Rajasthan: హైవేపై ట్రక్కు యూటర్న్.. దూసుకెళ్లిన కారు.. ఆరుగురి మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఓ ట్రక్కు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఆరుగురు నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. హైవేపై ట్రక్కు దూసుకెళ్తుండగా హఠాత్తుగా యూటర్న్ తీసుకున్నాడు. అంతే వెనుక నుంచి వస్తున్న కారు దాంట్లోకి దూసుకుపోయింది. అక్కడికక్కడే ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతిచెందారు. రాజస్థాన్లోని సవాయ్ మాధోపూర్ జిల్లాలో ఢిల్లీ-ముంబై ఎక్స్ప్రెస్వేపై ఈ ఘోరం జరిగింది. మరో ఇద్దరు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. ఆదివారం జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు బయటకు వచ్చింది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి భజన్లాల్ శర్మ, డిప్యూటీ సీఎం దియా కుమారి, ఆర్ఎల్పీ నేత హనుమాన్ బెనివాల్ సంతాపం వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి: Elephant attack: ఏనుగుల దాడిలో ప్రముఖ న్యూస్ ఛానెల్ కెమెరామెన్ మృతి..
Also Read
- Jani Master: నిర్మాతల డబ్బులు దోచేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా?
- MLA Yarlagadda Venkata Rao: గన్నవరం ఎమ్మెల్యే గైర్హాజరుతో మళ్లీ చర్చ.. ఏటీసీ ప్రారంభోత్సవానికి ఎందుకు డుమ్మా..?
- Meerut Murder: ఆరేళ్ల క్రితం ప్రేమ పెళ్లి.. డ్రైవర్తో ఎఫైర్.. భర్తను పాముతో కరిపించి చంపేసిన భార్య..
- WHO Cancer Report 2026: ఏడాదికి కోటి మంది మృతి..! క్యాన్సర్పై WHO షాకింగ్ నివేదిక..
కేసు నమోదు చేసుకున్న పోలీసులు లారీని స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్ మాత్రం పరారీలో ఉన్నాడు. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా.. ఇద్దరు పిల్లలు గాయపడ్డారని పోలీసులు తెలిపారు. వారిని జైపూర్కు తరలించి చికిత్స అందించడంతో క్షేమంగా ఉన్నారని అడిషనల్ ఎస్పీ దినేష్ కుమార్ తెలిపారు. సికార్ జిల్లాలోని ఖండేలాకు చెందిన ఒక కుటుంబం సవాయ్ మాధోపూర్లోని గణేష్ ఆలయంలో ప్రార్థనలు చేసేందుకు వెళుతున్నట్లు తెలిపారు.
ఇది కూడా చదవండి: Ian Gelder: ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ నటుడు కన్నుమూత
మృతులు మనీష్ శర్మ, అతని భార్య అనితా శర్మ, సతీష్ శర్మ, పూనమ్, అతని అత్త సంతోష్, అతని స్నేహితుడు కైలాష్గా గుర్తించారు. మనన్, దీపాలి అనే ఇద్దరు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి చెందడం బాధాకరమని ముఖ్యమంత్రి భజన్లాల్ శర్మ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు అన్ని విధాలా సహాయం అందించాలని అధికారులకు సీఎం ఆదేశించారు.
ఇది కూడా చదవండి: Palnadu: పల్నాడు జిల్లాలో బాంబులు, కత్తులు, వేట కొడవళ్లు కలకలం
తాజావార్తలు
-
Jani Master: నిర్మాతల డబ్బులు దోచేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా?
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
Childhood Trauma: కళ్ల ముందే తల్లి హత్య.. ఈ చిన్నారుల ఆవేదన చూస్తే కన్నీళ్లు ఆగవు!
-
Ather Battery Update: ఏథర్ స్కూటర్లకు కొత్త బ్యాటరీ అప్డేట్.. ఇప్పుడు ఎక్కువ రేంజ్, వేగవంతమైన ఛార్జింగ్!
-
MLA Yarlagadda Venkata Rao: గన్నవరం ఎమ్మెల్యే గైర్హాజరుతో మళ్లీ చర్చ.. ఏటీసీ ప్రారంభోత్సవానికి ఎందుకు డుమ్మా..?
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!