Digital Arrest: ఎయిర్టెల్ అధికారిగా, ముంబై పోలీసులగా నటిస్తూ.. 70 ఏళ్ల మహిళ ఖాతా నుంచి రూ.78.89 లక్షలు స్వాహా
- డిజిటల్ అరెస్ట్ ఘటన
- 70 ఏళ్ల మహిళ ఖాతా నుంచి రూ.78.89 లక్షలు స్వాహా
- గురుగ్రామ్లో నివసిస్తున్న 70 ఏళ్ల మహిళను డిజిటల్గా అరెస్టు చేశారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సైబర్ మోసాలు, డిజిటల్ అరెస్ట్ ఘటనలు ఎక్కువై పోతున్నాయి. ఈజీగా డబ్బు సంపాదించుకునేందుకు కొందరు వ్యక్తులు అడ్డదార్లు తొక్కుతూ అమాయకులను మోసం చేస్తూ అందినకాడికి దోచుకుంటున్నారు. నకిలీ పోలీసు అధికారులుగా నటిస్తూ సైబర్ మోసగాళ్ళు గురుగ్రామ్లో నివసిస్తున్న 70 ఏళ్ల మహిళను డిజిటల్గా అరెస్టు చేశారు. ఆమె బ్యాంక్ ఖాతా, ఫోన్ నంబర్ను మనీలాండరింగ్ కోసం ఉపయోగించావని బెదిరించారు. ఆమె ఖాతాలను తనిఖీ చేసే పేరుతో నిందితులు రూ. 78,89,000 బదిలీ చేశారు. తన డబ్బు తిరిగి రాకపోవడంతో మోసపోయానని గ్రహించిన ఆ వృద్ధురాలు శనివారం సైబర్ పోలీస్ స్టేషన్ సౌత్లో ఫిర్యాదు చేసింది.
Also Read
- India vs Afghanistan: భారత క్రికెట్లో చారిత్రక ఘట్టం.. మ్యాచ్కు ముందు తొలిసారి పూర్తి ‘వందేమాతరం’..
- Sangameswara Temple: 5 వారాల్లోనే మారిన సీన్.. శ్రీశైలం డ్యామ్లో తగ్గుతున్న నీరు.. దర్శనమిస్తున్న సంగమేశ్వర ఆలయ శిఖరం..
- Khairatabad Ganesh: 72 ఏళ్ల ఖైరతాబాద్ గణపతి వైభవం.. బడా గణేష్ పూర్తి చరిత్ర ఇదే..(వీడియో)
- Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
సెక్టార్ 67 M3M మెర్లిన్ సొసైటీకి చెందిన తమితా సేథి, నవంబర్ 22న తనకు తెలియని నంబర్ నుంచి కాల్ వచ్చిందని సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాల్ చేసిన వ్యక్తి తనను తాను ఎయిర్టెల్ నుంచి పరిచయం చేసుకున్నాడని తెలిపింది. తన ఫోన్ నంబర్ చట్టవిరుద్ధ కార్యకలాపాలకు ఉపయోగిస్తున్నారని, ఆమెపై అరెస్ట్ వారెంట్ జారీ చేశారని నిందితుడు చెప్పినట్లు వెల్లడించింది.
ఆ తర్వాత, నవంబర్ 25న, ఆమెకు మరో వాట్సాప్ కాల్ వచ్చింది. కాల్ చేసిన వ్యక్తి తనను ముంబై పోలీసునని పరిచయం చేసుకున్నాడు. తనను డిజిటల్గా అరెస్టు చేస్తున్నట్లు చెప్పాడు. తన ఫోన్ నంబర్, బ్యాంక్ ఖాతాలను మనీలాండరింగ్ కోసం ఉపయోగిస్తున్నారని చెప్పాడు. వీడియో కాల్లో ఉన్న వ్యక్తి పోలీసు యూనిఫాంలో, వెనుక భాగంలో జెండాతో ఉన్నట్లు కనిపించడంతో నిజమేనని భావించినట్లు బాధిత మహిళ తెలిపింది.
Also Read:AP Govt: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఒకే జీవోలో ఇద్దరు సీఎస్ల నియామకం..
ఆ నకిలీ పోలీసు అధికారి ఆ వృద్ధ మహిళ నుంచి ఆమె ఖాతా లావాదేవీలు గురించి సమాచారం పొందాడు. తరువాత, ఆమె ఖాతాలను తనిఖీ చేసే కారణంతో, రూ. 78,89,000 ఆన్లైన్లో బదిలీ చేసుకున్నాడు. దర్యాప్తు పూర్తయిన తర్వాత డబ్బు తిరిగి ఇస్తామని ఆమెకు చెప్పాడు. కానీ డబ్బు తిరిగి రాలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా సైబర్ పోలీస్ స్టేషన్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది.
తాజావార్తలు
-
Jasprit Bumrah Record: రీఎంట్రీ అదుర్స్.. జస్ప్రీత్ బుమ్రా అరుదైన ఘనత!
-
Nawazuddin Siddiqui: ఒక్క సినిమా.. టేబుల్పై 200 స్క్రిప్టులు, బ్లాంక్ చెక్కులు.. నవాజుద్దీన్కు స్టార్ ఇమేజ్ తెచ్చిన మూవీ ఇదే!
-
India vs Afghanistan: భారత క్రికెట్లో చారిత్రక ఘట్టం.. మ్యాచ్కు ముందు తొలిసారి పూర్తి ‘వందేమాతరం’..
-
Sangameswara Temple: 5 వారాల్లోనే మారిన సీన్.. శ్రీశైలం డ్యామ్లో తగ్గుతున్న నీరు.. దర్శనమిస్తున్న సంగమేశ్వర ఆలయ శిఖరం..
-
Khairatabad Ganesh: 72 ఏళ్ల ఖైరతాబాద్ గణపతి వైభవం.. బడా గణేష్ పూర్తి చరిత్ర ఇదే..(వీడియో)
ట్రెండింగ్
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!
-
Chamari Athapaththu: మేము చెత్తగా ఆడాం.. కన్నీరు ఆపుకోలేకపోయాను.. శ్రీలంక కెప్టెన్ భావోద్వేగం!
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!