NTV Telugu Site icon

UP: నాలుగేళ్ల బాలికపై ఓ వ్యక్తి అత్యాచారం, హత్య.. సవతి తల్లి ప్రమేయం

Up

Up

యూపీ గోండా జిల్లాలోని కత్రా శివదయాల్‌గంజ్ స్టేషన్ సమీపంలో నాలుగేళ్ల బాలికపై ఓ వ్యక్తి అత్యాచారం చేసి.. అనంతరం చంపేశాడు. ఈ హత్యలో బాలిక సవతి తల్లి ప్రమేయం కూడా ఉంది. కాగా.. బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిర్వహించిన తర్వాత.. అసలు విషయం బయటపడింది. పోస్ట్‌మార్టం నివేదికలో సాధు వేషధారణలో ఉన్న ఓ వ్యక్తి అత్యాచారం చేసి, హత్య చేసినట్లుగా గుర్తించారు. ఈ కేసులో పోలీసులు పోక్సో, అత్యాచారం చట్టం కింద నిందితుడిపై కేసు నమోదు చేశారు. అంతేకాకుండా నిందితుడి రక్త నమూనాను పరీక్షల నిమిత్తం లక్నోకు పంపారు. ఈ ఘటన జరిగిన 24 గంటల్లోనే నిందితుడు విశ్వనాథ్ వాన్శ్వర్‌ను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.

Early Age of Menstruation : బాలికలలో చిన్న వయసులో పెద్దమనిషి కావడానికి కారణాలు ఇవే.. జాగ్రత్త సుమీ..

శనివారం ఉదయం కత్రా శివదయాల్‌గంజ్‌ రైల్వే స్టేషన్‌ సమీపంలోని ఓ చెట్టుకింద చిన్నారి మృతదేహం పడి ఉండటం చూసి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అంతేకాకుండా.. ఆ బాలిక సాధువు వేషంలో ఉన్న వ్యక్తితో మద్యం మత్తులో చూసినట్లు స్థానికులు పోలీసులకు తెలిపారు. ఈ సమయంలో విష్ణు గుప్తా అనే వ్యక్తి చేసిన వీడియో కూడా వైరల్‌గా మారింది. ఈ కేసులో విష్ణును వాది చేసిన పోలీసులు.. గుర్తు తెలియని సాధువు ఫిర్యాదు మేరకు హత్య కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మృతదేహానికి పోస్టుమార్టం, వైద్య పరీక్షలు నిర్వహించగా అసలు విషయం బయటపడింది. ఈ క్రమంలో.. నిందితుడిపై నమోదైన కేసులో అత్యాచారం, పోక్సో చట్టం సెక్షన్‌ను పెంచినట్లు ఇన్‌స్పెక్టర్ ఇన్‌స్పెక్టర్ మనోజ్ రాయ్ తెలిపారు.

Adam Gilchrist: రోహిత్ బయట చెప్పిన మాటలను.. మైదానంలో చేసి చూపించాడు!

సాధువు వేషంలో ఉన్న మృగం వైరల్ వీడియో అతని అరెస్టుకు ప్రధాన ఆధారంగా మారింది. అయితే ఘటన జరిగిన రోజు కాషాయ వస్త్రాలు ధరించిన విశ్వనాథ్ అరెస్ట్ సమయంలో జీన్స్ ప్యాంట్, టీ షర్ట్ ధరించి కనిపించాడు. టవల్‌తో ముఖాన్ని కూడా దాచుకునే ప్రయత్నం చేశాడు. మహేశ్‌పూర్ రైల్వే బ్రిడ్జి కింద అనుమానాస్పద స్థితిలో పోలీసులు అతన్ని పట్టుకున్నారు. వైరల్ వీడియో ద్వారా మాత్రమే అతని ముఖం గుర్తించారు.