NITI Aayog: నీతి ఆయోగ్ మీటింగ్ కు 9 మంది సీఎంలు డుమ్మా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సమాఖ్య స్ఫూర్తిని విస్మరించి విపక్ష పాలిత రాష్ర్టాలను వివిధ రకాలుగా ఇబ్బంది పెడుతున్న కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా నీతి ఆయోగ్ 8వ పాలక మండలి సమావేశాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ సహా మరో ఎనిమిది మంది విపక్ష సీఎంలు బహిష్కరించారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, తమిళనాడు సీఎం స్టాలిన్ నీతి ఆయోగ్ భేటీకి గైర్హాజరయ్యారు.
Also Read : Raipur Crime: పెళ్లి సాకుతో మహిళా డాక్టర్ నుంచి 13 లక్షలు కాజేసిన కేటుగాళ్లు
Also Read
- Sonia Gandhi: గాజాపై కేంద్రం తీరుపై సోనియాగాంధీ విమర్శలు.. ప్రజల్ని తప్పుదోవ పట్టించొద్దన్న బీజేపీ
- CM Vijay: ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా ‘జన నాయకన్’ నిర్మాత నియామకం.. తమిళనాడులో రాజకీయ దుమారం
- Ketan Agarwal murder: ‘‘కుటుంబానికి చెప్పడం కన్నా చంపడమే ఈజీ’’.. కేతన్ హత్యలో సియా సంచలన ఒప్పుకోలు..
- Ketan Agarwal Case: దర్యాప్తులో సంచలన ట్విస్ట్.. వేళ్లన్నీ సియా తల్లిదండ్రుల వైపే..!
ఢిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన నిర్వహిస్తున్న నీతి ఆయోగ్ కౌన్సిల్ సమావేశానికి 9 మంది ప్రతిపక్ష పార్టీలకు చెందిన ముఖ్యమంత్రులు డుమ్మా కొట్టారు. కేంద్రం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఈ సమావేశానికి హాజరు కాని ముఖ్యమంత్రులు ఎవరో మనం తెలుసుకుందాం..?
Also Read : Former died: ధ్యాన్యం కొనుగోలు కేంద్రంలో దారుణం.. నిద్రిస్తున్న రైతు పైనుంచి వెళ్లిన ట్రాక్టర్
నీతి ఆయోగ్ మీటింగ్ కు గైర్హాజరైనా సీఎంలు:
1. కేసీఆర్: కేజ్రీవాల్తో శనివారం హైదరాబాద్లో సమావేశం కావాల్సి ఉన్నందున తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశానికి హాజరుకాలేదు.
2. అరవింద్ కేజ్రీవాల్: సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధంగా ఢిల్లీలో కేంద్రం కొత్త ఆర్డినెన్స్ను తీసుకురావడాన్ని వ్యతిరేకిస్తూ.. నీతి ఆయోగ్ మీటింగ్ కి హాజరవడం లేదని ప్రధాని మోదీకి లేఖ రాశారు.
3. భగవంత్ మాన్: పంజాబ్ రాష్ట్రానికి నిధుల మంజూరు విషయంలో కేంద్రం చూపుతున్న వివక్షకు నిరసనగా పంజాబ్ సీఎం భగవంత్ మాన్ దూరంగా ఉన్నారు.
4. మమతా బెనర్జీ: నీతి ఆయోగ్ సమావేశానికి తాను హాజరు కాకూడదని బెంగాల్ సీఎం ముందే నిర్ణయించుకున్నారు. ఆర్థిక మంత్రి, ప్రధాన కార్యదర్శిని పంపాలని టీఎంసీ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థనను కేంద్రం తిరస్కరించింది.
5. నితీష్ కుమార్: ముందుగా నిర్ణయించిన ప్రభుత్వ కార్యక్రమాల వల్ల నితీష్ కుమార్ హాజరు కాలేకపోతున్నారని బిహార్ మంత్రులు వెల్లడించారు.
6. అశోక్ గెహ్లాట్: అనారోగ్య కారణాలతో సీఎం గెహ్లాట్ సమావేశానికి హాజరు కావడం లేదని రాజస్థాన్ ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.
7. ఎం.కె స్టాలిన్: తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రస్తుతం సింగపూర్, జపాన్ పర్యటనలో ఉన్నారు. అందుకే ఆయన హాజరుకాలేదు.
8. పినరయి విజయన్: కేరళ సీఎం విజయన్ గైర్హాజరు కావడానికి ఎటువంటి నిర్దిష్ట కారణాలను మాత్రం వెల్లడించలేదు.
9. సిద్ధరామయ్య: కర్ణాటక రాష్ట్రంలో పలు అభివృద్ది కార్యక్రమాలు ఉండటం వల్లే హాజరు కావడం లేదని సిద్ధరామయ్య ప్రభుత్వం తెలిపింది.
తాజావార్తలు
-
Sonia Gandhi: గాజాపై కేంద్రం తీరుపై సోనియాగాంధీ విమర్శలు.. ప్రజల్ని తప్పుదోవ పట్టించొద్దన్న బీజేపీ
-
Aadarsha Kutumbam: అక్టోబర్ 2న ‘ఆదర్శ కుటుంబం’.. రిలీజ్ డేట్ లాక్! వెంకీ ఫ్యాన్స్కు పూనకాలే..
-
CM Vijay: ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా ‘జన నాయకన్’ నిర్మాత నియామకం.. తమిళనాడులో రాజకీయ దుమారం
-
Ketan Agarwal murder: ‘‘కుటుంబానికి చెప్పడం కన్నా చంపడమే ఈజీ’’.. కేతన్ హత్యలో సియా సంచలన ఒప్పుకోలు..
-
Ketan Agarwal Case: దర్యాప్తులో సంచలన ట్విస్ట్.. వేళ్లన్నీ సియా తల్లిదండ్రుల వైపే..!
ట్రెండింగ్
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!
-
55 రోజుల స్టాండ్బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..