Maharastra : పోలీసులు అరెస్ట్ చేస్తారని భయపడి.. బిల్డింగ్ పై దూకాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maharastra : మహారాష్ట్రలోని థానేలో పోలీసులు అరెస్ట్ చేస్తారన్న భయంలో ఓ వ్యక్తి బిల్డింగ్ పై నుంచి దూకాడు. భివండి ప్రాంతంలో నకిలీ టెలిఫోన్ ఎక్స్ఛేంజ్ నిర్వహిస్తున్న సమాచారం అందుకున్న పోలీసులు ముఠాను అరెస్టు చేసేందుకు యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్), థానే పోలీసులు ప్రయత్నిస్తున్న క్రమంలోనే ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే.. ఇటీవల నకిలీ టెలిఫోన్ ఎక్స్ఛేంజ్ ల బెడద ఎక్కువయ్యింది. దీనిని నివారించడానికి మహారాష్ట్ర పోలీసులు, ఏటీఎస్ అధికారులు ప్రత్యేకంగా చర్యలు గట్టి చర్యలకు పూనుకున్నారు. ఈ క్రమంలోనే గత ఏడాది జూలైలో మొరాదాబాద్ పోలీసులు అక్రమ అంతర్జాతీయ టెలిఫోన్ ఎక్స్ఛేంజ్ ను ఛేదించి నకిలీ టెలిఫోన్ ఎక్స్ఛేంజ్ నిర్వహిస్తున్న ఇద్దరు వ్యక్తులను కనిపెట్టి అరెస్టు చేశారు. అయితే తాజాగా థానే జిల్లాలోని భివాండి ప్రాంతంలోని ఓ భవనంలోని ఐదో అంతస్తులో నకిలీ టెలిఫోన్ ఎక్స్ఛేంజ్ ఉందని సమాచారం వారికి అందింది. దీంతో శనివారం సాయంత్రం పోలీసులు, ఏటీఎస్ అధికారులు అక్కడికి చేరుకున్నారు. ఆ సమయంలో నిందితుల్లో ఒకరు పోలీసులకు చిక్కుకుండా ఉండేందుకు పరిగెత్తి భవనం పైనుంచి కిందికి దూకాడు. దీంతో తీవ్ర గాయాలతో అతడు మరణించాడు.
Read Also: Sai Dharam Tej: ఒక్క హిట్ కొట్టగానే రెండు సీక్వెల్స్ కి రెడీ…
Also Read
- Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
- Vaibhav Sooryavanshi: వైభవ్ విజయం వెనుక ఉన్న అసలు హీరో ఇతడేనా? ఐపీఎల్ అంతా నీడలా వెంట నడిచిన మెంటార్!
- TMC Rebellion: నాడు ఠాక్రే, నేడు మమత.. దేశ రాజకీయాల్లో రెండు ముక్కలుగా చీలిపోయిన అతిపెద్ద పార్టీలు ఇవే..
- Virat Kohli Injured: టీమిండియాకు భారీ షాక్.. ఆఫ్ఘనిస్తాన్ సిరీస్కు కోహ్లీ దూరం.!
మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం కోసం పంపించారు. అయితే వారికి ఆశ్రయం ఇచ్చిన ఫ్లాట్ యజమాని పరారీలో ఉన్నాడు. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. అక్కడ లభించిన వస్తువులను స్వాధీనం చేసుకున్నామని థానే పోలీసులు తెలిపారు. కాగా.. గతేడాది పోలీసులు అదుపులోకి తీసుకున్న ఇద్దరు నిందితులు ఈ నకిలీ టెలిఫోన్ ఎక్స్ఛేంజ్ ఆపరేటర్ ఇంటర్నేషనల్ కాల్స్ ను లోకల్ కాల్స్ గా మార్చేవారని మొరాదాబాద్ ఎస్పీ అఖిలేష్ భదౌరియా తెలిపారు. వీరు సిమ్ బాక్సుల ద్వారా వీవోఐపీ కాల్స్ ను జీఎస్ ఎం కాల్స్ గా మార్చేవారని చెప్పారు. నిందితులను మహ్మద్ కలీం, అతని సోదరుడు మహ్మద్ మెహరాజ్ గా గుర్తించామని చెప్పారు. వారి నుంచి 550 సిమ్ కార్డులు, రూ.63 వేలు స్వాధీనం చేసుకున్నారు.
Read Also:Puducherry : తాగి వచ్చి కొడుతున్నాడని.. మొగుడిపై కిరోసిన్ పోసి నిప్పంటిన భార్య
తాజావార్తలు
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
Kitchen Hacks: గ్యాస్ బర్నర్లు నల్లగా మారిపోయాయా? ఇలా చేస్తే నిమిషాల్లో కొత్త వాటిలా మెరిసిపోతాయి!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ విజయం వెనుక ఉన్న అసలు హీరో ఇతడేనా? ఐపీఎల్ అంతా నీడలా వెంట నడిచిన మెంటార్!
-
PF Money: ఉద్యోగం మారిన తర్వాత పీఎఫ్ విషయంలో ఈ తప్పు చేస్తే భారీ నష్టం తప్పదు!
-
AA 23 : అల్లు అర్జున్ – లోకేష్ కనకరాజ్ సినిమా ఆగిపోయిందా? అసలు నిజమిదే!
ట్రెండింగ్
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!