Digital Arrest: ఎయిర్టెల్ అధికారిగా, ముంబై పోలీసులగా నటిస్తూ.. 70 ఏళ్ల మహిళ ఖాతా నుంచి రూ.78.89 లక్షలు స్వాహా
- డిజిటల్ అరెస్ట్ ఘటన
- 70 ఏళ్ల మహిళ ఖాతా నుంచి రూ.78.89 లక్షలు స్వాహా
- గురుగ్రామ్లో నివసిస్తున్న 70 ఏళ్ల మహిళను డిజిటల్గా అరెస్టు చేశారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సైబర్ మోసాలు, డిజిటల్ అరెస్ట్ ఘటనలు ఎక్కువై పోతున్నాయి. ఈజీగా డబ్బు సంపాదించుకునేందుకు కొందరు వ్యక్తులు అడ్డదార్లు తొక్కుతూ అమాయకులను మోసం చేస్తూ అందినకాడికి దోచుకుంటున్నారు. నకిలీ పోలీసు అధికారులుగా నటిస్తూ సైబర్ మోసగాళ్ళు గురుగ్రామ్లో నివసిస్తున్న 70 ఏళ్ల మహిళను డిజిటల్గా అరెస్టు చేశారు. ఆమె బ్యాంక్ ఖాతా, ఫోన్ నంబర్ను మనీలాండరింగ్ కోసం ఉపయోగించావని బెదిరించారు. ఆమె ఖాతాలను తనిఖీ చేసే పేరుతో నిందితులు రూ. 78,89,000 బదిలీ చేశారు. తన డబ్బు తిరిగి రాకపోవడంతో మోసపోయానని గ్రహించిన ఆ వృద్ధురాలు శనివారం సైబర్ పోలీస్ స్టేషన్ సౌత్లో ఫిర్యాదు చేసింది.
Also Read
- Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
- Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
- Jobs: నిరుద్యోగులకు గొప్ప అవకాశం.. నెలకు శాలరీ రూ.1.99 లక్షలు..
- Petrol-Diesel Price: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై పుకార్లు.. ఎంత పెరగవచ్చంటే..!
సెక్టార్ 67 M3M మెర్లిన్ సొసైటీకి చెందిన తమితా సేథి, నవంబర్ 22న తనకు తెలియని నంబర్ నుంచి కాల్ వచ్చిందని సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాల్ చేసిన వ్యక్తి తనను తాను ఎయిర్టెల్ నుంచి పరిచయం చేసుకున్నాడని తెలిపింది. తన ఫోన్ నంబర్ చట్టవిరుద్ధ కార్యకలాపాలకు ఉపయోగిస్తున్నారని, ఆమెపై అరెస్ట్ వారెంట్ జారీ చేశారని నిందితుడు చెప్పినట్లు వెల్లడించింది.
ఆ తర్వాత, నవంబర్ 25న, ఆమెకు మరో వాట్సాప్ కాల్ వచ్చింది. కాల్ చేసిన వ్యక్తి తనను ముంబై పోలీసునని పరిచయం చేసుకున్నాడు. తనను డిజిటల్గా అరెస్టు చేస్తున్నట్లు చెప్పాడు. తన ఫోన్ నంబర్, బ్యాంక్ ఖాతాలను మనీలాండరింగ్ కోసం ఉపయోగిస్తున్నారని చెప్పాడు. వీడియో కాల్లో ఉన్న వ్యక్తి పోలీసు యూనిఫాంలో, వెనుక భాగంలో జెండాతో ఉన్నట్లు కనిపించడంతో నిజమేనని భావించినట్లు బాధిత మహిళ తెలిపింది.
Also Read:AP Govt: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఒకే జీవోలో ఇద్దరు సీఎస్ల నియామకం..
ఆ నకిలీ పోలీసు అధికారి ఆ వృద్ధ మహిళ నుంచి ఆమె ఖాతా లావాదేవీలు గురించి సమాచారం పొందాడు. తరువాత, ఆమె ఖాతాలను తనిఖీ చేసే కారణంతో, రూ. 78,89,000 ఆన్లైన్లో బదిలీ చేసుకున్నాడు. దర్యాప్తు పూర్తయిన తర్వాత డబ్బు తిరిగి ఇస్తామని ఆమెకు చెప్పాడు. కానీ డబ్బు తిరిగి రాలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా సైబర్ పోలీస్ స్టేషన్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది.
తాజావార్తలు
-
Off The Record : విచ్చలవిడిగా ఇసుక అక్రమాలు.. మైనింగ్ ఏడీ ఫణిభూషణ్ పై తీవ్ర ఆరోపణలు
-
Story Board : నిర్లక్ష్యానికి శిక్షల్లేవా? పిల్లల మానసిక వేదన పట్టించుకోరా?
-
Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
-
DGP CV Anand: ఉగ్ర ముప్పుపై తెలంగాణ అప్రమత్తం.. OCTOPUS యాక్షన్ ప్లాన్..!
-
Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!