Rajasthan: హైవేపై ట్రక్కు యూటర్న్.. దూసుకెళ్లిన కారు.. ఆరుగురి మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఓ ట్రక్కు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఆరుగురు నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. హైవేపై ట్రక్కు దూసుకెళ్తుండగా హఠాత్తుగా యూటర్న్ తీసుకున్నాడు. అంతే వెనుక నుంచి వస్తున్న కారు దాంట్లోకి దూసుకుపోయింది. అక్కడికక్కడే ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతిచెందారు. రాజస్థాన్లోని సవాయ్ మాధోపూర్ జిల్లాలో ఢిల్లీ-ముంబై ఎక్స్ప్రెస్వేపై ఈ ఘోరం జరిగింది. మరో ఇద్దరు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. ఆదివారం జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు బయటకు వచ్చింది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి భజన్లాల్ శర్మ, డిప్యూటీ సీఎం దియా కుమారి, ఆర్ఎల్పీ నేత హనుమాన్ బెనివాల్ సంతాపం వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి: Elephant attack: ఏనుగుల దాడిలో ప్రముఖ న్యూస్ ఛానెల్ కెమెరామెన్ మృతి..
Also Read
- UPI Charges: UPI ఛార్జీలపై కీలక అప్డేట్.. కిరాణా దుకాణాలు, చిన్న వ్యాపారులకు గుడ్న్యూస్
- Jharkhand: జార్ఖండ్లో పేపర్ లీక్ నిరసనలు.. ప్రభుత్వంతో చర్చలు విఫలం
- Rashid Khan Creates ODI History: వన్డేల్లో అరుదైన రికార్డు.. తొలి స్పిన్నర్గా చరిత్ర సృష్టించిన రషీద్ ఖాన్..
- Bengaluru: బాత్రూమ్లో మహిళ అస్థిపంజరం లభ్యం.. ట్విస్ట్ ఏంటంటే..!
కేసు నమోదు చేసుకున్న పోలీసులు లారీని స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్ మాత్రం పరారీలో ఉన్నాడు. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా.. ఇద్దరు పిల్లలు గాయపడ్డారని పోలీసులు తెలిపారు. వారిని జైపూర్కు తరలించి చికిత్స అందించడంతో క్షేమంగా ఉన్నారని అడిషనల్ ఎస్పీ దినేష్ కుమార్ తెలిపారు. సికార్ జిల్లాలోని ఖండేలాకు చెందిన ఒక కుటుంబం సవాయ్ మాధోపూర్లోని గణేష్ ఆలయంలో ప్రార్థనలు చేసేందుకు వెళుతున్నట్లు తెలిపారు.
ఇది కూడా చదవండి: Ian Gelder: ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ నటుడు కన్నుమూత
మృతులు మనీష్ శర్మ, అతని భార్య అనితా శర్మ, సతీష్ శర్మ, పూనమ్, అతని అత్త సంతోష్, అతని స్నేహితుడు కైలాష్గా గుర్తించారు. మనన్, దీపాలి అనే ఇద్దరు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి చెందడం బాధాకరమని ముఖ్యమంత్రి భజన్లాల్ శర్మ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు అన్ని విధాలా సహాయం అందించాలని అధికారులకు సీఎం ఆదేశించారు.
ఇది కూడా చదవండి: Palnadu: పల్నాడు జిల్లాలో బాంబులు, కత్తులు, వేట కొడవళ్లు కలకలం
తాజావార్తలు
-
UPI Charges: UPI ఛార్జీలపై కీలక అప్డేట్.. కిరాణా దుకాణాలు, చిన్న వ్యాపారులకు గుడ్న్యూస్
-
Jharkhand: జార్ఖండ్లో పేపర్ లీక్ నిరసనలు.. ప్రభుత్వంతో చర్చలు విఫలం
-
Rashid Khan Creates ODI History: వన్డేల్లో అరుదైన రికార్డు.. తొలి స్పిన్నర్గా చరిత్ర సృష్టించిన రషీద్ ఖాన్..
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
Bengaluru: బాత్రూమ్లో మహిళ అస్థిపంజరం లభ్యం.. ట్విస్ట్ ఏంటంటే..!
ట్రెండింగ్
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!