NITI Aayog: నీతి ఆయోగ్ మీటింగ్ కు 9 మంది సీఎంలు డుమ్మా
సమాఖ్య స్ఫూర్తిని విస్మరించి విపక్ష పాలిత రాష్ర్టాలను వివిధ రకాలుగా ఇబ్బంది పెడుతున్న కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా నీతి ఆయోగ్ 8వ పాలక మండలి సమావేశాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ సహా మరో ఎనిమిది మంది విపక్ష సీఎంలు బహిష్కరించారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, తమిళనాడు సీఎం స్టాలిన్ నీతి ఆయోగ్ భేటీకి గైర్హాజరయ్యారు.
Also Read : Raipur Crime: పెళ్లి సాకుతో మహిళా డాక్టర్ నుంచి 13 లక్షలు కాజేసిన కేటుగాళ్లు
Also Read
- AP Weather Alert: ఏపీలో విభిన్న వాతావరణం.. ఓ వైపు 45.8°C ఎండలు.. మరోవైపు పిడుగులు..
- RCB Vs GT: ఆకాశమే హద్దుగా చెలరేగిన కోహ్లీ.. మరో రికార్డు బద్దలు కొట్టిన విరాట్..
- Boat sink: మధ్యప్రదేశ్లో ఘోర విషాదం.. 30 మందితో వెళ్తున్న పడవ మునక..
- Jasprit Bumrah: బుమ్రా బౌలింగ్లో పస తగ్గిందా..? ఈ IPL లో విఫలం అవ్వడానికి కారణం ఇదే..
ఢిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన నిర్వహిస్తున్న నీతి ఆయోగ్ కౌన్సిల్ సమావేశానికి 9 మంది ప్రతిపక్ష పార్టీలకు చెందిన ముఖ్యమంత్రులు డుమ్మా కొట్టారు. కేంద్రం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఈ సమావేశానికి హాజరు కాని ముఖ్యమంత్రులు ఎవరో మనం తెలుసుకుందాం..?
Also Read : Former died: ధ్యాన్యం కొనుగోలు కేంద్రంలో దారుణం.. నిద్రిస్తున్న రైతు పైనుంచి వెళ్లిన ట్రాక్టర్
నీతి ఆయోగ్ మీటింగ్ కు గైర్హాజరైనా సీఎంలు:
1. కేసీఆర్: కేజ్రీవాల్తో శనివారం హైదరాబాద్లో సమావేశం కావాల్సి ఉన్నందున తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశానికి హాజరుకాలేదు.
2. అరవింద్ కేజ్రీవాల్: సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధంగా ఢిల్లీలో కేంద్రం కొత్త ఆర్డినెన్స్ను తీసుకురావడాన్ని వ్యతిరేకిస్తూ.. నీతి ఆయోగ్ మీటింగ్ కి హాజరవడం లేదని ప్రధాని మోదీకి లేఖ రాశారు.
3. భగవంత్ మాన్: పంజాబ్ రాష్ట్రానికి నిధుల మంజూరు విషయంలో కేంద్రం చూపుతున్న వివక్షకు నిరసనగా పంజాబ్ సీఎం భగవంత్ మాన్ దూరంగా ఉన్నారు.
4. మమతా బెనర్జీ: నీతి ఆయోగ్ సమావేశానికి తాను హాజరు కాకూడదని బెంగాల్ సీఎం ముందే నిర్ణయించుకున్నారు. ఆర్థిక మంత్రి, ప్రధాన కార్యదర్శిని పంపాలని టీఎంసీ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థనను కేంద్రం తిరస్కరించింది.
5. నితీష్ కుమార్: ముందుగా నిర్ణయించిన ప్రభుత్వ కార్యక్రమాల వల్ల నితీష్ కుమార్ హాజరు కాలేకపోతున్నారని బిహార్ మంత్రులు వెల్లడించారు.
6. అశోక్ గెహ్లాట్: అనారోగ్య కారణాలతో సీఎం గెహ్లాట్ సమావేశానికి హాజరు కావడం లేదని రాజస్థాన్ ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.
7. ఎం.కె స్టాలిన్: తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రస్తుతం సింగపూర్, జపాన్ పర్యటనలో ఉన్నారు. అందుకే ఆయన హాజరుకాలేదు.
8. పినరయి విజయన్: కేరళ సీఎం విజయన్ గైర్హాజరు కావడానికి ఎటువంటి నిర్దిష్ట కారణాలను మాత్రం వెల్లడించలేదు.
9. సిద్ధరామయ్య: కర్ణాటక రాష్ట్రంలో పలు అభివృద్ది కార్యక్రమాలు ఉండటం వల్లే హాజరు కావడం లేదని సిద్ధరామయ్య ప్రభుత్వం తెలిపింది.
తాజావార్తలు
-
Chips and Soft Drinks Side Effects : చిప్స్ తింటూ కూల్ డ్రింక్స్ తాగుతున్నారా? అయితే ఈ ప్రమాదాలు తప్పవు.!
-
Minumula Payasam Recipe: నడుము నొప్పికి చెక్.. 60 ఏళ్లలోనూ ఉక్కులాంటి బలం ఇచ్చే ‘మినుముల పాయసం’!
-
AP Weather Alert: ఏపీలో విభిన్న వాతావరణం.. ఓ వైపు 45.8°C ఎండలు.. మరోవైపు పిడుగులు..
-
TIMS Sanathnagar: సనత్నగర్ వాసులకు శుభవార్త.. శుక్రవారం నుంచి టిమ్స్లో వైద్య సేవలు ప్రారంభం..!
-
Supreme Court : 31 వారాల గర్భస్రావానికి గ్రీన్ సిగ్నల్.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!