659కే itel Muzik 450L ఫోన్.. థియేటర్ లాంటి సౌండ్, 2,500mAh బ్యాటరీ.!
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!