Fine For Post Office: యాభై పైసలు తిరిగి ఇవ్వనందుకు రూ. 15 వేలు జరిమానా
- చెన్నై వినియోగదారుల ఫోరమ్ లో.
- యాభై పైసలు తిరిగి ఇవ్వనందుకు..
- పోస్టాఫీసుకు రూ. 15 వేలు జరిమానా.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fine For Post Office: చెన్నై వినియోగదారుల ఫోరమ్ లో యాభై పైసల వివాదానికి సంబంధించి ఒక కేసు ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కస్టమర్కు రావాల్సిన మొత్తాన్ని తిరిగి ఇవ్వడానికి విఫలమైన స్థానిక పోస్టాఫీసుకు రూ. 15,000 జరిమానా విధించబడింది. డిసెంబర్ 3, 2023న రిజిస్టర్డ్ లెటర్ను పంపించడానికి వచ్చిన పొలిచలూరు పోస్టాఫీసుకు గెరుగంబాక్కం నివాసి మనషా వచ్చినప్పుడు ఈ సంఘటన చోటు చేసుకుంది. రిజిస్టర్డ్ లెటర్ సంబంధించి మొత్తం రూ. 29.50 కాగా మనషా కౌంటర్లో రూ. 30 చెల్లించాడని.. అతనికి 50 పైసలు కస్టమర్ కి రావాల్సి ఉంటుందని నివేదిక తెలిపింది. అయితే, పోస్టాఫీసుకు చెందిన సిస్టమ్ ఆటోమేటిక్గా ఫీజును రూ.30కి పూర్తి చేసిందని తెలిపింది. ఈ విషయంలో మిగిలిన మొత్తం తిరిగి ఇవ్వాలని కోరినప్పుడు, సాంకేతిక సమస్యల కారణంగా యాభై పైసలు ఇవ్వడానికి పోస్టాఫీసు నిరాకరించింది.
Also Read
- Vijayawada Durga Temple: దుర్గమ్మ భక్తులకు గుడ్న్యూస్.. ఇక ఓటీపీ ఎంటర్ చేస్తే చేతికి దుర్గమ్మ లడ్డూ
- Vaibhav Sooryavanshi-Brett Lee: అవును, వైభవ్ సూర్యవంశీ వయసు 18 ఏళ్లు అయినా ఎవరికి నష్టం?
- Lal Darwaza Bonalu: పాతబస్తీలో బోనాల పండుగ శోభ.. అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు
- Ravindra Jadeja: ఎట్టకేలకు గంభీర్ ముఖంలో నవ్వులు పూయించిన జడేజా.. ఏం చేశాడో చూడండి (వీడియో)
ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న మనషా.. ఇండియా పోస్ట్ రోజువారీ లావాదేవీల వల్ల గణనీయమైన మొత్తంలో డబ్బు స్వాహా చేయబడుతుందని.. దాని ఫలితంగా నల్లధనం, GST రాబడి కూడా ప్రభుత్వానికి నష్టం వాటిల్లుతుందని జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమీషన్లో ఫిర్యాదు చేసింది. ఈ విషయంలో 50 పైసల కంటే తక్కువ ఉన్న మొత్తాలను స్థిరంగా “విస్మరించారని” పోస్ట్ ఆఫీస్ పేర్కొంది. అటువంటి మొత్తాన్ని సమీప రూపాయికి పూర్తి చేయడానికి సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ చేయబడిందని పేర్కొంది.
Read Also: DY Chandrachud: ఢిల్లీలో కాలుష్యం వల్ల మార్నింగ్ వాక్ చేయడం మానేశాం..
యూపీఐ చెల్లింపుల కోసం వారి “Pay U” QR కోడ్ సిస్టమ్ నవంబర్ 2023 నుండి తప్పుగా పని చేసిందని, మే 2024లో నిలిపివేయబడిందని పోస్ట్ ఆఫీస్ వివరించింది. ఈ కేసును సమీక్షించిన తర్వాత, సాఫ్ట్వేర్ లోపం కారణంగా అధిక ఛార్జీ విధించడం అన్యాయమైన వాణిజ్య పద్ధతి అని కమిషన్ తీర్పు చెప్పింది. వినియోగదారుల రక్షణ చట్టం, 2019 ప్రకారం.. రూ. 15,000 జరిమానా విధించాలని కోర్ట్ ఆదేశించింది.
తాజావార్తలు
-
Air India: ఫుకెట్-ఢిల్లీ ఎయిర్ ఇండియా విమాన పైలట్ డోప్ టెస్ట్లో ఫెయిల్? స్పందించిన ఎయిర్ ఇండియా
-
Operation Safed Sagar OTT: కార్గిల్ యుద్ధం చెప్పని కథ.. నెట్ఫ్లిక్స్లో నంబర్ 1గా దూసుకెళ్తున్న 6 ఎపిసోడ్ల సిరీస్..
-
Kriti Sanon : ఒకవైపు ఫ్యాషన్ ఐకాన్, మరోవైపు బిగ్-బడ్జెట్ సినిమాల క్వీన్
-
Korean Kanakaraju Day 2 Collections: వరుణ్ తేజ్ ‘కొరియన్ కనకరాజు’ దూకుడు.. 2 రోజుల్లోనే రూ.23.6 కోట్ల గ్రాస్!
-
Hyderabad Black Hawks: తెలుగు రాష్ట్రాల్లో వాలీబాల్కు కొత్త ఊపు.. హైదరాబాద్ బ్లాక్ హాక్స్ దీర్ఘకాలిక ప్రణాళిక
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!