8 Vasantalu: ఇప్పట్లో వదిలేలా లేడుగా!
- ‘8 వసంతాలు’ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్.. త్వరలో ‘12 వసంతాలు’ స్క్రిప్ట్ పీడీఎఫ్ విడుదల
- వరుణ్ సోదరి, ఇష్టకుమార్, రాము, మమత క్యారెక్టర్లు నిడివి కారణంగా తొలగింపు
- శుద్ధి అయోధ్య యాక్సిడెంట్, క్యాన్సర్ కథలు స్క్రిప్ట్లో.. సెకండ్ హాఫ్లో వరుణ్తో ఎన్కౌంటర్!
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో ఫణీంద్ర నరిశెట్టి దర్శకత్వంలో వచ్చిన ‘ఎనిమిది వసంతాలు’ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. అనంతిక తెలుగు డెబ్యూ చిత్రంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నిజానికి డైరెక్టర్ కాన్ఫిడెన్స్, ప్రమోషన్ కంటెంట్ చూసి సినిమా ఏదో గట్టిగానే వర్కౌట్ అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఏమాత్రం ఆ అంచనాలను అందుకోలేకపోయింది. అయితే, ఈ సినిమా దర్శకుడు మాత్రం సినిమా అద్భుతంగా ఉందని, నచ్చని వాళ్ల గురించి తనకు తెలియదని అంటూ కామెంట్స్ చేస్తున్న సంగతి తెలిసిందే.
అయితే, తాజాగా ఆయన ఒక ఇంటర్వ్యూలో ‘ఎనిమిది వసంతాలు’ కాదని, ఏకంగా 12 వసంతాలు ఉన్నాయని, కానీ సినిమాలో అంతా చూపించలేని కారణంగా ఎనిమిది వసంతాలతో కథను రాసి క్లోజ్ చేశానని చెప్పుకొచ్చారు. ఇప్పుడు తాజాగా 8 వసంతాలు సినిమా ఓటీటీలోకి రావడంతో, త్వరలోనే తాను 12 వసంతాల స్క్రిప్ట్ను పీడీఎఫ్ రూపంలో పెడతానని ఆయన పేర్కొన్నారు. 12 వసంతాలతో పోలిస్తే, ‘ఎనిమిది వసంతాలు’లో శుద్ధి అయోధ్య పెద్దగా కష్టపడలేదని చెప్పుకొచ్చారు. వారణాసి ఎపిసోడ్లలో వరుణ్, సోదరి, ఇష్టకుమార్, రాము, మమత లాంటి క్యారెక్టర్లను నిడివి కారణంగా తొలగించానని, అలాగే సెకండ్ హాఫ్లో శుద్ధి అయోధ్యను చాలా ఇబ్బంది పెట్టానని, ఒక రకంగా ఆమెను బూడిద స్థాయికి తీసుకెళ్లానని కామెంట్స్ చేశారు.
Also Read
- CM Revanth Reddy : పెద్దల చదువుకు పెద్ద పీట.. వయోజనుల్లో అక్షరాస్యత పెంపుపై ప్రత్యేక శ్రద్ధ..
- Tragedy: వయ్యారాలు ఒలకబోస్తూ 5 గురు స్త్రీలు.. ఏకాంతంగా కలిసేందుకు ఆహ్వానాలు.. చివరకు ఇలా..
- White Towel: ప్రభుత్వ కార్యాలయాల్లో కుర్చీలపై తెల్ల టవల్ ఎందుకు?.. దీని వెనుక ఉన్న స్టోరీ ఇదే!
- TG EAPCET-2026 : షెడ్యూల్ విడుదల.. హాల్ టికెట్ల డౌన్లోడ్ ఎప్పుడంటే.?
Also Read: Pulasa Fish: యానాంలో చిక్కిన పులస.. వేలంలో తీవ్ర పోటీ, కేజీకి ఊహించని ధర!
ఆమెకు యాక్సిడెంట్ చేసి, పక్కటెముకలు విరిగేలా రాసానని, క్యాన్సర్ వచ్చేలా కథను రాసుకున్నానని, ఆ తర్వాత ఆమె జాగ్రత్తగా బౌన్స్ బ్యాక్ అయినట్టు కూడా రాసుకున్నట్లు చెప్పుకొచ్చారు. సెకండ్ హాఫ్లో మరోసారి వరుణ్తో ఎన్కౌంటర్ అయ్యాక, ఆమె మాట్లాడే ఒక్కో మాట ఒక్కో తూటాలా పేలేలా రాసుకున్నానని, కానీ నిడివి కారణంగా అవేవీ షూట్ చేయలేకపోయినట్లు ఫణీంద్ర పేర్కొన్నారు. అయితే, ఫణీంద్ర రాసిన పోస్ట్పై పలువురు భిన్నంగా స్పందిస్తున్నారు. ఇప్పట్లో ఇతను ఈ సినిమాని వదిలేలా లేడని కొందరు అంటుంటే, మరికొందరు మాత్రం ఒక కథ రాసుకున్న రచయితకు దానిపై ఉన్న ప్రేమ అలాంటిదని కామెంట్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : పెద్దల చదువుకు పెద్ద పీట.. వయోజనుల్లో అక్షరాస్యత పెంపుపై ప్రత్యేక శ్రద్ధ..
-
Supreme Court: సీఎం మమత తీరుపై సుప్రీంకోర్టు ఫైర్.. ‘మీ చర్య ప్రజాస్వామ్యానికే ప్రమాదం’.. అంటూ ఆగ్రహం!
-
TGSRTC : సమ్మె విరమించి యధావిధిగా విధుల్లోకి హాజరుకావాలి.. ఆర్టీసీ ఎండీ సూచన
-
Vivo X300 Ultra, Vivo X300 FE: కెమెరా కింగ్గా రాబోతున్న Vivo X300 సిరీస్.. రిలీజ్ డేట్ ఫిక్స్
-
CM Chandrababu: వర్మ తీరుపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అసహనం..
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?